రైతు వేదిక నిర్వహించబోతున్న బిఆర్ఎస్

ప్రతి ఊర్లో రైతు వేదిక ద్వారా కాంగ్రెస్ లీడర్స్ తో డిబేట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ లీడర్స్ ఒక సమావేశంలో రైతులకి 24 గంటలు ఫ్రీ కరెంట్ పంపిణీ చేస్తారని చెప్పారు. శనివారం రోజున జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇద్దరూ BRS మినిస్టర్స్ టీ. నిరంజన్ రెడ్డి మరియు  జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ లో 24 గంటలు ఫ్రీ విద్యుత్ సరఫరా చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం కి […]

Share:

ప్రతి ఊర్లో రైతు వేదిక ద్వారా కాంగ్రెస్ లీడర్స్ తో డిబేట్ చేయబోతున్నారు. కాంగ్రెస్ లీడర్స్ ఒక సమావేశంలో రైతులకి 24 గంటలు ఫ్రీ కరెంట్ పంపిణీ చేస్తారని చెప్పారు. శనివారం రోజున జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇద్దరూ BRS మినిస్టర్స్ టీ. నిరంజన్ రెడ్డి మరియు  జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ లో 24 గంటలు ఫ్రీ విద్యుత్ సరఫరా చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం కి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణతో మాట్లాడిన అనంతరం తెలంగాణలో కూడా ప్రతి గ్రామంలో ఇది అమలు చేయాలని చెప్పడం జరిగింది.

వ్యవసాయానికి ఫ్రీ కరెంట్: 

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ లక్ష్యంగా, సోమవారం నుంచి 10 రోజుల పాటు ప్రతి గ్రామాన్ని కవర్‌ చేస్తూ రైతుకు సహాయం చేసేందుకు ఉచిత కరెంట్ అందించే క్రమంలో వేదికలు ఏర్పాటు కోసం బిఆర్ఎస్ నిర్ణయించింది.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రైతులకు విద్యుత్‌ సరఫరాపై కాంగ్రెస్‌ నేతల ఆవేదనను విస్తృతంగా ప్రచారం చేయాలని కెసిఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్లుగా తెలంగాణలో రైతులకు, కేవలం మూడు గంటల కరెంటు సరిపోతుందా అనే అంశంపై ప్రతి గ్రామంలో చర్చలు జరపాలని కోరారు.

రైతులకు క్షమాపణ చెప్పాలి: 

గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులతో సరేనా చర్చలు జరగాలని, ఒక్కో సభకు కనీసం 1000 మంది రైతులు హాజరు కావాలని రావు కోరారు. ఉచిత విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలను ఖండిస్తూ తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయాలన్నారు.

అంతేకాకుండా, శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్ని రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాకు అనుకూల విధానాన్ని రూపొందించిందన్న తెలంగాణ, కాంగ్రెస్ నేతల వాదనలు నిజమైతే, వెంటనే కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అమలు చేయాల్సిందే అంటూ కోరారు. అప్పుడే రైతులు తాము చేసే వ్యాఖ్యలను కచ్చితంగా నమ్మగలరని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్‌ ఉత్పత్తి ఉందని, అయితే తెలంగాణ తరహాలో రైతులకు 24 గంటల కరెంట్‌ ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్మడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వాపోయారు. 

రైతుల పడుతున్న కష్టాలు: 

ప్రతి ఏటా మనకు అన్నం పెడుతున్న రైతులు ఎంతో కష్టపడుతున్నారు. అకాల వర్షాల కారణంగా వ్యవసాయం ఒక్కసారిగా కుదేలు అవుతుంది. మరోసారి అనావృష్టి కారణంగా రైతుకి కూడా తినడానికి తిండి లేకుండా పోతుంది. సరైన విద్యుత్ సరఫరా లేకుండా రైతు పంటకు నీరు ఎలా పెట్టగలడు? రైతులకు విలువ అంతకంతకు తగ్గుతుందని కనిపిస్తోంది.. దీని గురించి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆలోచించి రైతు కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని ప్రభుత్వాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నప్పటికీ, అది ఎంతవరకు సఫలం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

రైతుకు సరైన గౌరవం మర్యాద ఉంటేనే రైతు పంట పండించగలడు, దేశంలో ఉన్న జనాభా కి వంట సరఫరా చేయగలడు. లేదంటే మొన్న టమాటా రేటులు పెరిగినట్టే, రేపు బియ్యం రేట్ పెరిగిన ఆశ్చర్యపడక్కర్లేదు.