పవన్ కళ్యాణ్ నిజ నిజాలు తెలుసుకోవాలి

గ్రామ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు సరి కాదని, తాను ప్రస్తుతాన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది అని మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని ఆదివారం పవన్ కళ్యాణ్ విమర్శల మీద మండిపడ్డారు. పవన్ ఇలా మాట్లాడటం సరికాదు:  వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప సేవలందిస్తున్నారని నాని అన్నారు. జనసేన పార్టీ అధినేత ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్ల గురించి గురించి కించపరిచేలా మాట్లాడడం సరికాదు. పవన్ కళ్యాణ్ […]

Share:

గ్రామ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు సరి కాదని, తాను ప్రస్తుతాన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది అని మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని ఆదివారం పవన్ కళ్యాణ్ విమర్శల మీద మండిపడ్డారు.

పవన్ ఇలా మాట్లాడటం సరికాదు: 

వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప సేవలందిస్తున్నారని నాని అన్నారు. జనసేన పార్టీ అధినేత ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్ల గురించి గురించి కించపరిచేలా మాట్లాడడం సరికాదు. పవన్ కళ్యాణ్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వాలంటీర్లకు, పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిన తప్పుడు సమాచారానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేయాలని ఆయన జనసేన అధ్యక్షుడిని కోరారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని, పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు చేశారు. నాయుడు రాజకీయాలు కేవలం టీడీపీ అధినేతకు మాత్రమే పనిచేస్తాయని, ప్రజలకు కాదని ఆయన నొక్కి చెప్పారు.

గ్రామ వాలంటీర్ సిస్టం ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 2019లో మొదలుపెట్టారు. ప్రతి ఇళ్లకు వెళ్లి వాళ్లకి సంబంధిత వెల్ఫేర్ స్కీములు మరియు ఆదాయాలను వివరించడం కోసం వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాలంటీర్స్ తమ పనిని సక్రమంగా నిర్వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విమర్శ: 

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఈ ఆదివారం పబ్లిక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంలో వాలంటీర్స్ పై విమర్శలు వెల్లడించారు. వాలంటీర్స్ తమ పని సక్రమంగా చేయట్లేదని వాళ్లు మహిళలను టార్గెట్ చేసి, ప్రతి ఇంట్లో ఉండే వంటరి మహిళల గురించి సమాచారాన్ని డేటా బేస్ కి అందిస్తున్నట్టు, ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని పవన్ వాలంటీర్లు ఉద్దేశించి మాట్లాడారు.

గత నాలుగు సంవత్సరాలుగా చూసుకుంటే 18 మహిళలు మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయని కానీ వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వాలంటీర్స్ అందరూ ఒంటరిగా మహిళలు నివసించే ఇళ్లలపై టార్గెట్ చేశారని వారి సమాచారాన్ని సేకరిస్తున్నారని, కిడ్నాప్ లకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని సాగిస్తూ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ సిస్టం ని వాళ్ళ చేస్తున్న అన్యాయాలని ఆపాలంటూ తెలిపారు. వాలంటీర్స్ ప్రతి ఇళ్లలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అలాగే సేకరించిన సమాచారానంతటిని నానక్రం గూడా అనే ప్రాంతంలో ఒక ఏజెన్సీలో స్టోర్ చేసినట్లు కూడా తెలిపారు.

కేసు పెట్టిన వాలంటీర్: 

ఈ విషయంపై స్పందించిన ఒక గ్రామ వాలంటీర్ దిగమంటే సురేష్ బాబు అనే వ్యక్తి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 153 సెక్షన్స్ కింద కేసు పెట్టాడు. 

వైయస్సార్సీపి టాప్ లీడర్స్ కొంతమంది ఉమెన్ ట్రాఫికర్స్గా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ మహిళల కమిషన్ ఈ జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ఫై కేసులో జారీ చేసింది. వెంటనే ఆయన వాలంటీర్లు పై చేసిన ఆరోపణలకి సరైన ఆధారాలను సమర్పించాలని తెలిపింది.