ఎన్కౌంటర్ లో మరణించిన ముగ్గురు ఆఫీసర్లు

ఉగ్రవాదుల చర్యలు రోజురోజుకు మితిమీరుతోంది. ముగ్గురు ఆఫీసర్లను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులు. జమ్ము కాశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్, మేజర్, జమ్మూ కాశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ మృతి చెందారు. ఉగ్రవాదుల ఘాతుకం:  ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరుగుతుండగా కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటిలిజెన్స్ టీం తో కలిసి ఉగ్రవాదులను వెతికే క్రమంలో […]

Share:

ఉగ్రవాదుల చర్యలు రోజురోజుకు మితిమీరుతోంది. ముగ్గురు ఆఫీసర్లను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులు. జమ్ము కాశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్, మేజర్, జమ్మూ కాశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ మృతి చెందారు.

ఉగ్రవాదుల ఘాతుకం: 

ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరుగుతుండగా కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటిలిజెన్స్ టీం తో కలిసి ఉగ్రవాదులను వెతికే క్రమంలో ఈ దుర్ఘటన సంభవించినట్లు, ఇండియన్ ఆర్మీ అఫీషియల్స్ వెల్లడించారు.  

మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలోని నార్లా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయని ANI నివేదించింది. అధికారుల అందించిన సమాచారం ప్రకారం, బుధవారం సాయంత్రం కొనసాగిన ఎన్‌కౌంటర్ మధ్య జరిపిన శోధనలో పెద్ద మొత్తంలో, పాకిస్తాన్ ముద్ర వేసిన, యుద్ధప్రాతిపదిక స్టోర్స్, మందులతో సహా, మరికొన్నింటిని, భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. 

ఇటీవల సెప్టెంబర్ 7 నుంచి, ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ట్రాక్ చేస్తున్నారని డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను చుట్టుముట్టాయని, సెప్టెంబర్ 12న భారీ కాల్పులు జరిగాయని, అదే రాత్రి ఒక ఉగ్రవాది హతమయ్యాడని.. అయితే మరో ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో రాత్రంతా కాల్పులు జరిపినప్పటికీ, అండర్ గ్రౌండ్ లో ఉన్న ఉగ్రవాది తెల్లవారుజామున బయటికి రాగా, భారత సైన్యం ఉగ్రవాదిని హతమార్చింది.. అని ఇండియన్ ఆర్మీ అఫీషియల్స్ వెల్లడించారు. అయితే ఈ క్రమంలోనే భారీ మొత్తంలో పాకిస్తాన్ తరపున ఉన్న కొన్ని మందు గుండు సామాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది ఆర్మీ. ఈ క్రమంలోనే మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారని, ఒక ఆర్మీ కుక్క కూడా మరణించింది అని ఇండియన్ ఆర్మీ తన ప్రకటనలో తెలిపింది.

నివాళు అర్పించిన నాయకులు: 

పలువురు నాయకులు, సీనియర్ ఆర్మీ సిబ్బంది మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధైర్యంగా ఉండాలని తన వైపు నుంచి ఆకాంక్షించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ధైర్యవంతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ధైర్యాన్ని అందించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ మాజీ నేత, కాశ్మీర్ సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ డీఎస్పీ హిమాన్యున్ ముజామిల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాకిస్థాన్‌కు చెందిన  వహించింది. ఆగస్టు 4న కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ముగ్గురు జవాన్లను హతమార్చి ఆర్మీ సిబ్బందిపై దాడికి పాల్పడింది ఇదే ఉగ్రవాదుల గుంపు అని అధికారులు అనుమానిస్తున్నారు. 

ఉగ్రవాదుల దాడిలో ఇప్పటివరకు మన భారత సైన్యంలో ఎంతోమంది ప్రతి ఏటా తమ ప్రాణాల్ని కోల్పోతూనే ఉన్నారు. మన భారతదేశం కోసం ఎంతగానో పాటుపడుతున్న సైనికులు ఎంతోమంది. రాత్రనకా పగలనకా కష్టపడుతూ భారతదేశ బార్డర్ చుట్టూ నిరంతరం కాపలా కాస్తున్న సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపలాకాస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో, బలైపోతున్న సైనికులను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది కుటుంబాలను ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీరులను తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి కుటుంబాలను మరొక్కసారి గుర్తు చేసుకుని, ఈరోజు చనిపోయిన వారు సైనికుల ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం.