ఆ మంత్రి విషయంలో తమిళనాడు గవర్నర్ వెనకడుగు

ఆర్‌ఎన్ రవి, తమిళనాడు గవర్నర్ గురువారం వివాదాస్పద వాతావరణాన్ని సృష్టించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు, ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. రాష్ట్ర డీఎంకే ప్రభుత్వంలో వేడి నెలకొన్న తర్వాత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే, మంత్రి వి సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారని పలు వర్గాలు వాపోతున్నాయి. రెండు వారాల క్రితం అరెస్టయి బాలాజీ, క్యాష్-ఫర్ జాబ్స్ కుంభకోణంలో క్రిమినల్ ప్రొసీడింగ్‌ల మధ్య జైలులో ఉన్న అతన్ని, […]

Share:

ఆర్‌ఎన్ రవి, తమిళనాడు గవర్నర్ గురువారం వివాదాస్పద వాతావరణాన్ని సృష్టించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు, ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. రాష్ట్ర డీఎంకే ప్రభుత్వంలో వేడి నెలకొన్న తర్వాత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే, మంత్రి వి సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారని పలు వర్గాలు వాపోతున్నాయి.

రెండు వారాల క్రితం అరెస్టయి బాలాజీ, క్యాష్-ఫర్ జాబ్స్ కుంభకోణంలో క్రిమినల్ ప్రొసీడింగ్‌ల మధ్య జైలులో ఉన్న అతన్ని, మిస్టర్ స్టాలిన్ పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా కొనసాగించారు. అయితే ఈ విషయంలో గవర్నర్ రవి ఏకపక్షంగా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు.

రాజ్ భవన్ ఒక అధికారిక ప్రకటనలో, మిస్టర్ బాలాజీ ” ఉద్యోగాలు ఇస్తామని అభ్యర్థుల నుంచి నగదు తీసుకొని మోసం చేయడం, మనీలాండరింగ్ కేసులు, మరియు ఇతర ఆరోపణల మీద జైలుకు వెళ్లారు” అని పేర్కొంది. 

గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? 

ఈ నేపథ్యంలో, తక్షణమే గవర్నర్ సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగించడం జరిగింది.

నిన్నటి నుంచి, గవర్నర్ కార్యాలయ వర్గాల మధ్య అంశంపై అటార్నీ జనరల్‌తో తీవ్రమైన సంప్రదింపులు జరుపుతున్నాయని, ప్రస్తుతానికి ఈ నిర్ణయం అనేది తాత్కాలికంగా నిలిపివేయబడిందని చెప్పారు. అయితే బాలాజీ ప్రస్తుతానికి తమ పదవిలో మంత్రిగా కొనసాగుతారని వారు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వును పక్కన పెట్టి సుప్రీంకోర్టులో సవాలు విసరాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వర్గాలు తెలిపాయి.

PTI ప్రకారం, విలేఖరులతో మాట్లాడిన ఎంకే స్టాలిన్, ఒక మంత్రిని విధుల నుంచి తొలగించే హక్కు గవర్నర్‌కు లేదని, ఈ విషయంలో తమ ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు సాగుతుందని అన్నారు. “గవర్నర్‌కు (బాలాజీ మంత్రిని తొలగించే) హక్కు లేదు మరియు ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్తాము” అని ఆయన అన్నారు.

డిఎంకె నాయకుడు ఎ శరవణన్, గవర్నర్ రాజ్యాంగాన్ని మార్చి తమ నిర్ణయం ఇచ్చినట్లు చెప్పారు, మిస్టర్ బాలాజీని రాష్ట్ర మంత్రిమండలి నుండి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో  ” అది అసలు పరిగణలోకి తీసుకోబడుదు” అని తోసుపుచ్చారు.

“గవర్నర్ అసలు ఏమి అనుకుంటున్నారు? అతనికి రాజ్యాంగపరమైన (సెంథిల్ బాలాజీని తొలగించే) అధికారం ఉందా? గవర్నర్ రాజ్యాంగ విషయంలో విషయాలను మార్చి తమకి అనుకూలంగా చేసుకుంటున్నారు. ఆయన తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని సనాతన ధర్మం నిర్ణయించలేదు. రాజ్యాంగాన్ని పవిత్రంగా బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్‌కు సమానంగా నిజానికి గవర్నర్ అనేవారు భావించాలి. అతను ఆయనకి నచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు, తన రాజకీయ నాయకులను చెదరగొట్టాలని చూస్తున్నారు. అతని ఆర్డర్‌కు అదేవిధంగా అతను ఇచ్చిన ఉత్తర్వుల కాగితానికి కూడా విలువ లేదు. అది పనికిరాని కాగితం” అని డిఎంకె నాయకుడు అన్నారు. 

ఆస్పత్రిలో చేరిన బాలాజీ: 

ఈ నెల ప్రారంభం దశలో, దేశంలోని ఆర్థిక నేరాల-పోరాట ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన బాలాజీకి విధించిన జ్యుడీషియల్ కస్టడీని చెన్నైలోని కోర్టు బుధవారం జూలై 12 వరకు పొడిగించింది. కొన్ని గంటల క్రితమే, సుప్రీంకోర్టు అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి అనుమతినిచ్చింది, అక్కడ అతనికి గుండెకు సంబంధించి శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం. అంతకు ముందు, ఆయన గుండె మరియు ఛాతి సమస్యల కారణంగా అనారోగ్యం పాలైనట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం.

రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాల విషయంలో భారీ మొత్తంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి బాలాజీని అరెస్టు చేసిన ఏజెన్సీ మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాలాజీని తరలించేందుకు హైకోర్టు కూడా అనుమతిని మంజూరు చేసింది.

డిఎంకె ప్రభుత్వానికి మరియు గవర్నర్ కార్యాలయానికి మధ్య కొన్ని విషయాలపై నెల రోజులుగా వేడి నెలకొంది, అనేక సమస్యలపై ఇరువురి మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా, ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ నిరాకరించడం.

గవర్నర్ రవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు మరియు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై అవసరమైన సంతకాలను పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ,డిఎంకె గత సంవత్సరం, రాష్ట్రపతి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకి పిటిషన్ను దాఖలు కూడా చేసింది.