శుభమన్ గిల్ – యశశ్వి జైస్వాల్ క్రికెట్ జోడిని పొగిడిన రాబిన్

భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ల హవా నడుస్తోందని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో తమదైన ఆట తీరుతో అదరగొట్టిన శుభమాన్ గిల్-యశశ్వి జైస్వాల్ అభిమానుల నుంచే కాకుండా ఎంతోమంది భారత క్రికెట్ ఆటగాళ్ల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. భారతదేశం కోసం ఆడే ప్రతి ఒక్కరూ సమాన సామర్థ్యం కలిగి ఉంటారని, అయితే యశస్వి జైస్వాల్ మరియు శుభ్‌మాన్ గిల్ కలిసి బ్యాటింగ్ చేసే విధానం, ఇద్దరు కలిసి ఆడిన తీరు అమోఘం అని.. ఇలానే ఆట తీరు […]

Share:

భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ల హవా నడుస్తోందని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో తమదైన ఆట తీరుతో అదరగొట్టిన శుభమాన్ గిల్-యశశ్వి జైస్వాల్ అభిమానుల నుంచే కాకుండా ఎంతోమంది భారత క్రికెట్ ఆటగాళ్ల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. భారతదేశం కోసం ఆడే ప్రతి ఒక్కరూ సమాన సామర్థ్యం కలిగి ఉంటారని, అయితే యశస్వి జైస్వాల్ మరియు శుభ్‌మాన్ గిల్ కలిసి బ్యాటింగ్ చేసే విధానం, ఇద్దరు కలిసి ఆడిన తీరు అమోఘం అని.. ఇలానే ఆట తీరు కొనసాగితే, రాబోయే రోజుల్లో వారు భారత్‌కు తప్పకుండా చాలా మంచి, సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీగా మారతారు అని రాబిన్ ఉతప్ప అన్నారు. 

అభినందనల వర్షం: 

ఈ మధ్యకాలంలో తమదైన ఆట తీరుతో అదరగొట్టిన శుభమాన్ గిల్-యశశ్వి జైస్వాల్ అభిమానుల నుంచే కాకుండా ఎంతోమంది భారత క్రికెట్ ఆటగాళ్ల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. భారతదేశం కోసం ఆడే ప్రతి ఒక్కరూ సమాన సామర్థ్యం కలిగి ఉంటారని, అయితే యశస్వి జైస్వాల్ మరియు శుభ్‌మాన్ గిల్ కలిసి బ్యాటింగ్ చేసే విధానం, ఇద్దరు కలిసి ఆడిన తీరు అమోఘం అని.. ఇలానే ఆట తీరు కొనసాగితే, రాబోయే రోజుల్లో వారు భారత్‌కు తప్పకుండా చాలా మంచి, సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీగా మారతారు అని రాబిన్ ఉతప్ప అన్నారు. అయితే అప్పట్లో, గంగూలీ, సచిన్‌లు 176 వన్డే ఇన్నింగ్స్‌లలో 8227 పరుగులు చేశారు. ఓపెనర్లుగా, వారు 136 ఇన్నింగ్స్‌లలో 6609 పరుగులు సాధించారు, ఇది ODI కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సచిన్ సౌరవ్ కలిసి నమోదు చేసిన పరుగుల రికార్డు కూడా. ఇప్పుడు T20I నాలుగో మ్యాచ్ లో కూడా భారత క్రికెట్ ఆటగాళ్లు తమదైన సత్తను చూపించి టి20 ఐదవ మ్యాచ్ లోకి అడుగు పెట్టారు. వెస్టిండీస్ తో ఆడిన నాలుగవ T20I మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 

యశస్వి గురించి మరింత: 

ప్రస్తుతం మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టి అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఇంటర్వ్యూల కోసం మీడియాలో బారులు తీరుతున్నాయి. అంతేకాకుండా, టెస్ట్ మ్యాచ్ అనంతరం తను బాగుద్వేగానికి గురవుతూ, తన విజయం తన తల్లిదండ్రులకు అంకితం అంటూ చెప్పిన విధానంతో ప్రతి ఒక్కరు మనసు పెంచుకున్నాడు. 

జైస్వాల్ నిజానికి చాలా కష్టం లో నుంచి ఎదిగాడు. తన క్రికెట్ కలను కొనసాగించడానికి గుడిసెలో నివసించేవాడు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూనే తన సాధనను మానుకోలేదు. దేశీయ సర్క్యూట్‌లో ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత, యువ ఓపెనర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

అతను 2020లో IPL అరంగేట్రం చేసినప్పటికీ, జైస్వాల్ ఈ సంవత్సరం తన మరోవైపును ప్రతి ఒక్కరికి పరిచయం చేశాడు. 14 మ్యాచ్‌లలో 163.61 యొక్క అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో మరియు 48.08 సగటుతో 625 పరుగులు చేశాడు. ఓపెనర్గా వచ్చి ఎడమచేతి వాటం చూపించి  సెంచరీ కూడా చేశాడు. ఈ ప్రదర్శన చివరికి జైస్వాల్‌కి వెస్టిండీస్ పర్యటనకు భారతదేశం పిలుపునిచ్చింది; అతను పర్యటనలో T20I కూడా ఒక భాగం. 

ఇలాంటి వాళ్లు మరెన్నో సాధించాలి: 

ఏది ఏమైనాప్పటికీ యశస్వి జైస్వాల్ మరియు శుభ్‌మాన్ గిల్ వంటి యువ క్రికెటర్లు మరెందరో రావాలని, అంతేకాకుండా వారు కృషికి తగ్గ ఫలితాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జైస్వాల్ లాంటి ఎంతోమంది పేదవాళ్లు క్రికెటర్ అవ్వాలనే తమ కలను నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి వారిని కూడా ప్రోత్సహిస్తే గొప్ప క్రికెటర్లుగా మారుతారు. విరాట్ కోహ్లీ, ధోని, సచిన్ టెండూల్కర్ ఇలా ఎంతో మంది క్రికెటర్లు కలలను సహకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడి పెద్ద క్రికెటర్లుగా అవతరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఎంతోమంది మన భారత క్రికెట్ జట్టులోకి చేరాలని ఆశిద్దాం