మరో 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ 

భారత దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ రైలు, ఇప్పుడు మరో పదకొండు రాష్ట్రాలకు విస్తరించనుంది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది. మరొకసారి మోదీ చేతుల మీదుగా, 11 రాష్ట్రాలకు గాను మరో తొమ్మిది వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ అందింది. 11 రాష్ట్రాలకి ప్రత్యేక ఏర్పాట్లు:  లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ […]

Share:

భారత దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ రైలు, ఇప్పుడు మరో పదకొండు రాష్ట్రాలకు విస్తరించనుంది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది. మరొకసారి మోదీ చేతుల మీదుగా, 11 రాష్ట్రాలకు గాను మరో తొమ్మిది వందే భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ అందింది.

11 రాష్ట్రాలకి ప్రత్యేక ఏర్పాట్లు: 

లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, 11 రాష్ట్రాలలో కనెక్టివిటీని మరింత మెరుగుపరచడంలో సహాయపడటానికి తొమ్మిది వందే భారత్ రైళ్ల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొమ్మిది వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించిన తర్వాత, వందే భారత్ రైళ్లకు ఆదరణ మరింత పెరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకు వందే భారత రైళ్ల ద్వారా 1,11,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించారని గుర్తు చేశారు ప్రధాని మంత్రి. 

11 రాష్ట్రాల్లో 9 వందేభారత్ రైళ్లను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. కొత్త రైలు మార్గాలు కనెక్టివిటీని పెంచుతాయని భావిస్తున్నారు. 

9 వందే భారత్ రైళ్ల వివరాలు: 

ఉదయపూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్

పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

కాసరగోడ్-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూర్కెలా- భువనేశ్వర్-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 

ఈ తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్‌లతో సహా పదకొండు రాష్ట్రాలలో నడుస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, వందేభారత్ రైళ్లు దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. రెండు వందే భారత్ మార్గాలు రూర్కెలా-భువనేశ్వర్-పూరి అంతేకాకుండా తిరునెల్వేలి-మధురై-చెన్నై వరుసగా పూరీ మరియు మదురై వంటి దైవ యాత్రలకు సంబంధించిన రాష్ట్రా పట్టణాలను కలిపే విధంగా ఉన్నాయి. విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట మార్గంలో నడుస్తుంది, అంతేకాకుండా ఈ రైలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కనెక్టివిటీని అందిస్తుంది. 

వందే భారత్ ప్రత్యేకతలు: 

వందే భారత్ రైళ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కవాచ్ టెక్నాలజీతో సహా, లోకో పైలట్ ప్రమాదాలలో అలెర్ట్ అవ్వకపోగా, బ్రేక్ వేయడంలో ఒకవేళ విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్‌లను ఉపయోగించి రైలు వేగాన్ని నియంత్రిస్తుంది.

 వందే భారత్ రైళ్లు తమ ఆపరేషన్ మార్గాల్లో అత్యంత వేగవంతమైన రైళ్లు అని, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రూర్కెలా-భువనేశ్వర్-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు కాసరగోడ్-తిరువనంతపురం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే, మూడు గంటల సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయని గుర్తు చేశారు రైల్వే శాఖ. హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండున్నర గంటలకు పైగా; తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలకు పైగా; రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అదేవిధంగా జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు గంట సమయం; ఉదయ్‌పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి అరగంట. ఇలా అనేక ప్రాంతాలు మీదగా నడుస్తున్న వందే భారత్ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ, ఇతర రైళ్లతో పోలిస్తే సమయాన్ని ఆదా చేస్తున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.