చాందీ ఊమెన్ను పొగిడేందుకు పలువురికి డబ్బులు పంపిణీ: కేరళ ప్రభుత్వం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుతుపల్లి ఉపఎన్నికకు మరికొద్ది రోజుల్లోనే, ఇక్కడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పశువైద్య కేంద్రం నుంచి ఒక టెంపరరీ మహిళా స్వీపర్‌ను తొలగించడంపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే, ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.. మద్దతు ఇచ్చినందుకే ఉద్యోగం పోయింది:  ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని పొగిడినందుకు ఉద్యోగం పోయిందని ప్రభుత్వ పశువైద్య కేంద్రం నుంచి ఒక టెంపరరీ మహిళా స్వీపర్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతుగా […]

Share:

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుతుపల్లి ఉపఎన్నికకు మరికొద్ది రోజుల్లోనే, ఇక్కడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పశువైద్య కేంద్రం నుంచి ఒక టెంపరరీ మహిళా స్వీపర్‌ను తొలగించడంపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే, ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..

మద్దతు ఇచ్చినందుకే ఉద్యోగం పోయింది: 

ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని పొగిడినందుకు ఉద్యోగం పోయిందని ప్రభుత్వ పశువైద్య కేంద్రం నుంచి ఒక టెంపరరీ మహిళా స్వీపర్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతుగా నిలవగా, సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఆమె ఉద్యోగం పోయినందుకు వస్తున్న ఆరోపణలను ఖండించింది. 

పశువైద్య కేంద్రంలో కొంతకాలంగా తాత్కాలిక స్వీపర్‌గా పనిచేస్తున్న పి ఓ సత్తిమ్మ మాట్లాడుతూ, ఇటీవల ఒక టీవీ ఛానెల్ రిపోర్టర్ తన ప్రోగ్రామ్ కోసం తన వైపు నుంచి వార్త తీసుకున్నట్లు, అందులో ఆమె మాట్లాడుతూ, మాజీ కాంగ్రెస్ లీడర్ ద్వారా తమ కుటుంబానికి మద్దతు మరియు సహాయం గురించి మాట్లాడింది. కుటుంబం తమ కష్టాల సమయంలో చాందీ నుండి మద్దతు అందిందా అని చెప్పింది. అంతేకాకుండా కాంగ్రెస్ దిగ్గజం తనయుడు చాందీ ఊమెన్ పుతుపల్లి ఉప ఎన్నికలో గెలుస్తారని చెప్పారు.

ఖండించిన కాంగ్రెస్: 

సత్తమ్మ మాట్లాడిన మాటలు టీవీ కార్యక్రమం ప్రసారం అయిన తర్వాత, పశుసంవర్ధక శాఖ అధికారులు ఇకపై విధులకు రావద్దని సత్తమ్మను కోరినట్లు మంగళవారం ఒక వార్తాపత్రిక కథనం వెలువడింది. ఆమెను సర్వీసు నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ఉపఎన్నికల అభ్యర్థి చాందీ ఊమెన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి అదే గతి పడుతుందని, ఇది ప్రభుత్వం చేస్తున్న అరాచకం అప్పు ఖండించారు.

కేరళలో వామపక్ష ప్రభుత్వ హయాంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదని పుతుపల్లిలో తన ప్రచారంలో భాగంగా విలేకరులతో అన్నారు చాందీ ఊమెన్. అధికార సీపీఐ (ఎం)పై విరుచుకుపడిన ఆయన, స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడే వారి నుండి ఇటువంటి ఎత్తుగడలు రావడం నిజంగా సిగ్గు పడాల్సిన విషయం అంటూ ప్రస్తావించారు. తన తండ్రి ఊమెన్ చాందీ తన రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా లేని వ్యక్తి, కానీ ఇప్పుడు అతని గురించి మంచి మాటలు మాట్లాడినందుకు ఒక మహిళ తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.

ఇదే విధమైన అభిప్రాయాలను పంచుకుంటూ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వి డి సతీశన్ మాట్లాడుతూ, పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ, ఒక్క కార్మికురాలు ఉద్యోగం కోల్పోవడమే అంటూ ఎత్తిచూపారు. 

పొగిడినందుకు డబ్బులు ఇస్తున్నారు: 

అయితే మాజీ కాంగ్రెస్ నేతను పొగిడినందుకు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారని, డబ్బులు ఇచ్చి పొగిడించుకోవడం ఎక్కడ చూడలేదని, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికురాలు ఉద్యోగం కోల్పోవడంలో ఎటువంటి ప్రభుత్వ పార్టీ హస్తం లేదంటూ, కేరళ అధికార ప్రభుత్వ పార్టీ నేతలు మరొకసారి గుర్తుచేస్తూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పార్టీ మీద బురద చల్లడం ఏ మాత్రం సబబు కాదు అంటూ ప్రస్తావించారు. అసలు నిజం తెలియకుండా, కాంగ్రెస్ అధికారులు నేరారోపన చేయడం మంచిది కాదు అంటున్నారు కేరళ ప్రభుత్వ అధికార నేతలు.

డిప్యూటీ డైరెక్టర్ నిర్వహించిన తనిఖీలో, వాస్తవానికి ఉద్యోగం కోసం నియమించబడిన వ్యక్తి స్థానంలో సత్తిమ్మ పనిచేస్తున్నట్లు తేలిందని మంత్రి తెలిపారు. ఈ పరిశోధనల ఆధారంగా ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని, చాందీని ప్రశంసిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలకు, ఆమె ఉద్యోగం పోవటానికి ఎలాంటి సంబంధం లేదని చించు రాణి పేర్కొన్నారు.