హర్యానాలో తిరిగి శాంతిని తీసుకువద్దాం: రైతులు

శాంతి కోసం సమావేశం: హర్యానా రాష్ట్రంలో మత హింసను ఎదుర్కోవడానికి తమ సంకల్పాన్ని ప్రకటించడానికి రైతు సంఘాలు మరియు ఖాప్ పంచాయితీల నాయకులు హిసార్‌లోని బాస్ గ్రామంలో సమావేశమయ్యారు. నూహ్‌ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కొద్ది రోజుల తర్వాత హర్యానాలోని రైతు సంఘాలు మరియు ఖాప్ పంచాయితీల నాయకులు ముస్లిం సమాజ సభ్యులను బెదిరించడానికి కనీసం వారిని ముట్టుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని బుధవారం ప్రకటించారు. ఇటీవలి హింసాకాండ తర్వాత హర్యానాలో ఈ స్థాయిలో జరిగిన సమావేశంలో […]

Share:

శాంతి కోసం సమావేశం:

హర్యానా రాష్ట్రంలో మత హింసను ఎదుర్కోవడానికి తమ సంకల్పాన్ని ప్రకటించడానికి రైతు సంఘాలు మరియు ఖాప్ పంచాయితీల నాయకులు హిసార్‌లోని బాస్ గ్రామంలో సమావేశమయ్యారు. నూహ్‌ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కొద్ది రోజుల తర్వాత హర్యానాలోని రైతు సంఘాలు మరియు ఖాప్ పంచాయితీల నాయకులు ముస్లిం సమాజ సభ్యులను బెదిరించడానికి కనీసం వారిని ముట్టుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని బుధవారం ప్రకటించారు.

ఇటీవలి హింసాకాండ తర్వాత హర్యానాలో ఈ స్థాయిలో జరిగిన సమావేశంలో హిందూ, ముస్లిం మరియు సిక్కు వర్గాలకు చెందిన దాదాపు 2,000 మంది రైతులు, రైతు పంచాయితీలు హాజరయ్యారు. ముస్లిం సమాజ సభ్యులకు బెదిరింపులు, అంతేకాకుండా వారి గ్రామాల్లోకి మైనారిటీ కమ్యూనిటీ సభ్యుల ప్రవేశానికి వ్యతిరేకంగా, అంతేకాకుండా ముస్లింలు తమ పంచాయతీ పరిధిలో ఎటువంటి వ్యాపారాలు చేయకూడదని, కొన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది ఇద్దరు ముస్లిం సోదరుల హత్య కేసులో నిందితుడుగా ఉన్న మోను మానేశర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మత హింసాకాండ నేపథ్యంలో రెండు వారాల పాటు మూసివేసిన నూహ్‌లోని పాఠశాలలు మరియు రవాణా సేవలు ఈరోజు తిరిగి ప్రారంభం అవ్వనున్నాయి. ముస్లిం మతపెద్దలు కూడా తమ ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని అధికారులు కోరారు. 

నహ్ హింస: 

దాదాపు 200 మందితో కూడిన ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు నూహ్‌ పట్టణంలోని ఎడ్వర్డ్ చౌక్ నుండి ప్రారంభించిన 10 నిమిషాల తర్వాత హింస ప్రారంభమైందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ బృందం ప్రధాన రహదారిపై వెళ్తున్న క్రమంలో, మరొక వర్గానికి చెందిన కొన్ని గుంపులు రాళ్లతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హిందువుల వర్గానికి చెందిన కొన్ని గుంపులు మొదట తప్పించుకునే పారిపోయినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ గుమిగూడి ప్రతీకారం తీర్చుకున్నారని పోలీసు వారు వెల్లడించారు.

ఫిబ్రవరిలో భివానీ జిల్లాలో, కాలిపోయి, మృతదేహాలుగా కనిపించిన ఇద్దరు ముస్లింల హత్య కేసులో, నిందితులుగా పరిగణలోకి తీసుకున్న, బజరంగ్ దళ్ సభ్యుడు ఒకరు అంతేకాకుండా గోసంరక్షకుడు మోను మనేసర్ కూడా, ప్రస్తుతం ఆ రోజున జరిగిన ఊరేగింపులో పాల్గొంటారు అని తెలిసిన క్రమంలో హింస చలారేగడానికి కారణమని ఒక అధికారి తెలిపారు. 

మరోవైపు, ఒక వర్గానికి చెందిన ఊరేగింపులో ప్రజలు రెచ్చగొట్టే నినాదాలు చేశారని, నూహ్‌లోని పున్హానా పరిసర నివాసి నసీర్ అహ్మద్ ఆరోపించారు. ఫిరోజ్‌పూర్ జిర్కా నివాసి ఇక్బాల్ ఖాన్, ఊరేగింపులో ఉన్న వ్యక్తులు మొదట, అటువైపుగా నడుస్తున్న కొంతమంది మీద దాడి చేశారని ఆరోపించారు. 

హింస జరుగుతున్న క్రమంలోనే, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (హోడల్) సజ్జన్ దలాల్ తలపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన, గాయపడిన మరొక గురుగ్రామ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అతని కడుపులో బుల్లెట్ గాయం కూడా ఉందని పోలీసు అధికారి తెలిపారు.

ఇదిలా ఉండాగా, ఇది నిజంగా ఎవరో చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అల్లర్ల జరిగినప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో లారీలు ఉన్నాయని, అవి ఎవరికైనా ఉచితంగా పంచే వస్తువుల.. అని ప్రశ్నించారు హర్యానా మినిస్టర్. అదేవిధంగా పోలీసుల మీదకే, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కాల్పులు జరపడానికి, వారికి ఎవరో ప్లాన్ చేసి మరి తుపాకీలు అందించారని, కావాలనే ఇటువంటి హింసకు పాల్పడుతున్నారని ఆయన అనుమానాన్ని బయటపెట్టారు.