డ్రోన్ ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా చేస్తున్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర వ్యాఖ్యలు

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాకిస్తాన్ పై భారత్ విమర్శలు గుప్పించింది. భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తోందని ఈ చర్యను అంతర్జాతీయంగా ఖండించాలని భారతదేశ పిలుపునిచ్చింది. భద్రతామండలిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. డ్రోన్ లను ఉపయోగించే సరిహద్దు దాటి అక్రమ ఆయుధాల సరఫరా చేయడాన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆ భూభాగాలపై నియంత్రణలో ఉన్న అధికారులు , క్రియాశీల మద్దతు […]

Share:

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాకిస్తాన్ పై భారత్ విమర్శలు గుప్పించింది. భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తోందని ఈ చర్యను అంతర్జాతీయంగా ఖండించాలని భారతదేశ పిలుపునిచ్చింది. భద్రతామండలిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. డ్రోన్ లను ఉపయోగించే సరిహద్దు దాటి అక్రమ ఆయుధాల సరఫరా చేయడాన్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆ భూభాగాలపై నియంత్రణలో ఉన్న అధికారులు , క్రియాశీల మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదని ఆయన అన్నారు.  అంతర్జాతీయ సమాజం అటువంటి ప్రవర్తనను ఖండించాలని, వారి దుశ్చర్యలకు రాష్ట్రాలను బాధ్యులను చేయకూడదని వివరించారు. 

పంజాబ్, కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి పాకిస్తాన్ డ్రోన్ లను ఉపయోగిస్తుందని భారత్ అధికారులు నివేదించారు. గత సంవత్సరం నవంబర్ వరకు సుమారు 22 డ్రోన్‌లను భారత్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సంవత్సరంలో 266 డ్రోన్ చొరబాట్లు జరిగినట్లు నివేదికలో తెలిపారు. జనవరిలో భారతదేశ సరిహద్దు భద్రతాదళం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో డ్రోన్ ద్వారా ఆయుధాలను సరఫరా చేసినట్టు గుర్తించారు. చట్ట విరుద్ధమైన ఆయుధాల ఎగుమతల వలన అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని అన్నారు.

ఈ సమావేశంలో కాంబోజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ పేరు చెప్పనప్పటికీ ఆ దేశానికి సంబంధించిన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు, వారికి ఆయుధాలు సరఫరా చేసే కొన్ని దేశాల మధ్య కుమ్మక్కు జరిగిందని అలాంటి చర్యలకు పాల్పడిన ఆయా దేశాలను కూడా హెచ్చరించారు.  మస్కట్ ప్రొలిఫరేషన్ నెట్‌వర్క్‌లు సున్నితమైన వస్తువులు, సాంకేతికతలకు సంబంధించిన మోసపూరిత సేకరణ పద్ధతుల దృష్ట్యా, అనుమానాస్పద విస్తరణ ఆధారాలతో కొన్ని రాష్ట్రాలు ఉగ్రవాదులు ఇతర ప్రభుత్వ వ్యక్తులతో కొమ్మక్కైనప్పుడు ఈ ఉగ్రవాద బెదిరింపుల పరిమాణం రెట్టింపు అవుతుందని ఆమె తెలిపారు. ఉగ్రవాద సంస్థలు సంపాదించిన చిన్న ఆయుధాల  పరిమాణం, నాణ్యతలో పెరుగుదల, రాష్ట్రాల స్పాన్సర్‌షిప్, మద్దతు లేకుండా ఆయుధాలు సైనిక పరికరాల ఎగుమతులు లేకుండా ఉండవని పదేపదే గుర్తు చేశారు. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు రాజ్యం పోయడాన్ని విమర్శించలేమని అన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని రష్యా అధ్యక్షత వహించింది. జనవరిలో భారత దేశ సరిహద్దు భద్రతా దళం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో డ్రోన్ ఆయుధాలను పడేస్తున్నట్లు గుర్తించారు.

ఈ ఏడాది మార్చి 10న గురుదాస్‌పూర్ జిల్లా మెల్టా ప్రాంతంలో భారత్ – పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం రేపింది. పాక్ నుంచి భారత భూభాగంలోకి దూసుకువచ్చిన డ్రోన్‌ను భద్రతాబలగాలు కూల్చివేశాయి. ఇరుదేశాల సరిహద్దులలో పహారా కాస్తున్న సరిహద్దు భద్రతా బలగాలకు ఓ శబ్దం వినిపించింది. పాకిస్తాన్ భూభాగం నుంచి డ్రోన్ వస్తోందని గమనించిన సైన్యం వెంటనే అప్రమత్తమై దానిని కూల్చివేశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సైన్యం డ్రోన్ కూల్చిన పరిసర ప్రాంతాల్లో ఒక ఏకే సిరీస్ రైఫిల్ తోపాటు రెండు మ్యాగజైన్లు, 40 రౌండ్ల బుల్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు. భారత దేశంలోకి అక్రమంగా ఆయుధాలను రవాణా చేసి ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం ఆరోపించింది. తాజాగా మరోసారి ఇలాంటి చర్యలకే పాల్పడింది. పాకిస్తాన్ దాంతో భారతదేశం ఈ చర్యలపై ప్రపంచం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చింది.