చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు..!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన న్యాయవాదులు క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్ లతోపాటు ఇతర కేసులపై ముందస్తు బెయిల్ పిటిషన్లను వేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన తీర్పులు వెలువడాల్సి ఉంది. ఈ సమయంలో బాబుకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. దీంతో… బాబు మరో రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. స్కిల్‌ స్కాం […]

Share:

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన న్యాయవాదులు క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్ లతోపాటు ఇతర కేసులపై ముందస్తు బెయిల్ పిటిషన్లను వేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన తీర్పులు వెలువడాల్సి ఉంది. ఈ సమయంలో బాబుకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. దీంతో… బాబు మరో రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఈ నెల 11న ఏసీబీ కోర్టు నేటి వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

అంతకముందు శుక్రవారంతో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో.. పోలీసులు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును వర్చువల్ గా హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఇందులో భాగంగా… జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి బాబుని అడిగారు. స్పందించిన బాబు..ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని, జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు.

 ఇదే సమయంలో తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పిన బాబు…అక్రమంగా తనను అరెస్ట్ చేశారని, తన నిజాయితీ గురించి దేశం, రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. తన హక్కుల్ని రక్షించాలని.. న్యాయాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు.. తనపై రాజకీయంగా కక్షసాధిస్తున్నారు అన్నారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సింది అన్నారు. తన మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని.. చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయాన్ని గౌరవిస్తానని, ఇదే తన బాధ, ఆవేదన అని తెలిపారు. అలాగే చంద్రబాబు చెప్పిన విషయాలను జడ్జి కూడా నోట్ చేసుకున్నారు. అలాగే జైల్లో ఎవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలన్నారు.. జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలపై జడ్జి నివేదిక కోరారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి… జైలులో మరిన్ని సౌకర్యాలు అవసరమైతే, దానికి అనుగుణంగా ఆదేశాలిస్తామని తెలిపారు. అదే విధంగా మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది.. మరోపక్క కస్టడీ అవసరం లేదని మీ తరఫు న్యాయవాదులు వాదించారు అని వివరంగా చెప్పారు. ఇదే సమయంలో… మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు, దీన్ని మీరు దీన్ని శిక్షగా భావించవద్దని న్యాయమూర్తి తెలిపారు.

 జ్యుడీషియల్ రిమాండ్ ను మీరు స్పొర్టివ్ గా తీసుకోవాలని బాబుకు సూచించిన న్యాయమూర్తి… మీపై చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందువల్ల రిమాండ్ ను పొడిగిస్తునామని తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు నిందితులు బయట ఉంటే దానికి ఆటంకం కలుగుతుందని విచారణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపుతామని చెప్పారు. జ్యుడిషియల్ రిమాండ్‌ అంటే కోర్టు సంరక్షణలో ఉన్నట్లేనని తెలిపారు. కోర్టు ఆదేశాలను సానుకూల దృక్పథంతో, హుందాగా చూడాలన్నారు.అనంతరం మీరు 24వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉంటారని చంద్రబాబుకు న్యాయమూర్తి తెలిపారు. 

దీంతో ఎల్లుండి వరకూ బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. మరోవైపు.. ఐదు రోజుల సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పు 2:30 గంటలకు వాయిదా వేశారు. అదేవిధంగా.. ఇప్పటికే వాదనలు పూర్తయిన క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పును ఈ నెల 19న హైకోర్టు రిజర్వ్‌ లో పెట్టిన నేపథ్యంలో… ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టు ముందుకు రానుందని అంటున్నారు.