తెలంగాణ కొత్త రాష్ట్రమే.. కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వరంగల్ లో  రూ. 6,100 కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచుకపడ్డారు కానీ తెలంగాణ చరిత్రను మోదీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావచ్చు. అని కానీ.. దేశ చరిత్రలో తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం పాత్ర చాలా గొప్పది అన్నారు. ఈరోజు భారతదేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో […]

Share:

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వరంగల్ లో  రూ. 6,100 కోట్లతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై విరుచుకపడ్డారు కానీ తెలంగాణ చరిత్రను మోదీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావచ్చు. అని కానీ.. దేశ చరిత్రలో తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం పాత్ర చాలా గొప్పది అన్నారు. ఈరోజు భారతదేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో తెలంగాణ ప్రజలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి  ప్రపంచం ముందుకు వస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజలకు అనంతమైన అవకాశాలు ఉన్నాయని మోదీ వెల్లడించారు.  అమృత్ కాల్ లోని ప్రతి సెకండ్ ను అందరం ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.

తెలంగాణకు టెక్స్ టైల్ పార్క్ మంజూరు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా పత్తి రైతులకు మేలు జరుగుతుందన్నారు. కొన్ని పార్టీలు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. పేదలందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నానని ప్రకటించారు.అంతేకాకుండా పేదలందరూ కేంద్ర పథకాలతో లబ్ధి పొందుతున్నారని మోదీ పేర్కొన్నాడు. రైతులను ఆదుకునేందుకు ఎమ్మెస్పీ ఇవ్వడానికి బిజెపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వరి సేకరణ కోసం కేంద్రం  రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,  రైతుల రుణమాఫీ హామీలు ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు.  బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై గ్రామపంచాయతీలు అసంతృప్తిగా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.

కేంద్రం నేరుగా పంచాయతీలకు  రూ.12 వేల కోట్లు ఇచ్చిందన్నారు. కేసీఆర్ సర్కార్ పంచాయితీలకు అడ్డంకులు సృష్టించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పంచాయతీలు నిర్ణయించుకున్నాయని ప్రధాని మోదీ వాక్యానించారు. యువత, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని  చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. ఇక్కడ యువత అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కుటుంబ పాలన రాజ్యమేలుతుందని ప్రధాని మండిపడ్డారు.  కుటుంబ పార్టీలు అవినీతిపై  ఆధారపడుతున్నాయని కాంగ్రెస్ అవినీతిని భారతదేశం మొత్తం చూసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర

దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సహకారం గొప్పదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు.

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా ఉన్నదని తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వరంగల్ నగర పర్యటనలో భాగంగా  రూ.521 కోట్లతో కాజీపేటలో నిర్మించుచున్న రైల్వే వ్యాగన్   మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి పర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.2,147 కోట్లతో చేపట్టనున్న జగిత్యాల, కరీంనగర్, వరంగల్, రూ.3,441 కోట్లతో చేపట్టనున్న మంచిర్యాల వరంగల్ జాతీయ రహదారుల విస్తరణ పనులను ప్రారంభించారు. భారతీయ రైల్వేలో కాజీపేట ఇప్పుడు గర్వించదగిన భాగస్వామిగా మారిందని పేర్కొన్నారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకు 200 వ్యాగన్ ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ప్రపంచానికి సవాలుగా మారిన కరోనాకు వ్యాక్సిన్ ను తెలంగాణలోనే తయారు చేశారని ప్రశంసించారు. కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ……కాజీపేటలో 160 ఎకరాల్లో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ని చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.