చాప కింద నీరులా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్

2020లో కరోనా సమయంలో ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారు తెలిసిన విషయమే. సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, కరోనా మరెన్నో రూపాలు దాల్చి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలు టీకాలు వేసుకొని అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ మరో వేరియంట్ రూపంలో మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తుందని కొన్ని దేశాల నుంచి వినిపిస్తోంది. కొత్త వేరియంట్:  BA.2.86 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. […]

Share:

2020లో కరోనా సమయంలో ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారు తెలిసిన విషయమే. సుమారు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, కరోనా మరెన్నో రూపాలు దాల్చి విస్తృతంగా వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలు టీకాలు వేసుకొని అప్రమత్తంగా ఉంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ మరో వేరియంట్ రూపంలో మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తుందని కొన్ని దేశాల నుంచి వినిపిస్తోంది.

కొత్త వేరియంట్: 

BA.2.86 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమర్జింగ్ వేరియంట్ వేగవంతమైనది కానప్పటికీ మెల్లమెల్లగా చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. దీనికన్నా ముందు వచ్చిన BA.2 సబ్‌వేరియంట్ ఒమిక్రాన్‌ వేరియంట్ కన్నా డిఫరెంట్. డాక్టర్ జెస్సీ బ్లూమ్, ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్‌లో వైరల్ ఎవల్యూషన్‌లో స్పెషలిస్ట్ అయిన ఒక సైంటిస్ట్, వ్యాప్తి చెందుతున్న వేరియంట్ గురించి వివరంగా తెలపడం జరిగింది. 

USతో సహా నాలుగు దేశాలలో BA.2.86 వేరియంట్‌కు సంబంధించిన కేవలం ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు ఆ ఆరు కేసుల ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందింది అనే దాని గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO BA.2.86ని “పర్యవేక్షణలో ఉన్న వేరియంట్”గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ కూడా దేశాలు పాటించాలని మరోసారి గుర్తు చేయడం జరిగింది. మూడు సంవత్సరాల అవుతున్నప్పటికీ కరోనా కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, ఎంతోమందితో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 

కరోనా తర్వాత పెరిగిన హఠాత్ మరణాలు: 

ఇటీవల కాలంలో ఎంతోమంది హఠాత్తుగా మరణించడం చాలామంది చూస్తున్నాం. కరోనా సోకిన పేషంట్లలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి ఇప్పటికి క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రెండు అధ్యాయాలు చేయనుంది. ముఖ్యంగా యువత కోవిడ్ అనంతరం ఎందుకు హఠాత్ మరణాలకు గురవుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే రీసెర్చ్ లో భాగంగా ముఖ్య కారణాలు తెలుసుకుని మరిన్ని మరణాలను నిరోధించవచ్చు అని నివేదికలో పేర్కొంది ఐసిఎంఆర్.

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్, ముఖ్యంగా 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ (జిసిటిఎం) సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి కారణాలు లేకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి, దాని గురించే ఈ అధ్యయనాలు అంటూ వెల్లడించారు.

ఈ రీసెర్చ్ ముఖ్యంగా కోవిడ్ -19 వ్యాప్తి యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడతాయని, ఒకవేళ ఆధారాలు దొరికితే జరగబోయే పరిణామాలు ఆపవచ్చు అని ఇది సహాయపడతాయని ICMR డైరెక్టర్ చెప్పారు.

ICMR చెప్తున్న దాని ప్రకారం ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకు, న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 50 శవపరీక్షలను అధ్యయనం చేసింది మరియు రాబోయే కొద్ది నెలల్లో, మరో 100 పరీక్షలు నిర్వహించబోతున్నట్లు చెప్పింది. 

కోవిడ్ బారిన పడిన తర్వాత మరణానికి దారితీసిన ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం  ఈ రీసెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎపిడెమియాలజీ యొక్క సాంకేతికత, ఈ మరణాలు ఎందుకు సంభవించాయో తెలుసుకోవడానికి వేరే మార్గం లేదు అంటూ ప్రస్తుతం జరగబోయే రీసెర్చ్ గురించి క్లుప్తంగా వివరించారు ICMR డైరెక్టర్.