అజిత్ పవార్ చేసింది తెలివి తక్కువ పని: శ‌ర‌ద్ పవార్

కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలోని నాలుగవ ప్రమాణ స్వీకారం జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్, ఎనిమిది పార్టీల నేతలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు అని నివేదికలు పేర్కొన్నాయి. అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అదితి తత్కరే, ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, ధర్మరాజ్ బాబారావ్ అత్రమ్, సంజయ్ బన్సోడే మరియు అనిల్ భైదాస్ పాటిల్ […]

Share:

కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలోని నాలుగవ ప్రమాణ స్వీకారం జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్, ఎనిమిది పార్టీల నేతలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు అని నివేదికలు పేర్కొన్నాయి. అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అదితి తత్కరే, ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, ధర్మరాజ్ బాబారావ్ అత్రమ్, సంజయ్ బన్సోడే మరియు అనిల్ భైదాస్ పాటిల్ ప్రమాణస్వీకారం చేశారు. 

ఎన్‌సిపి శాసనసభ్యుల బృందం అజిత్ పవార్ ముంబై నివాసంలో సమావేశమయ్యారు, అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అలాగే సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ హాజరుకాలేదు. ఇదిలా ఉండగా, ముంబైలో జరిగిన సమావేశం గురించి తనకు తెలిదని శరద్ పవార్ పూణెలో విలేకరులతో అన్నారు. 

“ఈ సమావేశాన్ని ఎందుకు పిలిచారో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ప్రతిపక్ష నాయకుడు అయినందున, ఎమ్మెల్యేల సమావేశాన్ని పిలిచే హక్కు ఆయనకు (అజిత్ పవార్) ఉంది. అతను దానిని క్రమం తప్పకుండా చేస్తాడు. ఈ సమావేశం గురించి నాకు పెద్దగా వివరాలు లేవు,” అని మిస్టర్ పవార్ అన్నారు. శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఒక నెలలోనే ఎన్‌సిపిలో గందరగోళం నెలకొంది. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ను స్వాగతిస్తూ, “ఇప్పుడు మనకు 1 ముఖ్యమంత్రి, అంతేకాకుండా, 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం, అజిత్ పవార్ని మహారాష్ట్రకు ఉపముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నాను. అజిత్ పవార్ అనుభవం సహాయం చేస్తుంది.” అంటూ మీటింగ్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలని పవార్ తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

శ‌ర‌ద్ పవర్ మాటల్లో: 

అయితే ఈ సందర్భంలోనే, శ‌ర‌ద్ పవర్ లో తీవ్రవాఖ్యలు చేశారు. అజిత్ పవర్ చేసిన తిరుగుబాటులో తన ఆశీర్వాదాలు అనేవి ఉండవు అంటూ పేర్కొన్నారు. “పార్టీలో ఆటుపోట్లు ఎన్ని వచ్చినా, ఎవరు ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన, పార్టీని తిరిగి మామూలు స్థితికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఈరోజు నుంచి, అతీత శక్తుల పైన నా అసలైన పోరాటం మొదలవుతుంది.” అంటూ సోమవారం శరత్ పవర్ మాట్లాడారు.

విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ, ఎన్‌సిపిని బలోపేతం చేయడానికి మరియు పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంచడానికి నా పోరాటం ఉంటుంది. కొంతమంది నాయకుల చేసిన దానికి భయపడే అవకాశం లేదు అన్నారు. ఆదివారం నాడు అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సిపిలో నిజానికి నిలువునా చీలిపోయింది. అంతేకాకుండా ఆయన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్‌నాథ్ షిండే-బిజెపి ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్‌సిపి నాయకులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. 

ఆదివారం నాడు అజిత్‌ పవార్‌ తిరుగుబాటుకు ఆయన ఆశీస్సులు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఎన్‌సిపి అధినేత, ” ఇలాంటివి తెలివి తక్కువ వాళ్లే చేస్తారు. ఆయన ఇలాంటి విషయాలు పైన ఆశీర్వాదం ఎలా ఉంటుంది. ఎప్పటికీ ఉండదు” అని అన్నారు.