పార్లమెంటులో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ

మోదీ ఇంటి పేరు కేసు విషయంలో హైకోర్టులో రాహుల్ కి ఊరట లభించలేనందున, ప్రస్తుతం సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే, మోదీ ఇంటి పేరు కేసు విషయంలో స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు జారీ చేసింది. అయితే సోమవారం నుంచి పార్లమెంటులో రాహుల్ గాంధీ అడుగు పెట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో రాహుల్ కి ఊరట: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యపై క్రిమినల్ పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించిన […]

Share:

మోదీ ఇంటి పేరు కేసు విషయంలో హైకోర్టులో రాహుల్ కి ఊరట లభించలేనందున, ప్రస్తుతం సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే, మోదీ ఇంటి పేరు కేసు విషయంలో స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు జారీ చేసింది. అయితే సోమవారం నుంచి పార్లమెంటులో రాహుల్ గాంధీ అడుగు పెట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టులో రాహుల్ కి ఊరట:

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యపై క్రిమినల్ పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఈ కేసును తాత్కాలికంగా నిలిపివేసింది. అతను చేసిన వ్యాఖ్యలు ఆరోపితవైయినప్పటికీ, పార్లమెంటులో అతని సభ్యత్వం పై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ట్రయల్ జడ్జి ఈ కేసులో గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షను విధించినప్పటికీ, ఆలస్యం అయి ఉంటే అది ఎంపీగా అనర్హత వేటు పడే అవకాశం ఉండేది అని న్యాయస్థానం అభిప్రాయపడింది. 

మోదీ ఇంటిపేరు కేసు వివరాలు: 

2019 ఏప్రిల్‌లో – లోక్‌సభ ఎన్నికలకు ముందు – మోదీ ఇంటిపేరుతో ఉన్న దొంగల గురించి అంటూ కోలార్‌లో గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపికి చెందిన సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ  దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం రాహుల్ గాంధీ చిక్కుల్లో పడడం జరిగింది. 

“ఆయన చేసిన వాక్యలకు సంబంధించి అప్పట్లో ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, ప్రస్తుత నిందితుడిపై ఇతర ఫిర్యాదులు దాఖలయ్యాయని, అందులో ఒక ఫిర్యాదును వీర్ సావర్కర్ మనవడు పునాలోని సంబంధిత కోర్టులో దాఖలు చేసినట్లు రికార్డులో కనిపిస్తుంది. లక్నో సంబంధిత కోర్టులో మరో ఫిర్యాదు కూడా దాఖలైంది. పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో, నేరారోపణపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం వల్ల దరఖాస్తు చేసిన వారికి ప్రస్తుతానికి ఏ విధంగానూ అన్యాయం జరగదు.” అంటూ ఉద్దేశపూర్వకంగా చెప్పారు.

పరువు నష్టం హత్య వంటి తీవ్రమైన నేరం కాదన్న గాంధీ వాదనను తోసిపుచ్చిన జస్టిస్ ప్రచ్చక్, “ప్రస్తుత నేరారోపణ చాలా తీవ్రమైన విషయం, ఇది సమాజంలోని పెద్ద వర్గాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఈ కోర్టు ఆదేశిస్తున్న నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కేసులో, నేరం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అనే దాన్ని బట్టి అంచనా వేయడానికి, పిటిషనర్‌పై ఇప్పుడున్న కేసు ప్రకారం చూసుకుంటే, ఈ విషయం ఒక వర్గం అనేది వ్యక్తికి సంబంధించినది కాదు, అంటే ఎంతోమంది ఇందులో ఉన్నారు.” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి హైకోర్టులో తనకి ఎటువంటి న్యాయం జరగలేనట్లు కనిపించిన రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ ఏడాది మార్చిలో తన యుకె పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సావర్కర్‌పై తప్పుడు మరియు దురుద్దేశపూర్వక ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ ఏప్రిల్ 12, 2023న పూణేలోని మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఇలా ప్రస్తుతానికి రాహుల్ గాంధీ మీద 12 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం హైకోర్టు లో నమోదైన కేసు విషయంలో తనకి ఎలాంటి న్యాయం జరగలేదని, ముఖ్యంగా  ఎంపీ హోదా కూడా పోగొట్టుకున్న రాహుల్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ, ఇటీవలే రాహుల్ సుప్రీంకోర్టులో వేసిన అభ్యర్థనకి జవాబు ఇవ్వడం జరిగింది.