మ‌ణిపూర్‌లో మ‌రో ఘోరం

మణిపూర్‌లో అక్కడ చోటుచేసుకున్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఒక అప్పుడు  ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. ఈశాన్య రాష్ట్రంలో గత రెండు నెలలుగా జరుగుతోన్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, స్వాతంత్ర సమరయోధుడి భార్యను సజీవదహనం చేసిన అమానుష ఘటన బయటపడింది.కక్‌చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామంలో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యని దుండగులు సజీవంగా తగులబెట్టారు. ఈ ఘటన […]

Share:

మణిపూర్‌లో అక్కడ చోటుచేసుకున్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఒక అప్పుడు  ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. ఈశాన్య రాష్ట్రంలో గత రెండు నెలలుగా జరుగుతోన్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, స్వాతంత్ర సమరయోధుడి భార్యను సజీవదహనం చేసిన అమానుష ఘటన బయటపడింది.కక్‌చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామంలో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యని దుండగులు సజీవంగా తగులబెట్టారు. ఈ ఘటన మే 28న జరిగింది. కక్‌చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడి భార్య అయిన ఇబేటోంబి(80)ని దుండగులు సజీవంగా తగులబెట్టారు. బాధితురాలి భర్త చురాచంద్‌ సింగ్‌ స్వాతంత్య్ర సమరయోధుడు ఆయన తన 80వ ఏట మరణించారు. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్బుల్‌కలామ్‌ నుంచి సత్కారం అందుకొన్నారు. ఈ ఘటన మే 8 తెల్లవారుజామున చోటు చేసుకొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ రోజు గ్రామంలో భారీగా హింస చోటు చేసుకొంది. కాల్పులు కూడా జరిగాయి.

మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణల్లో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో సెరౌ ఒకటి. దుండుగులు గ్రామంపై దాడిచేయడంతో.. వెంటనే పారిపోండని తమ కుటుంబసభ్యులకు ఇబేటోంబి సూచించింది. వయోభారంతో తాను ఇంటిలోనే నిలిచిపోయింది. ఆమె ఇంటికి బయటి నుంచి తాళం వేసిన దుండగులు అనంతరం నిప్పుపెట్టారు. ఆమెను కాపాడేందుకు కుటుంబసభ్యులు వచ్చేసరికే ఇల్లు మొత్తం బూడిదైంది. ఆమె మనవడు ప్రేమ్‌కంఠకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. తన బామ్మను రక్షించే ప్రయత్నంలో అతడికి బుల్లెట్‌ గాయాలయ్యాయి.తమపై కూడా కాల్పులు జరిగాయని… కొన్ని తూటాలు చెయ్యి, కాలులో దూసుకుపోయాయని చెప్పాడు. “మాపై కాల్పులు జరగడాన్ని గమనించిన మా మామ్మ ముందు తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరింది. ప్రేమ్‌కంఠ  మీడియాతో మాట్లాడుతూ..గ్రామంపై దాడి జరిగిందని తెలియగానే మమ్నల్ని అందర్నీ ఇంటి నుంచి వెళ్లిపోయి. కొద్ది సేపటి తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్లండని నాన్నమ్మ చెప్పింది.. దురదృష్టవశాత్తూ అవే మాతో ఆమె చెప్పిన చివరి మాటలు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.అయితే… ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది” అని అతడు గుర్తుకు తెచ్చుకొన్నాడు.

నాన్నమ్మ తన వృద్ధాప్యం వల్ల ఇంటిలో ఉండిపోయారు.  ఆలస్యం చేస్తే మేము కూడా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని ఆయన బాధను పంచుకున్నారు .జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన సుమారు రెండు నెలల తర్వాత ప్రేమ్‌కంఠ్ ఒకప్పుడు ఇల్లు అని పిలిచే నిర్మాణం ఉన్న ప్రదేశానికి వచ్చాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో స్వాతంత్ర సమరయోధుడైన తన భర్త దిగిన ఇబేటోంబికి ఎంతో ప్రియమైన ఫోటోను శిథిలాల నుంచి తీసుకున్నాడు.సాయుధ మూక దాడి చేసిన రోజును గుర్తుచేసుకుంటూ ఇబేటోంబి కోడలు.. తాము ఒక ఎమ్మెల్యే ఇంటిలో ఆశ్రయం పొందామని, తీవ్రమైన కాల్పుల మధ్య చాలా కష్టంతో అక్కడకు చేరుకున్నామని తెలిపారు. ‘తెల్లవారుజామున 2.00 గంటలకు మేము భయపడి పారిపోయాం.. మేము ముందు వెళ్లిపోయాం.. తర్వాత మా అత్తను తీసుకురావడానికి ఒకరిని పంపించాలని అని అనుకున్నాం . కాల్పులు కొనసాగుతుండటంతో భయపడి మా స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో ఆశ్రయం పొందాం.. ఆపై మా పిల్లలు ఆమెను రక్షించడానికి ఉదయం 5.30-6 గంటల మధ్య  సమయంలో వెళ్లేటప్పటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది’ అని బాధ తో వాపోయారు .

ఈ గ్రామంలో కాలిన గృహాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చాలా ఇళ్ల గోడలపై తూటాలు దర్శనమిస్తున్నాయి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియ సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు పారిపోయారు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా మారిపోయింది.