G20 సమ్మిట్ కోసం సర్వం సిద్ధం

భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న G20 సమ్మిట్ కోసం సర్వం సిద్ధం. వీకెండ్ జరగబోతున్న ఈ సమావేశాలలో అనేక దేశాలు భారతదేశం రానున్నట్లు సమాచారం. సెప్టెంబరు 9 మరియు 10 తేదీల్లో G20 సదస్సు జరగనున్న భారత్ మండపంలో 27 అడుగుల ఎత్తున్న ‘నటరాజ’ విగ్రహాన్ని ‘అష్టధాతువు’తో తయారు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకించి, భారత్ మండపాన్ని ఎంతో చక్కగా ముస్తాబు చేశారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి విచ్చేసిన అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రత్యేకమైన హోటల్లో బస చేశారు. […]

Share:

భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న G20 సమ్మిట్ కోసం సర్వం సిద్ధం. వీకెండ్ జరగబోతున్న ఈ సమావేశాలలో అనేక దేశాలు భారతదేశం రానున్నట్లు సమాచారం. సెప్టెంబరు 9 మరియు 10 తేదీల్లో G20 సదస్సు జరగనున్న భారత్ మండపంలో 27 అడుగుల ఎత్తున్న ‘నటరాజ’ విగ్రహాన్ని ‘అష్టధాతువు’తో తయారు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకించి, భారత్ మండపాన్ని ఎంతో చక్కగా ముస్తాబు చేశారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి విచ్చేసిన అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రత్యేకమైన హోటల్లో బస చేశారు. ఈరోజు ప్రధానమంత్రి మోదీ,జో బిడెన్ మధ్య ఒక ప్రత్యేకమైన సమావేశం జరగనుంది.

చక్కని అలంకరణ: 

సెప్టెంబరు 9 మరియు 10 తేదీల్లో G20 సదస్సు జరగనున్న భారత్ మండపంలో 27 అడుగుల ఎత్తున్న ‘నటరాజ’ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాకుండా ఆ నటరాజ విగ్రహం ప్రత్యేకించి ‘అష్టధాతువు’తో తయారు చేశారు. ప్రపంచ దిగ్గజాలను స్వాగతించేందుకు భారత్ మండపం ముస్తాబైన వేళ, నటరాజ విగ్రహం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాకుండా భారత్ మండపం కన్నుల విందుగా కనిపిస్తోంది. చక్కని రంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రత్యేకంగా తయారైంది. సదస్సు కోసం ప్రపంచ దేశాల నుంచి రాబోయే దిగ్గజాల కోసం న్యూఢిల్లీ ఆకర్షణీయంగా ముస్తాబైనట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో కనిపించే వీధిలో రంగురంగుల బొమ్మలతో.. పెయింటింగ్స్ తో.. అలరిస్తున్నాయి. అంతేకాకుండా దిగ్గజాలు దిగబోయే హోటల్స్, రెస్టారెంట్లలో కూడా ప్రత్యేకమైన స్పెషల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 

G20 సమ్మిట్:

వచ్చేనెల సెప్టెంబర్ లో మన భారతదేశంలో G-20 సమ్మిట్ నిర్వహించబోతున్నారు. G-20 అంటే డెవలప్డ్ అలాగే డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు.

ఇంచుమించు 110 దేశాల నుంచి సుమారు 12,300 మంది ప్రతినిధులు రానున్నట్లు అంచనా. ఇప్పుడు వరకు భారతదేశంలో జరిగిన సమావేశాలలో, ఇప్పుడు జరగబోయే G-20 సబ్మిట్ అనేది అతి పెద్ద సమావేశం అని చెప్పుకోవచ్చు. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు.

G20 ముఖ్య ఉద్దేశాలు: 

అయితే ప్రస్తుతం సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమ్మిట్ ముఖ్యంగా, మల్టీ లేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రమాదాల నుంచి సమస్యలను పాండమిక్స్ను ఈజీగా ఎదుర్కొనే విధంగా, తమ దేశాలను మరింత బలంగా మార్చుకోవడమే కాకుండా, ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా బలంగా మారేలా, డెవలప్డ్ కంట్రీస్ గా మారేలా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల మీద చర్చించడమే, G-20 సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెప్టెంబర్ 8న ప్రత్యేకించి నరేంద్ర మోదీతో కొన్ని చర్చలు జరపడానికి హాజరుకానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించడం జరిగింది.

G20 సమ్మిట్ లో ముఖ్యంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, UK మరియు US ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ (EU). అతిథి దేశాలు: బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు UAE.