జనవరి 2024 నాటికల్లా అయోధ్య విమానాశ్రయం

అయోధ్య విమానాశ్రయం:  అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల నుండి కోడ్‌షేర్ విమానాల ద్వారా అయోధ్య చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రామ మందిరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఆధునికతను సంప్రదాయంతో త్వరలోనే ప్రారంభం కావడానికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు.  అయోధ్య విమానాశ్రయం మొదటి దశ నిర్మాణం అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతుందని, ఉత్తరప్రదేశ్ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ ఇటీవల […]

Share:

అయోధ్య విమానాశ్రయం: 

అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల నుండి కోడ్‌షేర్ విమానాల ద్వారా అయోధ్య చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రామ మందిరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఆధునికతను సంప్రదాయంతో త్వరలోనే ప్రారంభం కావడానికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. 

అయోధ్య విమానాశ్రయం మొదటి దశ నిర్మాణం అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతుందని, ఉత్తరప్రదేశ్ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. అయితే, విమానాశ్రయం అధికారిక ప్రారంభోత్సవం జనవరి 2024లో జరుగుతుంది అని పేర్కొన్నారు. విమానాశ్రమంలో 6,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక మధ్యంతర టెర్మినల్‌ కూడా ఉంటుంది. రద్దీ సమయాల్లో గరిష్టంగా 300 మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి మరియు 6,00,000 మంది ప్రయాణికులు కోసం వార్షిక సామర్థ్యంతో రూపొందించబడిన ఈ టెర్మినల్ నిజానికి ఒక అద్భుతం అని చెప్పుకోవాలి.

టెర్మినల్ యొక్క పైకప్పు చూడడానికి చాలా ఎత్తుగా ఒక పాతకాలం సాంప్రదాయంలో ఉంటుంది (గోపురం లాంటి నిర్మాణాలు) అలంకరించబడి, భవనానికి గొప్పతనాన్ని జోడిస్తుంది. ముఖ్యంగా, విమానాశ్రయంలో మనకి కనిపించే తంబాలు, రామాయణంలోని ముఖ్యమైన సంఘటనలను స్పష్టంగా వర్ణిస్తాయి, ప్రయాణికులకు ఆకట్టుకునేలా అద్భుతంగా కనిపించనున్నాయి. అయోధ్య రాజభవనం యొక్క వైభవాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయం ఎంట్రన్స్ గాజుతో రూపొందించబడి ఉంటుంది.

ఆర్కిటెక్చరల్ డిజైన్ స్థానిక హస్తకళను అదేవిధంగా ప్రస్తుత టెక్నాలజీ తో కూడి ఈ విమానాశ్రయం నిర్మాణం అనేది, సౌందర్య ఆకర్షణ మరియు క్రియాత్మక సామర్థ్యం రెండింటినీ కలగలిపి ఉంటుంది అని అధికారులు గొప్పగా ఉత్సాహంగా విమానాశ్రయ కట్టడాన్ని వివరిస్తున్నారు.

అంతేకాకుండా, పవర్ వినియోగాన్ని తగ్గించడం మరియు మొత్తం సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పర్యావరణానికి ప్రతిస్పందించే వ్యవస్థలు అనేవి నిర్మాణంలో భాగంగా ఉన్నాయి. స్కైలైట్‌లు, సోలార్ పవర్ సిస్టమ్‌లు మరియు సమర్థవంతమైన రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ మెకానిజమ్‌లు లాంటివి కేవలం కొన్ని పర్యావరణ స్పృహతో కూడిన ఫీచర్లు మాత్రమే విమానాశ్రయంలో చేర్చబడ్డాయి. సౌకర్యాల పరంగా, టెర్మినల్‌లో ఎనిమిది చెక్-ఇన్ కౌంటర్లు మరియు మూడు కన్వేయర్ బెల్ట్‌లు, అరైవల్ ఏరియాలో రెండు మరియు డిపార్చర్స్ ఏరియాలో ఒకటి ఉంటాయి.

నిర్మాణ పనులు: 

రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్య ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారేందుకు సిద్ధంగా ఉన్నందున విమానయాన సంస్థలు అయోధ్యకు విమానాలను అటువైపు నడపడానికి ఆసక్తిగా సిద్ధమవుతున్నాయి. 2021లోనే, అయోధ్య 154 మిలియన్ల మంది పర్యాటకులను ఆశ్చర్యపరిచింది మరియు రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య పెరుగుతుందని యుపి టూరిజం గణాంకాలు చెబుతున్నాయి.

ఈ విమానాశ్రయానికి విమానాలను నడిపే అవకాశం కోసం అనేక దేశీయ విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయని పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు వెల్లడిస్తున్నారు, భారతదేశం నలుమూలల నుండి, ముఖ్యంగా దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల నుండి ప్రయాణీకుల రద్దీ ఉండొచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాల నుండి కోడ్‌షేర్ విమానాల ద్వారా అయోధ్య చేరుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.

మొదటి దశ పూర్తయిన తర్వాత, క్రమంగా విమానాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా, ఈ దశ యొక్క ముఖ్య లక్షణం ఎయిర్‌సైడ్ సౌకర్యాల అభివృద్ధి, రన్‌వే విశాలంగా ఉండేలా చూసుకోవడం ఇందులో ఒక భాగం. మొదటి దశ పూర్తయిన తర్వాత, విమానాశ్రయం నాలుగు ఎయిర్‌బస్ A320-రకం విమానాలను నిర్వహించగల సామర్థ్యంతో ఉంటుంది. ఇది విమాన చరిత్రలోనే ఒక ముఖ్యమైలురాయి అని అధికారులు అంటున్నారు.