తెలంగాణ‌, ఆంధ్ర‌లో విద్యాసంస్థ‌లు బంద్ చేయాల‌ట‌

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 25 అనగా నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం…. TNSF నాయకులు మాట్లాడుతూ…  ఫీజులు పెంచుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ఫీజులను కార్పోరేట్ కాలేజీలు  అమలు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన వెంటనే […]

Share:

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 25 అనగా నేడు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం….

TNSF నాయకులు మాట్లాడుతూ…  ఫీజులు పెంచుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ఫీజులను కార్పోరేట్ కాలేజీలు  అమలు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు చదువు చెప్పేవారే కరువయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 53 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

AISF కూడా బంద్ కు పిలుపు :

 విద్యార్థుల సమస్యల పరిష్కారానికి జూలై 25న విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కూడా పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిస్ చార్జీలు, పెంచాలని.. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, వాచ్మెన్ వంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 కేజీబీవీలు గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అంతేకాకుండా  మహిళల వసతి గృహాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు. సెంట్రల్ వర్సిటీ నిధులు కేటాయింపు జూనియర్ కళాశాలలో పోస్టుల భర్తీ తదితర అనేక డిమాండ్ల సాధనకు అన్ని విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చాయని తెలిపారు. బొబ్బిలిలో ప్రభుత్వ పాఠశాల విజయనగరంలో పెండింగ్ కళాశాల అలాగే రాజాంలో ఐటిఐలు ఏర్పాటు కాకుండా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.  జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యారంగంపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంలో చలనం తేవడానికి ఈ నెల 25 వ తేదీన విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. విద్యార్థులు బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల తెలంగాణ ఏపీలో విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని… ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే…..?

 సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కుళాయి స్వామి, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర, ఏఐఎస్, ఎఫ్ జిల్లా కార్యదర్శి పృద్వి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయాలని కోరారు.. 

 సెంట్రల్ వర్సిటీ నిధుల కేటాయింపు జూనియర్ కళాశాలలో పోస్టులు భర్తీ తదితర అనేక డిమాండ్ల సాధనకు అన్ని విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చాయని వారు తెలిపారు.  సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంలో చలనం తేవడానికి ఈనెల 25వ  తేదీన విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని…. ఏబీవీపీ  ఆధ్వర్యంలో పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే…? జూలై  05వ  తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని…. ఈ అక్రమ ఫీజు దోపిడీ దందాను తెరిచేందుకు పాఠశాలల బంద్కు పిలుపునిచ్చాయి.