మణిపూర్ ఘ‌ట‌న‌ను సీబీఐకి అప్ప‌గించిన కేంద్రం

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది […]

Share:

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.

హింసకు కారణమైన నలుగురు అరెస్ట్: 

మే 4న కాంగ్‌కోపి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించిన కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు జూలై 20న తెలిపారు.

కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. తౌబాల్ జిల్లా, నాంగ్‌పోక్ సెక్మై PS పరిధిలో ఆడవాళ్ళని ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసిన సంఘటన వెలుగులకు వచ్చిన అనంతరం. ఈ దారుణమైన నేరానికి సంబంధించిన మరో 03 ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురను అరెస్టు చేశారు అని మణిపూర్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు. 

వైరల్ వీడియో కేసు:

తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్ మరియు సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 ప్రధాన నిందితులను ఈరోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురును అరెస్టు చేశారు.మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడం గమనార్హం. ఈ దుర్ఘటనకు సంబంధించి, మణిపూర్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మే 4న కాంగ్‌కోపి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడితో సహా మొత్తం ఇద్దరిని అరెస్టు చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ జూలై 20న తెలిపారు.

సైకుల్ పోలీస్ స్టేషన్‌లో బి. ఫైనోమ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల చీఫ్ తంగ్‌బోయ్ వైఫేయ్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, అదే సంఘటనలో మరో ఆడపిల్ల మీద కూడా సామూహిక అత్యాచారం జరిగినట్లు తేల్చారు. భారతీయ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సిబిఐ విచారణ: 

మే నెలలో మణిపూర్ గ్రామాలలో జాతి హింస చెలరేగినప్పటి నుండి 140 మందికి పైగా మరణాలు సంభవించగా మరి ఎంతోమంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ముఖ్యంగా మణిపూర్ లోని ఆడవారి మీద హింస మరింత చెలరేగిపోతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఇంతకంటే అత్యవసరం ఏమీ లేదని ప్రతిపక్షం వాదిస్తోంది. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్.. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.

మణిపూర్‌లోని హింసాకాండ విదేశాల్లో కూడా చర్చనీయంగా మారింది. యూరోపియన్ పార్లమెంట్ భారతదేశంలోని మానవ హక్కుల పరిస్థితిపై తీర్మానాన్ని ఆమోదించింది, మణిపూర్‌లో ఇటీవలి ఘర్షణలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.