మ‌ణిపూర్ దారుణ ఘ‌ట‌న‌లో 4 అరెస్ట్

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. మతాల మధ్య ఏర్పడిన చిన్న చిన్న గొడవలు ఇప్పుడు మణిపూర్లో అల్లకల్లోలంగా మార్చేసింది. గొడవలు ప్రస్తుతం హత్యలకు దారి తీస్తున్నాయి. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన […]

Share:

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. మతాల మధ్య ఏర్పడిన చిన్న చిన్న గొడవలు ఇప్పుడు మణిపూర్లో అల్లకల్లోలంగా మార్చేసింది. గొడవలు ప్రస్తుతం హత్యలకు దారి తీస్తున్నాయి. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు.

హింసకు కారణమైన నలుగురు అరెస్ట్: 

మే 4న కాంగ్‌కోపి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించిన కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు జూలై 20న తెలిపారు.

కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. తౌబాల్ జిల్లా, నాంగ్‌పోక్ సెక్మై PS పరిధిలో ఆడవాళ్ళని ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసిన సంఘటన వెలుగులకు వచ్చిన అనంతరం. ఈ దారుణమైన నేరానికి సంబంధించిన మరో 03 ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురను అరెస్టు చేశారు అని మణిపూర్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

వైరల్ వీడియో కేసు:

తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్ మరియు సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 ప్రధాన నిందితులను ఈరోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురును అరెస్టు చేశారు.మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడం గమనార్హం. ఈ దుర్ఘటనకు సంబంధించి, మణిపూర్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మే 4న కాంగ్‌కోపి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడితో సహా మొత్తం ఇద్దరిని అరెస్టు చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ జూలై 20న తెలిపారు.

మణిపూర్ దుర్ఘటనకి సంబంధించిన వైరల్ వీడియో చూసిన తర్వాత అధికార బీజేపీకి చెందిన అన్ని శాసనసభలు కూడా ఇటువంటి ఘోరమైన నేరాన్ని ఖండించాలని నిర్ణయించుకున్నాయి. అయితే శాసనసభ జరుగుతున్న సమయంలో చాలామంది శాసనసభ్యులు మణిపూర్ సంఘటన గురించి చర్చ జరగాలని చాలా సేపు నినాదాలు చేశారు. అందుకే శాసనసభ ప్రస్తుతం ఈరోజు జరిగేందుకు వాయిదా పడింది. హింసకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, 32 సంవత్సరాల హుయిరేమ్ హెరోదాస్ని పోలీసులు పట్టుకున్నారు. 

స్మృతి ఇరానీ స్పందించారు: 

ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మణిపూర్ పోలీసులు, వారి మీద అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎలాంటి అవమానకరమైన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన ఈ వీడియో, ప్రతిపక్షాల చాలా వరకు ఖండించారు, ఆలస్యం చేయకుండా మణిపూర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్ చేసింది. బాధితులు కుకీ-జో తెగకు చెందినవారని, నేరస్థులు మెయిటీస్ అని వెల్లడించింది.

సైకుల్ పోలీస్ స్టేషన్‌లో బి. ఫైనోమ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల చీఫ్ తంగ్‌బోయ్ వైఫేయ్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, అదే సంఘటనలో మరో ఆడపిల్ల మీద కూడా సామూహిక అత్యాచారం జరిగినట్లు తేల్చారు. భారతీయ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.