Mukesh Ambani: “రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం..”

దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు(Threats) రావడం కలకలం సృష్టిస్తోంది. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు దుండగులు. దీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఈ బెదిరింపులు పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఇ-మెయిల్(Email) ఐడీకి అక్టోబర్ 27, శుక్రవారం రోజున గుర్తు తెలియని వ్యక్తి నుంచి […]

Share:

దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు(Threats) రావడం కలకలం సృష్టిస్తోంది. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు దుండగులు. దీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఈ బెదిరింపులు పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఇ-మెయిల్(Email) ఐడీకి అక్టోబర్ 27, శుక్రవారం రోజున గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘మా దగ్గర మంచి షూటర్లు(Shooters) ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’ అని ఇ-మెయిల్‌లో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ బెదిరింపులు వచ్చిన క్రమంలో ముకేశ్ అంబానీ(Mukesh Ambani) సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రకారం.. రూ. 20 కోట్లు ఇవ్వకపోతే ముకేశ్ అంబానీని కాల్చి చంపేస్తామని బెదిరించాడు. ముంబైలోని గందేవి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్స్ 387, 506(2) ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…రాత్రి 8.51 నిముషాలకు ఈ మెయిల్ వచ్చింది. షదాబ్ ఖాన్‌(Shadab Khan) పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు సెక్యూరిటీ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ మెయిల్‌ని ఫొటో తీసిన సెక్యూరిటీ ఆ ఫొటోను పోలీసులకు పంపింది. 

గత సంవత్సరం కూడా ముకేశ్ అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. 2022, ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్ కిసాన్ దాస్ ఆసుపత్రి(Har Kisan Das Hospital)కి బెదిరింపు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్(Arrest) చేశారు. అంతకు ముందు 2021లో అంబానీ నివాసం ఆంటీలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్ హీరేన్(Mansukh Heeren) అనుమానాస్పద రీతిలో చనిపోవడం సంచలనంగా మారింది. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే(Sachin Waje) దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్ఐఏ(NIA) అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.

అలాగే అక్టోబర్ 6, 2022 న, అతన్ని బెదిరించిన వ్యక్తిని బీహార్‌(Bihar) లో అరెస్టు చేశారు. నిందితుడిని 30 ఏళ్ల రాకేష్ కుమార్ మిశ్రా(Rakesh Kumar Mishra)గా గుర్తించారు. అక్టోబర్ 5, 2022న, నిందితులు రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబానీ కుటుంబాన్ని చంపుతామని బెదిరించారు. అంతేకాదు ఆసుపత్రి మొత్తం బాంబులు పెడతామంటూ బెదిరించాడు. ఈ సమయంలో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు నిరుద్యోగి అని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా అక్టోబర్‌ 27న అంబానీ కంపెనీకి చెందిన ఓ ఇ-మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలో పూర్తి వివరాలు రాబడుతామని పేర్కొన్నారు.

వచ్చిన బెదిరింపుల దృష్ట్యా, ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబానికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ(Z Plus Security) అందిస్తున్నారు. జెడ్  ప్లస్ సెక్యూరిటీ దేశంలో మరియు విదేశాలలో కూడా అంబానీ మరియు అతని కుటుంబ సభ్యులకు అందించబడుతుంది. కానీ సెక్యూరిటీకి అయ్యే ఖర్చులన్నీ.. ముకేశ్ అంబానీ భరించాల్సి ఉంటుంది. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ వర్గంపై చాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.