జోగేంద్ర అనే వ్యక్తిని దారుణంగా చంపిన భార్య లవర్ !

ఈమధ్య కాలం లో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే అసలు ఇంత క్రూరమైన మనుషుల మధ్య ఉన్నామా అని అనిపిస్తుంది. సాధారణమైన మనుషుల మధ్య పుట్టి పెరిగిన వీళ్ళకు ఇంత నీచమైన ఆలోచనలు ఎలా వస్తుంటాయి అని అనిపిస్తుంది. ప్రతీ రోజు దిన పత్రిక చదివితే ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు గురించే వార్తలు కనిపిస్తున్నాయి. అందుకే కొంతమంది న్యూస్ పేపర్స్ చదవడమే మానేసిన వాళ్ళు ఉన్నారు. పోనీ టీవీ న్యూస్ ఛానెల్స్ చూసినా అదే పరిస్థితి. అలా […]

Share:

ఈమధ్య కాలం లో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే అసలు ఇంత క్రూరమైన మనుషుల మధ్య ఉన్నామా అని అనిపిస్తుంది. సాధారణమైన మనుషుల మధ్య పుట్టి పెరిగిన వీళ్ళకు ఇంత నీచమైన ఆలోచనలు ఎలా వస్తుంటాయి అని అనిపిస్తుంది. ప్రతీ రోజు దిన పత్రిక చదివితే ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు గురించే వార్తలు కనిపిస్తున్నాయి. అందుకే కొంతమంది న్యూస్ పేపర్స్ చదవడమే మానేసిన వాళ్ళు ఉన్నారు. పోనీ టీవీ న్యూస్ ఛానెల్స్ చూసినా అదే పరిస్థితి. అలా రీసెంట్ గా రాజస్థాన్ లో ఒక దారుణం జరిగింది. 33 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక వ్యక్తిని అతని భార్య  ప్రియుడి హత్య చేసిన సంఘటన యావత్తు ప్రజానీకాన్ని తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యేలా చేసింది. తనకి దక్కాల్సిన అమ్మాయిని పెళ్లిని చేసుకున్నాడు అనే అక్కసు తో ఈ దుర్మార్గానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది.

మృతదేహాన్ని ఆరు భాగాలుగా కట్ చేసి వివిధ ప్రదేశాలలో పడేసిన మదన్ లాల్ :

పూర్తి వివరాల్లోకి వెళ్ళితే మదన్ లాల్ అనే వ్యక్తి జోగేంద్ర అనే అతనిని అతి క్రూరం గా హత్య చేసి, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఆరు భాగాలుగా కట్ చేసి, వివిధ ప్రదేశాలలో పారేసాడు. మొండెం ని అక్కడే సమీపం లో ఉన్న ఒక అడవి లో పూడ్చాడు. ఆ తర్వాత ఇంటికి వంద మీటర్ల దూరం లో ఉన్న ఒక తోటలో తల, చేతులు ,కాళ్ళు పాతిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించి వాటిని స్వాధీన పర్చుకున్నారు. అనంతరం మదన్ లాల్ ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  మదన్ లాల్ జోగేంద్ర మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతం లో మొక్కల్ని నాటినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇది ఇలా ఉండగా జోగేంద్ర తండ్రి జులై 11 వ తేదీన ఇంటి నుండి బయటకి వెళ్లిన జోగేంద్ర ఎంతసేపటికి ట్కిరిగి రాకపోవడం తో అనుమానం చెందాడు. నా బిడ్డ కనిపించకుండా పోయాడు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.

జోగేంద్ర భార్యకి కూడా ఇందులో భాగం ఉందా..?:

నా కొడుకు అలా కనిపించకుండా పోవడానికి కారణం మదన్ లాల్ అని కూడా పేర్కొన్నాడు. ఎందుకంటే మదన్ లాల్ అంతకు ముందు కూడా జోగేంద్ర తో చాలాసార్లు గొడవలు పెట్టుకున్నాడట. ఆ అనుమానం తోనే మదన్ లాల్ ని అనుమానిస్తూ కేసు పెట్టాడు. చివరికి అతను అనుమానించినట్టుగానే జోగేంద్ర మదన్ లాల్ చేత అతి క్రూరంగా హత్య కి గురి అయ్యాడు. జులై 13 వ తారీఖున ఈ విషయం జోగేంద్ర తండ్రికి తెలిసింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘ఈ హత్య లో కేవలం మదన్ లాల్ కి మాత్రమే కాదు, చాలామంది ఇందులో ఉన్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసారు,  పాపం అతని బాధని చూస్తే ఎలాంటి వాడికైనా కన్నీళ్లు రాక తప్పదు. చెట్టంత బిడ్డ పెళ్లి చేసుకొని జీవితం లో స్థిరపడ్డాడు అని ఆనందించే లోపే ఇలా ముక్కలు ముక్కలుగా కనిపించడం ఎంతటి శోఖాన్ని  కలిగిసుందో ఊహించుకోవచ్చు. తలచుకుంటేనే ఉండే రగిలిపోతుంది, ఇక పాపం ఆ బాధని అనుభవిస్తున్న ఆ తండ్రి కడుపు కొత్త వర్ణనాతీతం. అయితే ఈ హత్య జోగేంద్ర భార్య కి కూడా సంబంధం ఉందా లేదా అనే కోణం లో కూడా విచారిస్తున్నారు పోలీసులు. జోగేంద్ర భార్య తో నాకు సంబంధం ఉంది అని మదన్ లాల్ పోలీసులతో బహిరంగంగానే ఒప్పుకోవడం వల్ల పోలీసులు జోగేంద్ర భార్య ని కూడా అనుమానిస్తున్నారు .