చంద్రబాబు నాయుడు కేసు వివరించిన సిఐడి చీఫ్

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పలు కేసులు విషయంలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ముఖ్య సూత్రధారిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేసులో ఎలాంటి మలుపులు ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అనేది సిఐడి చీఫ్ సంజయ్ ప్రస్తుతం పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ ఫినాన్స్ సెక్రటరీ రమేష్ ప్రశ్నించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు కేసు గురించి వివరించిన సిఐడి చీఫ్:  చంద్రబాబు నాయుడు పర్సనల్ […]

Share:

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పలు కేసులు విషయంలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ముఖ్య సూత్రధారిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేసులో ఎలాంటి మలుపులు ఉన్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అనేది సిఐడి చీఫ్ సంజయ్ ప్రస్తుతం పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ ఫినాన్స్ సెక్రటరీ రమేష్ ప్రశ్నించడం కూడా జరిగింది.

చంద్రబాబు నాయుడు కేసు గురించి వివరించిన సిఐడి చీఫ్: 

చంద్రబాబు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ అయిన శ్రీనివాస్ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా పలుసార్లు ప్రశ్నించడం జరిగిందని అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకి ఇటీవల ఐటీ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే అని ఆయన చెప్పుకోచారు. అయితే 100 కోట్ల స్కాం గురించి ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత నాయుడు పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి స్కాంలో కీలక వ్యక్తులుగా నిర్ధారించడం జరిగింది. అంతే కాకుండా, వారు ఎలా ఫేక్ ఇన్వాయిస్లను జనరేట్ చేసిన విషయం కూడా ఐటీ శాఖ, అదే విధంగా ED ప్రశ్నించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా రూ. 241 కోట్లు ముఖ్య సూత్రధారికి మళ్ళించినట్లు స్పష్టమైనప్పటికీ, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో కాస్త గ్యాప్ కొనసాగుతోందని, అంతేకాకుండా ఇతర కేసుల విషయంలో కూడా నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ హస్తము ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సిఐడి చీఫ్ సంజయ్ మాట్లాడడం జరిగింది. 

అయితే ఇతర కేసుల విషయాల గురించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ మొదలైనట్లు సిఐడి చీఫ్ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ అయిన శ్రీనివాసుని, అదేవిధంగా ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు, అయితే పెద్ద మొత్తంలో రిసిప్ట్స్ అలాగే ట్రాన్సాక్షన్ జరిగిన ఆధారాలు బయటపడినట్లు సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. శ్రీనివాస్ మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఒప్పుకోకపోగా, ప్రస్తుతం ప్రభుత్వ పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పిన విధంగానే తాను చేస్తున్నట్లు వింతగా వాదించడం కూడా కనిపించిందని సిఐడి చీఫ్ అయిన సంజయ్ చెప్పుకొచ్చారు. 2018 నుంచి కూడా జిఎస్టి ద్వారా బయటపడిన కొన్ని ముఖ్య అంశాల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని, అంతేకాకుండా జిఎస్టి విషయంపై 2021లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా సిఐడి వారు వెల్లడించారు. ఇందులో పై ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు వాళ్ళు గుర్తించినట్లు చెప్పారు. 

అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్టయిన పలువురిని ప్రశ్నించగా, వారు చంద్రబాబు నాయుడు పేరు మాత్రం బయటికి చెప్పలేనట్లు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. గవర్నమెంట్ ఏజెన్సీలకుగాను బయట వారిని అపాయింట్ చేస్తూ, ఒకరు పని చేస్తున్నప్పటికీ నలుగురు పని చేస్తున్నారు అని తప్పుడు కాగితాలు సృష్టించి, ఎటువంటి పని జరగకపోయినా ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ డబ్బును మలించినట్లు వెల్లడించారు సిఐడి చీఫ్ సంజయ్. అంతేకాకుండా, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కింద పని చేసే శ్రీనివాస్ అదే విధంగా మరో వ్యక్తి మనోజులకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, వారు విదేశాలకు పారిపోయారని ఆయన వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు మీద మరిన్ని కేసులు: 

అమరావతి క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసును కూడా CID దర్యాప్తు చేస్తోంది, దీనిలో నాయుడు మరియు అతని మాజీ క్యాబినెట్ సహచరుడు నారాయణ.. ఇతర సన్నిహితులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రణాళికలో మార్పులు చేశారని వారు ఆరోపించారు. మరో ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ కేసులో నాయుడు తనయుడు లోకేష్ ప్రమేయం ఉందని, అయితే ఈ విషయం గురించి కూడా ఇండస్ట్రీషన్ జరుగుతున్నట్లు సంజయ్ వివరించారు.