ఒడిషాలో ఈసారి బీజేపీ రావాల్సిందే

ఎలక్షన్స్ సన్నాహాలలో భాగంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఒరిస్సా ముఖ్యమంత్రి మరియు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ను వారికున్న “పాపులారిటీ” కోసం ప్రశంసించారు. ఒరిస్సా రాష్ట్రానికి ఎక్కువ కాలం సీఎంగా రికార్డు సృష్టించారు కంటూ కొనియాడారు. షా ఒరిస్సా లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్‌లో రానున్న ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై, కాంగ్రెస్ అదేవిధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపకపోగా వ్యతిరేకించారు, ఇదే క్రమంలో మోదీ ప్రభుత్వానికి BJD మద్దతు […]

Share:

ఎలక్షన్స్ సన్నాహాలలో భాగంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఒరిస్సా ముఖ్యమంత్రి మరియు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ను వారికున్న “పాపులారిటీ” కోసం ప్రశంసించారు. ఒరిస్సా రాష్ట్రానికి ఎక్కువ కాలం సీఎంగా రికార్డు సృష్టించారు కంటూ కొనియాడారు. షా ఒరిస్సా లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్‌లో రానున్న ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై, కాంగ్రెస్ అదేవిధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపకపోగా వ్యతిరేకించారు, ఇదే క్రమంలో మోదీ ప్రభుత్వానికి BJD మద్దతు ప్రకటించింది.

సమావేశంలో అమిత్ షా: 

భువనేశ్వర్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పట్నాయక్‌తో వేదికను పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, రాష్ట్రంలో మావోయిస్టుల బెడద తగ్గడం అంతేకాకుండా అతని ప్రభుత్వ సమర్థవంతమైన విపత్తు నిర్వహణపై “నవీన్ బాబు” అని సంబోధించి, సిఎంను కూడా ప్రశంసించారు. అంతేకాకుండా, దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మాట్లాడారు.

ఈ కార్యక్రమం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది, షా మరియు పట్నాయక్ అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేకాకుండా సమీక్ష సమావేశాలకు అధ్యక్షత వహించారు. వీరిద్దరూ వన్‌-ఆన్- వన్‌ మీటింగ్‌లో పాల్గొంటారని వార్తలు వినిపించినప్పటికీ.. అటువంటి ఒక మీటింగ్ అనేది జరిగిందా అనే విషయంపై క్లారిటీ రాలేదు.

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో “ఇతర రాష్ట్రాలకు మార్గం చూపుతున్నందుకు” ఒరిస్సా ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో అన్ని విపత్తు నిర్వహణ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్రం సహాయం చేసినందుకు నవీన్‌జీకి తాను కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన స్వంత కార్యక్రమాలను అమలు చేసిందని, రెండు ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే ప్రకృతి వైపరీత్యాలను కూడా అరికట్టవచ్చు అని షా అన్నారు. 

తన ప్రసంగంలో, పట్నాయక్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకార సమాఖ్యవాదంను విశ్వసిస్తుందని, అదేవిధంగా అభివృద్ధి ఎజెండాలో తమ ఒరిస్సా రాష్ట్రానికి మద్దతు ఇచ్చినందుకు, మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఒరిస్సా ముఖ్యమంత్రి.

విజయం మనదే: 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలల ముందు, బిజెడి ప్రభుత్వం విషయంలో బిజెపిలో వచ్చిన మార్పు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఇదిలా ఉండగా గతంలో, 2019 లో, అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల కోసం ఒరిస్సాలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించిన షా, పట్నాయక్ ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడు కించపరిచి ఇలాంటి ప్రభుత్వం ఇంకా ఎప్పుడు రాకూడదు అంటూ మాట్లాడారు.

దాదాపు తొమ్మిదేళ్లపాటు BJP మరియు BJD మిత్రపక్షంగా ఉండగా, భాగస్వామ్యాన్ని 2009లో తిరిగి పట్నాయక్ చేధించారు. అంతేకాకుండా బీజేపీ జెండా ఎగిరేలా తోహద పడింది బిజెడి.

BJD, అయినప్పటికీ, తన రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయాలను వేరుగా ఉంచడానికి ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది, పట్నాయక్ నేతృత్వంలోని పార్టీ కీలకమైన చట్టం, కీలక జాతీయ అంశాలు మరియు రాష్ట్రపతి ఎన్నికలపై మోదీ ప్రభుత్వానికి మద్దతునిస్తుంది. శనివారం, ఒరిస్సా కి అమిత్ షా రాకతో, రెండు పార్టీల మధ్య స్నేహబంధం భవిష్యత్తుపై ఊహాగానాలను మరింత రేకెత్తిస్తుంది.

శనివారం ప్రారంభించిన ప్రాజెక్టులలో తాల్చేర్‌లోని కోల్ బెల్ట్, కళింగనగర్ స్టీల్ హబ్ మధ్య కనెక్టివిటీని మరింత పెంచడానికి, రూ. 761 కోట్ల పెట్టుబడితో NH-53లోని కామాఖ్యనగర్-దుబూరి సెక్షన్‌ను నాలుగు వరుసలు రోడ్డుగా మార్చడం జరిగింది. కలహండిలోని మోటర్-బ్యానర్ రోడ్డు విస్తరణ కూడా జరగనుంది.