విరాట్ కోహ్లీ 500వ ఇంట‌ర్నేష‌నల్ మ్యాచ్

విరాట్ కోహ్లీ పేరుకి పరిచయం అక్కర్లేదు. అతను భారత క్రికెట్‌కు మూలస్తంభం. క్రికెట్ ఆట పట్ల అతని అంకితభావం ఎనలేనివి. 2008లో శ్రీలంకు వ్యతిరేకంగా ఆడటానికి  అరంగేట్రం చేసిన కోహ్లీ, ఇప్పుడు ప్రస్తుతం తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, MS ధోనీ వంటి వారితో సహా నాలుగవడిగా ఇప్పుడు లిస్టులో చేరబోతున్నాడు. దీని గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తనకు చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. […]

Share:

విరాట్ కోహ్లీ పేరుకి పరిచయం అక్కర్లేదు. అతను భారత క్రికెట్‌కు మూలస్తంభం. క్రికెట్ ఆట పట్ల అతని అంకితభావం ఎనలేనివి. 2008లో శ్రీలంకు వ్యతిరేకంగా ఆడటానికి  అరంగేట్రం చేసిన కోహ్లీ, ఇప్పుడు ప్రస్తుతం తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, MS ధోనీ వంటి వారితో సహా నాలుగవడిగా ఇప్పుడు లిస్టులో చేరబోతున్నాడు. దీని గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తనకు చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆ వీడియో BCCI సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది. 

సంతోషాన్ని బయటపెట్టిన విరాట్: 

ప్రస్తుతం తన ఆడబోయే 500వ 00 మ్యాచ్తో విరాట్ కోహ్లీ ఒక కొత్త మైలురాయి దాటపోతున్నాడు. దీని గురించి కోహ్లీ సంతోషంగా ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తాను  నిజంగా కృతజ్ఞుడని, ఇంత సుదీర్ఘ ప్రయాణం, భారతదేశం కోసం ఆడటం, టెస్ట్ కెరీర్‌ను ఇంత బాగా కొనసాగించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, నిజంగా దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, అంతేకాకుండా ఇప్పుడు అధిగమించబోయే మైలురాయి సంతోషాన్నిస్తుందని పేర్కొన్నాడు. సంవత్సరాల తరబడి చేసిన తన కృషికి తగిన ఫలితం చూడటం ఆనందంగా ఉంది అన్నాడు.

మైలురాయి అధిగమించనున్న కోహ్లీ: 

వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో గురువారం (జూలై 20) జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు అతనికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉండగా, తొలి మ్యాచ్‌లో కోహ్లి 76 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు భారత్-వెస్టిండీస్ 100వ మ్యాచ్, రోజున కోహ్లీ 500వ మ్యాచ్ ఆడి కొత్త మైలురాయి అధిగమించబోతున్నాడు.

అతను అత్యధిక పరుగులు, బ్యాటింగ్ , అత్యధిక సెంచరీలు, అర్ధ సెంచరీలు, స్ట్రైక్ రేట్ మొదలైనవాటిలో అగ్రస్థానంలో ఉన్నాడు. వీటన్నిటిలో కూడా అతను ఎక్కడ తగ్గకుండా తన సత్తా చాటాడు. 

విరాట్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు: 

అతను 499 మ్యాచ్‌లలో 53.48 సగటుతో మరియు 79.11 స్ట్రైక్ రేట్‌తో 25,461 పరుగులతో ముందంజలో ఉన్నాడు. ఆ మ్యాచ్‌ల్లో అతను 75 సెంచరీలు, 131 అర్ధసెంచరీలు చేశాడు. 34 ఏళ్ల అతను అన్ని ఫార్మాట్లలో 50-ప్లస్ యావరేజ్ ఉన్న ఏకైక ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో 100కు పైగా క్రికెట్ మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్.

విరాట్ కోహ్లీ గురించి మారింత: 

2వ రోజు కూడా వెస్టిండీస్ కి ఎదురుగా పోరాడింది భారత్. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఎలైట్ జాబితాలో సెహ్వాగ్ (8503)ను,కోహ్లీ అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122), వివిఎస్ లక్ష్మణ్ (8781) తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. 

5 నవంబర్ 1988న ఎందుకు జన్మించిన కోహ్లీ, ఇప్పుడు ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అతను IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు భారత క్రికెట్‌లో ఢిల్లీ తరపున బ్యాట్స్‌మన్‌గా గొప్ప పేరు పొందడు. కోహ్లీ T20 అంతర్జాతీయ IPLలో అత్యధిక పరుగులు చేసిన రికార్డులను సృష్టించాడు. 2020లో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతన్ని క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అని పేర్కొంది. 2011 ప్రపంచకప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో సహా భారతదేశ విజయాలను కోహ్లి తన సొంతం చేసుకున్నాడు.