వన్డే ప్రపంచ కప్ అంపైర్లు వీరే..!

ప్రపంచ కప్‌ 2023 మరికొన్ని రోజుల్లో ఈ విశ్వ సమరానికి తెరలేవనుంది. వచ్చే నెల (అక్టోబర్ 05) నుండి భారత గడ్డపై మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ కప్‌ను దక్కించుకునేందుకు భారీ వ్యూహాలతో తమ జట్లను సిద్ధం చేస్తున్నాయి ఆయా దేశాలు. అలాగే ఈ విశ్వసమారానికి ఒక్కోక్క జట్టు తమ స్కాడ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ కప్‌కు […]

Share:

ప్రపంచ కప్‌ 2023 మరికొన్ని రోజుల్లో ఈ విశ్వ సమరానికి తెరలేవనుంది. వచ్చే నెల (అక్టోబర్ 05) నుండి భారత గడ్డపై మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ కప్‌ను దక్కించుకునేందుకు భారీ వ్యూహాలతో తమ జట్లను సిద్ధం చేస్తున్నాయి ఆయా దేశాలు. అలాగే ఈ విశ్వసమారానికి ఒక్కోక్క జట్టు తమ స్కాడ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ కప్‌కు సంబంధించిన అంపెర్ల జాబితాను కూడా వచ్చేసింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ కప్ 2023 కోసం అంపైర్లను ప్రకటించింది. ప్రస్తుతానికి లీగ్ దశ మ్యాచ్‌లకు మాత్రమే అధికారిక ప్రకటన వెలువడింది. సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల గురించి తర్వాత ప్రకటిస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, చివరిసారి ఫైనలిస్ట్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలో, రెండో సెమీ ఫైనల్ కోల్‌కతాలో, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది.

అంపైర్ల లిస్ట్ ఇదే..

16 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ప్రకటించింది. ఏ అంపైర్‌లను ఎంపిక చేశారో ఇప్పుడు చూద్దాం..

క్రిస్ గాఫ్నీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైఖేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారత్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్), రాడ్ టక్కర్ (ఆస్ట్రేలియా), జో విల్సన్ (వెస్టిండీస్), అహ్సన్ రజా (పాకిస్థాన్), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా) ఈ లిస్టులో ఉన్నారు.

ఇది కాకుండా నలుగురు అంపైర్లు ICC ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఇందులో షరాఫుద్దౌలా ఇబ్నే షాహిద్ (బంగ్లాదేశ్), పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్), క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) ఉన్నారు.

ఇక మ్యాచ్ రిఫరీ గురించి మాట్లాడితే, ఇందులో జెఫ్ క్రో (న్యూజిలాండ్), ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే), రిచీ రిచర్డ్‌సన్ (వెస్టిండీస్), జవగల్ శ్రీనాథ్ (భారతదేశం) ఉన్నారు. ఈ నలుగురూ మాజీ అంతర్జాతీయ క్రికెటర్లే.

మొదటి మ్యాచ్ అధికారులు

ప్రపంచ కప్ 2023 కోసం మ్యాచ్ అధికారుల పేర్లను ప్రకటించడంతో పాటు అక్టోబర్ 5 న  ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌కు మ్యాచ్ అధికారుల పేర్లను కూడా ICC ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో నితిన్ మీనన్, కుమార్ ధర్మసేన ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. పాల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా, షరాఫుద్దౌలా నాలుగో అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్‌లో ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీ పాత్రలో ఉంటాడు.

 ఈ ప్రపంచకప్‌కు ఎంపికైన అధికారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అధికారులని ఈసీ పేర్కొన్నాడు. ఈ అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం క్రికెట్ కమ్యూనిటీ వారి ప్రతి కదలికను గమనిస్తుందని తెలుసుకుని, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సవాలుతో కూడిన పనిని స్వీకరించడానికి పూర్తిగా వీరు సిద్ధంగా ఉన్నారని అతను తెలిపాడు. ప్రపంచకప్‌నకు మరో 27 రోజులు మిగిలి ఉంది. అందుకే ప్రస్తుతం అన్ని జట్లు తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి.

వన్డే ప్రపంచ కప్ బరిలో నిలిచే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్.