కేసీఆర్ దారిలో అరవింద్ కేజ్రీవాల్ వెళ్తున్నారా?

కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెళితే, ఎన్నికలలో ఒంటరిగా నిలబడే అవకాశం ఉంది. అంటే, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అదేవిధంగా బిజెపి రెండింటిపై ప్రతిపక్షంగా మారి తన బలగాన్ని వేర్వేరుగా వ్యాప్తి చేసే అవకాశం ఉంది. శుక్రవారం నాడు జరిగిన పాట్నా ప్రతిపక్షాల సమావేశానికి ముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. సమావేశానికి AAP […]

Share:

కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెళితే, ఎన్నికలలో ఒంటరిగా నిలబడే అవకాశం ఉంది. అంటే, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అదేవిధంగా బిజెపి రెండింటిపై ప్రతిపక్షంగా మారి తన బలగాన్ని వేర్వేరుగా వ్యాప్తి చేసే అవకాశం ఉంది.

శుక్రవారం నాడు జరిగిన పాట్నా ప్రతిపక్షాల సమావేశానికి ముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.

సమావేశానికి AAP ప్రధాన అజెండా ఢిల్లీ ఆర్డినెన్స్, దీనికి అతను అన్ని ప్రతిపక్ష పార్టీల నుండి మద్దతు కోరుతున్నాడు. పార్లమెంటు లోపల ఆర్డినెన్స్‌కు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వకపోతే, ఆప్ నేతలు సమావేశం నుండి వాకౌట్ చేస్తామంటూ, ఆయన గురువారం అల్టిమేటం ఇచ్చారు. 2024 కోసం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిషన్ యొక్క ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉన్న సమావేశానికి ముందు, ఢిల్లీ మరియు పంజాబ్‌లో అధికార పార్టీ ప్రదర్శించిన కఠినమైన వైఖరి వివిధ పుకార్లకు దారితీసింది. 

ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను తగ్గించేందుకు తీసుకొచ్చిన కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. అతను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా సమయం కోరాడు, కానీ ఇప్పటివరకు అటువైపు నుంచి ఎటువంటి అపాయింట్మెంట్లు అందకపోవడం కారణంగా, అసలు ఎటువంటి స్పందన కనిపించలేనట్లు తెలుస్తుంది.

గత కొద్ది రోజులుగా, ఆమ్ ఆద్మీ పార్టీ అనేక పార్టీ వేదికల నుండి కాంగ్రెస్‌పై పరోక్షంగా విరుచుకుపడుతూ వస్తుంది. ఇప్పుడు సమావేశానికి ముందు, ఆర్డినెన్స్ అంశంపై రాహుల్ గాంధీ మరియు బిజెపి మధ్య ఒప్పందం కుదిరిందని, అది ఒక ప్రకటన విడుదల చేసింది. ఖరారు చేసిన ఒప్పందం ప్రకారం ఢిల్లీ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేస్తుందని కూడా పార్టీ పేర్కొంది. 

కేజ్రీవాల్ తన మాట మీద కట్టుబడి ఉండడానికి ప్రతిపక్ష కూటమి నుండి వైదొలగాలనుకుంటున్నారా?: 

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరణ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆప్‌ పార్టీ అధికారులు ఏకంగా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానాలలో అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు ఆప్‌ సిద్ధంగా ఉంది. 

ప్రతిపక్ష సమావేశం విశేషాలు: 

ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ప్రతిపక్ష సమావేశానికి ముందు రోజు మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికలకు ముందు ఈ విధంగా మీటింగ్ జరగడం ఎంతో ఆసక్తిగా ఉందని, ఇది ఒక మంచి ప్రారంభం అని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవడానికి, ప్రతిపక్షాలు కలిసికట్టుగా జరుపునున్న ఈ మీటింగ్ కోసం, నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చారు. 

ఈ ప్రతిపక్ష సమావేశానికి, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, శరత్ పవర్, మెహబూబా ముఫ్తీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి అగ్ర నేతలు హాజరు అయినట్లు తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్ నాయకులైన నితీష్ కుమార్ కు గురువారం లేఖ రాస్తూ, కుటుంబ కార్యక్రమం కారణంగా, చీఫ్ జయంత్ చౌదరి, శుక్రవారం జరగబోయే అతిపెద్ద ప్రతిపక్ష కార్యక్రమానికి హాజరు కావడం వీలుపడదు అంటూ చెప్పారు.