గుజరాత్ వేదికగా మొదటి గ్లోబల్ సమ్మిట్ 

ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న WHO ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి భారత దేశంలో జరగబోయే మొదటి గ్లోబల్ సమ్మిట్, 2023 ఆగస్టు 17 మరియు 18 తేదీలలో భారతదేశంలోని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ట్రెడిషనల్ మెడిసన్ పై నిబద్ధత గురించి అదే విధంగా ఎవిడెన్స్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి సమీకరించడానికి G20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు ఇది నిర్వహించబడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు […]

Share:

ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న WHO ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి భారత దేశంలో జరగబోయే మొదటి గ్లోబల్ సమ్మిట్, 2023 ఆగస్టు 17 మరియు 18 తేదీలలో భారతదేశంలోని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ట్రెడిషనల్ మెడిసన్ పై నిబద్ధత గురించి అదే విధంగా ఎవిడెన్స్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి సమీకరించడానికి G20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు ఇది నిర్వహించబడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలు వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు అవసరాలను తీర్చడానికి పిలుపునిచ్చే మొదటి సమ్మిట్ అని కూడా చెప్పుకోవచ్చు.

ప్రత్యేకతలు: 

గ్లోబల్ సమ్మిట్‌ను WHO అదే విధంగా 2023లో G20 అధ్యక్షత వహిస్తున్న భారత ప్రభుత్వం సహ-హోస్ట్ ఉగా నిర్వహించబోతోంది. నార్మల్ ట్రెడిషన్ మెడిసన్ వర్కర్స్, వినియోగదారులు మరియు సంఘాలు, జాతీయ విధాన రూపకర్తలు, అంతర్జాతీయ సంస్థలు, సహా అన్ని వాటాదారులకు ఇది వేదిక అవ్వనుంది అని చెప్పుకోవాలి. విద్యావేత్తలు, ప్రైవేట్ రంగం మరియు పౌర సమాజ సంస్థలు, ఆరోగ్యం మరియు స్థిరమైన అభివృద్ధికి ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క గురించిన మరిన్ని సమాచారం, అదేవిధంగా, ట్రెడిషనల్ మెడిసన్ పై నిబద్ధత గురించి, ఎవిడెన్స్ అలాగే లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి సమీకరించడానికి G20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు ఇది నిర్వహించబడుతున్నట్లు సమాచారం.

నేడు దాదాపు 40% ఫార్మసిటికల్ ప్రొడక్ట్స్ అనేవి నార్మల్ నాచురల్ ప్రోడక్ట్ బేసిస్ తో తయారు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే, ఆస్పిరిన్, ఆర్టెమిసినిన్ మరియు క్యాన్సర్ ట్రీట్మెంట్లతో సహా ట్రెడిషనల్ మెడిసిన్స్ నుంచి హెల్ప్ తీసుకోవడం జరిగింది. జన్యుశాస్త్రం మరియు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో సహా కొత్త పరిశోధనలు రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. మూలికా మందులు(హెర్బల్ మెడిసిన్), సహజ ఉత్పత్తులు, ఆరోగ్యం మరియు సంబంధిత ప్రయాణాల కోసం పరిశ్రమలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, 170 సభ్య దేశాలు ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క వినియోగంపై WHOకి నివేదించాయి. అయితే ట్రెడిషనల్ మెడిసన్ వాడకం వల్ల సురక్షితకు సంబంధించి, ఖర్చుకు సంబంధించి మరియు సమానమైన ఉపయోగం కోసం విధానాలు, ప్రమాణాలు మరియు నియంత్రణను తెలియజేయడానికి కొన్ని ఎవిడెన్స్ అలాగే డేటాను అడగడం జరిగింది.

ఈ పెరిగిన గ్లోబల్ ఆసక్తి మరియు డిమాండ్‌ చూసిన తర్వాత, WHO, భారత ప్రభుత్వ మద్దతుతో మార్చి 2022లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను నాలెడ్జ్ హబ్‌గా స్థాపించింది. WHO ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్ విషయంలో WHO యొక్క ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆరు ప్రాంతీయ కార్యాలయాలు మరియు ప్రధాన కార్యాలయాలలో నిర్వహించబడే ఫంక్షణాలిటీ ప్రాసెస్, ప్రధాన WHO కార్యాలయాల ద్వారా జరుగుతున్నాయి. సమ్మిట్ థీమ్ గురించి చెప్పాలంటే, ఫార్మాట్, అంశాలు మరియు పరిష్కరించాల్సిన సమస్యలపై, క్రాస్-రీజనల్ నిపుణుల ప్యానెల్ సలహా ఇస్తుంది. 

ఆయుష్ శాఖ ఏమంటుంది: 

విలేకరుల సమావేశంలో కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పారా మహేంద్రభాయ్ కాళూభాయ్, ఆయుష్ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమ్మిట్ గురించి మాట్లాడుతూ, సమ్మిట్ అవుట్ కం అనేది ఒక డిక్లరేషన్ వంటిది అని, అయితే డిక్లరేషన్ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ యొక్క భవిష్యత్తును రూపొందించడంలో WHOకి సహాయం చేస్తుంది.. అంటూ చెప్పుకొచ్చింది ఆయుష్ శాఖ. 

మరోవైపు, WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజినల్ సెంటర్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మనోజ్ ఝలానీ సమ్మిట్ గురించి మాట్లాడుతూ, ఈ సమ్మిట్ మధ్య పరస్పర అనుసంధానాన్ని గుర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు మరింత సమగ్రమైన మరియు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించే దిశగా రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారని.. కోట్ల మంది ప్రజలు వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు అవసరాలను తీర్చడానికి పిలుపునిచ్చే మొదటి సమ్మిట్ అని కూడా చెప్పుకొచ్చారు.