1975 నుంచి 2019 వరకు వరల్డ్ కప్‌ విజేతలు..!

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ ప్రారంభమైన  విషయం తెలిసిందే. భారత్‌ ఒంటరిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీనికి ముందు 1987లో పాకిస్థాన్‌తో, 1996లో శ్రీలంక మరియు పాకిస్థాన్‌తో, 2011లో బంగ్లాదేశ్ మరియు శ్రీలంకతో కలిసి భారత్ మూడుసార్లు వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించింది. 1975లో ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ ప్రస్థానం ఇప్పటివరకు 12 ఎడిషన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు జరగబోయేది 13వ ఎడిషన్. ఈ 12 ఎడిషన్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా […]

Share:

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ ప్రారంభమైన  విషయం తెలిసిందే. భారత్‌ ఒంటరిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీనికి ముందు 1987లో పాకిస్థాన్‌తో, 1996లో శ్రీలంక మరియు పాకిస్థాన్‌తో, 2011లో బంగ్లాదేశ్ మరియు శ్రీలంకతో కలిసి భారత్ మూడుసార్లు వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించింది.

1975లో ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ ప్రస్థానం ఇప్పటివరకు 12 ఎడిషన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు జరగబోయేది 13వ ఎడిషన్. ఈ 12 ఎడిషన్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా ఐదు సార్లు విజేతగా నిలవగా.. వెస్టిండీస్, ఇండియా రెండేసి సార్లు.. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఒక్కోసారి ఛాంపియన్ నిలిచాయి. మొదటిసారి వన్డే వరల్డ్ కప్ జరిగిన 1975లో 60 ఓవర్ల మ్యాచ్ లు నిర్వహించారు. అనగా ఒక్కో ఇన్నింగ్స్ కు 60 ఓవర్ల చొప్పున ఉండేవి. అనంతరం 1987 నుంచి ఓవర్లను 50కి కుదించారు. 

1975 నుంచి 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో ఎవరు..? ఎప్పుడు..? విజేతగా నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం..

1975 ప్రపంచ కప్-  క్రికెట్ ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ ఇంగ్లాండ్‌ వేదికగా జరిగింది. ఎస్. వెంకటరాఘవన్ నేతృత్వంలో భారత్​ తొలి ప్రపంచకప్​ ఆడింది. అయితే ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌లలో భారత్ 1 మాత్రమే గెలిచి 5వ స్థానంలో నిలిచింది. కాగా.. ఆ ఏడాది ప్రపంచకప్ విజేతగా వెస్టిండీస్ జట్టు నిలిచింది.

1979 ప్రపంచ కప్ – ఈ సారి కూడా ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్​ వెనుతిరిగింది. ఈ క్రమంలో భారత్ 7వ స్థానంలో నిలిచింది. అయితే ఆ టర్నీలో వెస్టిండీస్ జట్టు రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 

1983 ప్రపంచ కప్ – మూడోసారి కూడా ప్రపంచకప్​ ఇంగ్లాండ్‌లోనే జరిగింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు భారత జట్టును బలహీనంగా పరిగణించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీమ్ఇండియా ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. లీగ్ రౌండ్‌లో వెస్టిండీస్ వంటి బలమైన జట్టును ఓడించి తమ సత్తా చాటారు. అలా కపిల్ దేవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా తొలిసారి ప్రపంచకప్​ను ముద్దాడింది.

1987 ప్రపంచ కప్- ఈ టోర్నీ భారత్​, పాకిస్థాన్​ సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇచ్చాయి. ఇక తొలిసారిగా ప్రపంచకప్‌ను 60 ఓవర్లకు బదులుగా 50 ఓవర్లలో నిర్వహించారు. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఇక హోరా హోరీగా జరిగిన ఫైనల్స్​లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

1992 ప్రపంచ కప్ – న్యూజిలాండ్​తో పాటు ఆస్ట్రేలియా సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాయి. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఈ ప్రపంచకప్‌లో మిశ్రమ ప్రదర్శన చేసింది. క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ ఈ టోర్నీతోనే ప్రపంచకప్​లోకి అరంగేట్రం చేశారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ జట్టు.. ఆ టోర్నిలో జరిగిన ఫైనల్స్​లో ఇంగ్లాండ్‌ జట్టును ఓడించి కప్​ను కైవసం చేసుకుంది.

1996 ప్రపంచ కప్ – ఈ సారి జరిగిన టోర్నీకి భారత్​ ఆతిథ్యం ఇచ్చింది. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమ్ ఇండియా కెన్యా, వెస్టిండీస్‌లను ఓడించి శుభారంభం చేసింది. ఇక క్వార్టర్స్‌లో పాకిస్థాన్​ను మట్టికరిపించిన భారత్.. సెమీస్​లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇక ఆ టోర్నీ ఫైనల్స్​లో కంగారూ జట్టును చిత్తు చేసి లంక జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది.

1999 ప్రపంచ కప్ – ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్​ ఆతిథ్యం ఇచ్చింది. మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో నడిచిన టీమ్ఇండియా ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది. లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లను ఓడించిన భారత్.. క్వార్టర్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఆ ఏడాది కప్​ను ఆస్ట్రేలియా జట్టు అందుకుంది.

2003 ప్రపంచ కప్- సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్​ 2003లో ప్రపంచకప్​కు పోటీపడింది. దక్షిణాఫ్రికా తొలిసారి కప్​ కోసం ఆతిథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఈ టోర్నీలో భారత జట్టు అద్భుతంగా రాణించి.. ఆస్ట్రేలియా మినహా అన్ని జట్లను చిత్తు చేసింది. అయితే ఫైనల్స్​లో జరిగిన ఉత్కంఠ పోరులో 125 పరుగుల భారీ తేడాతో ఆసిస్​ జట్టు విజయాన్ని అందుకుంది.

2007 ప్రపంచకప్ – వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్​లో సచిన్ , గంగూలీ, ద్రవిడ్, యువరాజ్ సింగ్ లాంటి సూపర్ స్టార్లు ఆడారు. అయితే బంగ్లాదేశ్ వంటి బలహీన జట్టు చేతిలో ఓడిన భారత్​.. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అలా 9వ స్థానంలో సరిపెట్టుకుంది. ఇక రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు నాలుగోసారి ప్రపంచ ఛాంపియన్‌గా 

కార్డుకెక్కింది.

2011 ప్రపంచ కప్ – క్రికెట్​ లవర్స్ ఎవరూ ఈ ప్రపంచకప్​ను అస్సలు మర్చిపోలేరు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రపంచకప్​ను భారత్​ ముద్దాడుతున్న క్షణాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్లల్లో మెదులుతూనే ఉంటాయి. భారత్​, బంగ్లాదేశ్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో.. కెప్టెన్ కూల్​ ​ మహేంద్ర సింగ్ ధోనీ సారథిగా వ్యవహరించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా.. సెమీఫైనల్లో పాకిస్థాన్‌ జట్లను ఓడించిన భారత్​.. ఫైనల్లో శ్రీలంకను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

2015 ప్రపంచ కప్ – ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2015 ప్రపంచ కప్‌లో.. భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి సెమీ-ఫైనల్స్​కు చేరుకుంది. అయితే సెమీస్​లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన భారత్​.. మూడో సారి ప్రపంచకప్​ను అందుకోలేకపోయింది. ఇక ఫైనల్స్​లో న్యూజిలాండ్‌ను ఓడించి కంగారూ జట్టు.. 5వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది.
2019 ప్రపంచ కప్ – ఇంగ్లాండ్​ ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు.. రన్నింగ్​ మెషిన్​ విరాట్ కోహ్లి సారథ్యంలో బరిలోకి దిగింది. అద్భుత ప్రదర్శనతో చేసి సెమీఫైనల్‌కు చేరుకున్న టీమ్ఇండియా..సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి పంచకప్ నుంచి నిష్క్రమించింది. అయితే ఫైనల్స్​లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఇంగ్లాండ్​.. తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.