85 ఏళ్ల గిరిజన మహిళను చేసిన వృద్ధుడు

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 60 ఏళ్ల వృద్ధుడు 85 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన వీడియో వైరల్ అవుతోంది,,ఇప్పటికి మూఢనమ్మకాలతో బతికేస్తున్న జనాలు…  ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కొంతమందిలో మాత్రం ఇప్పటికీ మూఢనమ్మకాలు బలంగా పాతుకుపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఢా నమ్మకాలను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వీటిపై  అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది మాత్రం వాటిని మరువట్లేదు . తాజాగా ఒక వృద్ధుడు తనను శివుడు పంపాడు అని చెప్పి.. తిరిగి బతికిస్తాను అని 85 ఏళ్ల మహిళపై […]

Share:

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 60 ఏళ్ల వృద్ధుడు 85 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన వీడియో వైరల్ అవుతోంది,,ఇప్పటికి మూఢనమ్మకాలతో బతికేస్తున్న జనాలు…  ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కొంతమందిలో మాత్రం ఇప్పటికీ మూఢనమ్మకాలు బలంగా పాతుకుపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఢా నమ్మకాలను ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వీటిపై  అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది మాత్రం వాటిని మరువట్లేదు . తాజాగా ఒక వృద్ధుడు తనను శివుడు పంపాడు అని చెప్పి.. తిరిగి బతికిస్తాను అని 85 ఏళ్ల మహిళపై 60 ఏళ్ల వృద్ధుడు విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. వృద్ధురాలిపై దాడి చేస్తున్న షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది..  రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అసలు ఏం జరిగింది..?

60 ఏళ్ల వయసున్న ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. అలా నడిచి వెళ్తుండగా మార్గమధ్యలో అతనికి 85 ఏళ్ల వయసున్న కల్కీ బాయి అనే వృద్ధురాలు కనిపించింది దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్తున్నటువంటి ఆ వృద్ధురాలితో ప్రతాప్ సింగ్ మాటలు కలిపాడు.

వృద్ధురాలు పక్కన కూర్చుని, తనని తాను శివుడి అనుచరుడినని చెప్పుకొచ్చాడు నువ్వు రాణివని.. చంపి తిరిగి బతికిస్తానంటూ ఆమెతో అన్నాడు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆ వృద్ధురాలి ఛాతిలో  బలంగా గుద్దాడు..  ఆ దెబ్బని తట్టుకోలేక ఆ మహిళ అకస్మాత్తుగా కుప్ప కూలిపోయింది.అక్కడితో ఆగకుండా జుట్టు పట్టుకుని కొంత దూరం లాగాడు.. అయితే పక్కనే ఉన్న ఒక వ్యక్తి ప్రతాప్ సింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించాడు. అయినా కూడా అతడు వినలేదు.. ఆమె కిందపడిపోయింది. నేలపై పడిపోయిన ఆ వృద్ధురాలిని గొడుగుతో దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బకి ప్రాణాలు వదిలింది వృద్ధురాలు. ఈ దారుణం జరుగుతుండగా అక్కడున్న కొంతమంది వ్యక్తులు ఈ సంఘటనను తమ మొబైల్ ‌ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన తెలయడంతో అక్కడ స్థానికంగా కలకలం రేపింది. 

అయితే ఈ హత్య గురించి రక రకాల పుకారులు వినిపిస్తున్నాయి కొంతమంది ఆ వృద్ధురాలు మంత్రగత్తెగా అనుమానం వ్యక్తం చేయడంతో ప్రతాప్ సింగ్ ఆమెను హత్య చేసినట్లు ప్రచారం చేశారు.ఇంకొంతమంది …ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతోనే చంపాడన్న పుకార్లు వచ్చాయి. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదంతా అవాస్తవమని, అది అనుకోకుండా జరిగిన హత్య అని తేల్చి చెప్పారు.

అయితే పోలీసులు మాత్రం ఆ వదంతులను ఖండించారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు తాను శివడి అవతామనే భ్రమలో ఉన్నాడని చెప్పారు. తిరిగి బతికిస్తానంటూ చెప్పి ఆ వృద్ధురాలిపై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. .మద్యం మత్తులో ఉన్న నిందితుడు ప్రతాప్ సింగ్ వింతగా ప్రవర్తిస్తున్నాడనీ,  స్త్రీని చంపి, ఆమెను మళ్లీ బతికించగలనని నమ్మాడని పోలీసులు తెలిపారు.ఆ నిందితుడ్ని ఆపడానికి ప్రయత్నించిన యువకులకు దారుణంగా దూషిస్తూ.. దాడి చేసే ప్రయత్నించాడని, ఆ యువకులు ఎంత వారించిన పట్టించుకోలేదని తెలిపారు పోలీసులు. 

ఎస్పీ భువన్ భూషణ్ మాట్లాడుతూ.. 

ఉదయ్ పూర్ ఎస్పీ భువన్ భూషణ్ మాట్లాడుతూ.. పోలీసులు నలుగురిని అరెస్టు చేశారని వివరించారు. ఆ వృద్ధుడు హెల్యుజనేట్ అయినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. ప్రతాప్ సింగ్ తనను తాను శివుడి అవతారం అని నమ్మించుకున్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ కల్కి బాయిని చంపేసి మళ్లీ ఆమెను రక్షించగలననీ భ్రమించాడని వివరించారు.