మణిపూర్ హింసలో మరో ముగ్గురు బలి

మణిపూర్ హింసకాండలో ఎంతోమంది పోలీసులతో సహా చనిపోయిన విషయం వెలుగులోకి ఆలస్యంగా వచ్చిన సంఘటనలు చూసే ఉంటాము. అయితే కుకీ మెజారిటీ ప్రజలు ఉన్న చిరాచంద్పూర్ డిస్ట్రిక్ట్, మోయటీలు ఎక్కువగా ఉన్న విష్ణుపూర్ డిస్ట్రిక్ట్ మధ్య జరుగుతున్న ఘర్షణలో కాల్పులు కూడా జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం 4:30 ప్రాంతంలో, తంగ్‌ఖుల్ నాగా-ఆధిపత్యం ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని కుకి తోవై గ్రామంలో మరో ముగ్గురు కాల్పుల కారణంగా చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన […]

Share:

మణిపూర్ హింసకాండలో ఎంతోమంది పోలీసులతో సహా చనిపోయిన విషయం వెలుగులోకి ఆలస్యంగా వచ్చిన సంఘటనలు చూసే ఉంటాము. అయితే కుకీ మెజారిటీ ప్రజలు ఉన్న చిరాచంద్పూర్ డిస్ట్రిక్ట్, మోయటీలు ఎక్కువగా ఉన్న విష్ణుపూర్ డిస్ట్రిక్ట్ మధ్య జరుగుతున్న ఘర్షణలో కాల్పులు కూడా జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం 4:30 ప్రాంతంలో, తంగ్‌ఖుల్ నాగా-ఆధిపత్యం ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని కుకి తోవై గ్రామంలో మరో ముగ్గురు కాల్పుల కారణంగా చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ముగ్గురు కొద్ది రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయిన, జామ్‌ఖోగిన్ హౌకిప్ (26), థంగ్‌ఖోకై హాకిప్ (35), హోలెన్సన్ బైట్ (24).

ఆగని హింసాకాండ: 

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. శుక్రవారం ఉదయం 4:30 ప్రాంతంలో, తంగ్‌ఖుల్ నాగా-ఆధిపత్యం ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని కుకి తోవై గ్రామంలో మరో ముగ్గురు కాల్పుల కారణంగా చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ముగ్గురు కొద్ది రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయిన, జామ్‌ఖోగిన్ హౌకిప్ (26), థంగ్‌ఖోకై హాకిప్ (35), హోలెన్సన్ బైట్ (24). రెండు వారాల క్రితం మణిపూర్ లో జరిగిన కాల్పుల కారణంగా ముస్లింలు కూడా మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం, మణిపూర్ ముస్లింలు, ఇతర కమ్యూనిటీలకి చెందిన రైతులు ఢిల్లీకి చేరుకుని హింసను ఆపించేందుకు మరిన్ని సెక్యూరిటీ బలగాలను దింపాలని సెంటర్ ని కోరుతున్నారు. 

ఇది ఎవరి కుట్ర: 

భారీ సంఖ్యలో పారామిలటరీ సిబ్బంది ఉన్నప్పటికీ, ఇతర జిల్లాల నుంచి వచ్చిన దుండగులు విష్ణుపూర్ గ్రామానికి వచ్చి ముగ్గురిని దారుణంగా హతమార్చారని, ఇది కేవలం వైఫల్యమే అంటూ, రాజ్‌కుమార్ ఇమో సింగ్ చెప్పారు. మరో వైపు, మణిపూర్‌లో కొనసాగుతున్న హింసలో విదేశీ ఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవానే (రిటైర్డ్) అన్నారు, దశాబ్దాలుగా ఈశాన్య ప్రాంతంలోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనా చేస్తున్న సహాయాన్ని ధ్వజమెత్తారు. పొరుగు దేశంలో (మయన్మార్) మాత్రమే కాకుండా, సరిహద్దు రాష్ట్రం (మణిపూర్)లో కూడా అస్థిరత ఉంటే, అది మన మొత్తం జాతీయ భద్రతకు బంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది అని ఆయన అన్నారు. అంతర్గత భద్రత మనకు చాలా ముఖ్యం అని జనరల్ నరవానే అన్నారు. 

విచ్చలవిడిగా దోచుకుంటున్నారు: 

బిష్ణుపూర్‌లోని మణిపూర్ ఆర్మ్‌డ్ పోలీస్ 2వ బెటాలియన్‌కు చెందిన కైరెన్‌ఫాబి పోలీస్ అవుట్‌పోస్ట్.. అదే విధంగా తంగలవాయి పోలీస్ అవుట్‌పోస్టులపై ఒక కొంతమంది గుంపులు దాడి చేసి భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లిందని, మణిపూర్ పోలీసుల ప్రకటించారు. అదేవిధంగా పురుషులు మరియు మహిళలతో కూడిన గుంపు అదే జిల్లాలోని హీంగాంగ్ పోలీస్ స్టేషన్ ఇంకా సింగ్జామీ పోలీస్ స్టేషన్ నుండి ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని లాక్కోవడానికి ప్రయత్నించింది, ఈ క్రమంలోనే భద్రతా దళాలు అలర్ట్ అవడంతో ఆ గుంపులను చెదరగొట్టి తరిమి కొట్టినట్లు తెలుస్తోంది.