ఉద‌య‌నిధి స్టాలిన్‌కి క‌మ‌ల్ హాసన్ మ‌ద్ద‌తు

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వాక్యాలు కాంట్రవర్సీకి దారితీసాయి. ముఖ్యంగా అయోధ్యలో ఒక ఆచార్యులు, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఉదయనిధి తల నరికి తెచ్చిన వారికి 10 కోట్లు పారితోషకాన్ని ప్రకటించడం కూడా జరిగింది.. ఇదిలా ఉండగా మరోపక్క ఉదయినిది వాక్యాలు పొలిటికల్ గా దుమారాన్ని రేపుతున్నాయి.  సనాతన ధర్మ కాంట్రవర్సీలో కమల్ హాసన్:  సనాతన ధర్మం గురించి కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా తన […]

Share:

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వాక్యాలు కాంట్రవర్సీకి దారితీసాయి. ముఖ్యంగా అయోధ్యలో ఒక ఆచార్యులు, ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఉదయనిధి తల నరికి తెచ్చిన వారికి 10 కోట్లు పారితోషకాన్ని ప్రకటించడం కూడా జరిగింది.. ఇదిలా ఉండగా మరోపక్క ఉదయినిది వాక్యాలు పొలిటికల్ గా దుమారాన్ని రేపుతున్నాయి. 

సనాతన ధర్మ కాంట్రవర్సీలో కమల్ హాసన్: 

సనాతన ధర్మం గురించి కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా తన వైపు నుంచి అభిప్రాయాన్ని ప్రకటించడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అంశం మీద మాట్లాడే అవకాశం ఉంటుందని, ఒకరు మాట్లాడిన అంశాన్ని మరొకరు ఒప్పుకోవచ్చు.. ఒప్పుకోకపోవచ్చు అది తమ నిర్ణయం అని, అయితే చరిత్ర చూసుకుంటే మనలో వచ్చే అనేక ప్రశ్నలు ద్వారా మనకు అందే సమాధానాల ద్వారా మరింత మంచి సమాజం ఏర్పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. 

అంతేకాకుండా ఒకవేళ ఉదయినిది చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే సనాతన ధర్మం గురించి తమకు తెలిసిన మంచి విషయాలను ప్రస్తావించాలే తప్పిస్తే, హింస వైపు, అదే విధంగా బెదిరింపుల వైపు వెళ్ళకూడదు అని, ఇలాంటివి మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగ ప్రతిస్పందనలను ప్రేరేపించే అవకాశాలు ఉంటాయని ఆయన ట్విట్టర్ ద్వారా మాట్లాడారు. తమిళనాడు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన చర్చలకు సురక్షితమైన ప్రదేశం అంటూ, అది అలాగే కొనసాగుతుందని.. మన సంప్రదాయాలను విశ్లేషించడం, కలుపుగోలుతనం, సమానత్వం అనేది సమాజంలో ఎంతో ముఖ్యమని, సమాజాన్ని పెంపొందించడానికి నిర్మాణాత్మక చర్చలను స్వీకరిద్దాం అని కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. 

క్లారిఫికేషన్ ఇచ్చిన ఉదయనిది: 

తమిళ సినిమాకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతుగా నిలిచారు. కమల్ హాసన్‌తో పాటు మరి సెల్వరాజ్ మరియు పా రంజిత్ తదితరులు మామన్నన్, ఉదయనిధి మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా స్పందించారు. తన వ్యాఖ్యలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం సబబు కాదని, తన వైపు నుంచి మరొకసారి క్లారిటీగా చెప్పారు. 

సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిని పక్కదారి పట్టించేందుకు తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అయితే కేవలం సనాతన ధర్మం గురించి తాను మాట్లాడాడని, సనాతన ధర్మం అనేది ముఖ్యంగా ప్రజల మధ్య కుల, మతల అంశాలను రేపి విడదీసే ఒక అంశంతో ముందుకు వెళుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను మాట్లాడిన దానిమీద తను కచ్చితంగా నిలబడతానని, అంతేకాక ముఖ్యంగా తను చెప్పిన మాటలలో ఏమాత్రం తప్పులేదని తనను సమర్ధించుకున్నారు ఉదయనిధి. అయితే సనాతన ధర్మం గురించి తెలియని వారికి మరింత లోతుగా తెలిసేందుకు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మనుషుల్ని విడదీసే క్రమంలో సనాతన ధర్మం ఎలా పనిచేస్తుందో అంబేద్కర్, అదేవిధంగా పెరియర్ వంటి వారు రచించిన ఎన్నో పుస్తకాలు ద్వారా తెలుసుకోవచ్చని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సనాతన ధర్మం సమాజం మీద దుష్ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో తనకి బాగా తెలుసు అని అన్నారు. 

సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చడానికి గల కారణం సనాతన ధర్మం సమాజంలో ఎటువంటి దుష్ప్రభావాలకు దారితీస్తుందో దాన్ని చెప్పడానికి ఆయన ఉదాహరణగా తీసుకున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా, తాను ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఉదయినిది. తప్పుడు ప్రచారాన్ని మాత్రం చేయొద్దని, తాను ఎక్కడైనా, అది కోర్టులోనైనా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.