స్పాట్ ఏదైనా తగ్గేదేలే అంటున్న శ్రేయస్ అయ్యర్ 

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించేందుకు సెంచరీ చేసిన తర్వాత, ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆదివారం చాలా రోజులుగా గాయంతో బాధపడుతున్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు 90 బంతుల్లో 105 పరుగులు చేసి భారత్‌ను ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరుకు తీసుకువెళ్లాడు, ఇది చివరికి జట్టును సిరీస్ విజయానికి దారితీసింది.  మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్: గత కొన్ని నెలలుగా, గాయం కారణంగా […]

Share:

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించేందుకు సెంచరీ చేసిన తర్వాత, ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆదివారం చాలా రోజులుగా గాయంతో బాధపడుతున్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు 90 బంతుల్లో 105 పరుగులు చేసి భారత్‌ను ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరుకు తీసుకువెళ్లాడు, ఇది చివరికి జట్టును సిరీస్ విజయానికి దారితీసింది. 

మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్:

గత కొన్ని నెలలుగా, గాయం కారణంగా చాలా కష్టపడుతున్నానని.. తాను ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయ్యానని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అయ్యర్, మ్యాచ్ తర్వాత చెప్పాడు. 28 ఏళ్ల అతను, ఆసియా కప్‌లో జట్టులో చేరి, మరోసారి తన ఆట తీరును ప్రదర్శించాడు. అయితే టోర్నమెంట్ మధ్యలో వెన్నునొప్పి రావడంతో, అతను రెండు వారాల వ్యవధిలో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్‌కు దిగాడు.

అయితే మ్యాచ్ ఆడేందుకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని. డ్రెస్సింగ్ రూమ్ లోని వాతావరణాన్ని ఆశీర్వదిస్తున్నానని, ముఖ్యంగా టీవీలో మ్యాచులు చూసినప్పుడు తాను కూడా ఆడితే బాగుండు అని ఆలోచించినట్లు వెల్లడించాడు అయ్యర్. అంతేకాకుండా తనకి తన మీద అపారమైన నమ్మకంతో, తాను లక్ష్యం సాధించగలనన్న పట్టుదలతో ముందుకు సాగానని, అలా ఆలోచించి చేసిన ప్రణాళికలను, ఇప్పుడు మ్యాచ్ లో అమల్లోకి తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

ఆసీస్‌పై తన వ్యూహం గురించి మాట్లాడుతూ, విలో ఆడాలనేది నిజానికి తన ప్రణాళిక అని, అయితే ఇక్కడ విషయాలను మరింత కష్టం చేయడం తన ఉద్దేశం కాదని. తాను ఎప్పటికప్పుడు నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేశానని.. తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇలా బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు అయ్యర్. జట్టుకు ఏది అవసరమో అది చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని..విరాట్ కోహ్లి గొప్పవారిలో ఒకడని, అయితే అతని మూడవ స్పాట్ దొంగలించే ఉద్దేశం తనకి లేదని.. అంతేకాకుండా తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా స్కోర్ చేస్తూనే ఉండాలనేది తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు.. శ్రేయస్ అయ్యర్. 

కొన్ని కీలకమైన మ్యాచెస్ జరగాల్సి ఉన్న క్రమంలో, ఇంతకుముందే బిసిసిఐ ప్రకటించిన కొంతమంది ఆటగాళ్ల మెడికల్ రిపోర్టులో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకరు. ఆయనకి తగిలిన గాయం కారణంగా, ఆయన ఆసియా కప్ ,వరల్డ్ కప్ లో చోటు దక్కించుకుంటాడా లేదా అని మునపటి వరకు ఒక ఆందోళన అనేది ఉండేది.

సెకండాఫ్‌లో వికెట్‌ స్పిన్‌ను చూసి కాస్త ఆశ్చర్యపోయానని స్టాండ్‌ఇన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. పొద్దున్నే చూసినప్పుడు ఇంత స్పిన్ అవుతుందని అనుకోలేదని.. 400 స్కోర్ బోర్డు మీద కనిపించడం, నిజంగా తమలోని ఆత్మవిశ్వాసం పెరిగినట్టే అనిపించిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా మ్యాచ్ గెలిచిన భారత్ బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకోడానికి, ఇది ఒక ఉదాహరణ అని మరొకసారి గుర్తు చేశాడు రాహుల్.

గ్రౌండ్ సిబ్బందికి ప్రైజ్ మనీ

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) ఆదివారం హోల్కర్ స్టేడియం గ్రౌండ్, మ్యాచ్‌ను సవ్యంగా జరిగేలా చూసినందుకు, వర్షాలు ఉన్నప్పటికీ సిద్ధంగా ఉంచినందుకు గ్రౌండ్ సిబ్బందికి 11 లక్షల రూపాయలు ప్రకటించింది. వర్షాలు పడుతున్నప్పటికీ గ్రౌండ్ ని తీర్చిదిద్ది, మ్యాచ్ కు అంతరాయం కలగకుండా చూసినందుకు, గ్రౌండ్ సిబ్బందికిగాను అభినందిస్తూ.. 11 లక్షలు ప్రకటించామని MPCA ప్రెసిడెంట్ అభిలాష్ ఖండేకర్ ప్రకటించారు.

ఈ సంవత్సరం మార్చిలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ తర్వాత..పిచ్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ద్వారా అతి తక్కువ రేటింగ్‌ను అందుకున్నప్పటికీ, ప్రస్తుతం జరిగిన మ్యాచ్ ద్వారా, పిచ్ కండిషన్ మరింత మెరుగుపరచడానికి గ్రౌండ్ సిబ్బంది చాలా బాగా పనిచేస్తుందని మెచ్చుకోవడం జరిగింది.