తెలంగాణలో 3.06 కోట్ల ఓటర్లు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు ఉండగా, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 5న ప్రకటించిన 2.99 కోట్ల మంది ఓటర్లకు వ్యతిరేకంగా ఈ సంఖ్య ఉండడం గమనార్హం. గత కొన్ని నెలల్లో దాదాపు 8.31 లక్షల మంది ఓటర్లు తమ […]

Share:

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు ఉండగా, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 5న ప్రకటించిన 2.99 కోట్ల మంది ఓటర్లకు వ్యతిరేకంగా ఈ సంఖ్య ఉండడం గమనార్హం. గత కొన్ని నెలల్లో దాదాపు 8.31 లక్షల మంది ఓటర్లు తమ ఓటుని నిర్వహించేందుకు ఓటర్ల లిస్టులో చేరారు. 1.82 లక్షల వేరే రాష్ట్రాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకుంది.

ఎన్నికల సన్నాహాలు: 

ఓటర్ల జాబితాలో 2,742 మంది ఎన్నారై ఓటర్లు, 15,337 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 4.76 లక్షలు. ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించిన ఓటర్ల జాబితాల్లో ఈ సంఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి, ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్‌ నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసింది.

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బి.ఆర్.ఎస్: 

BRS తమ అభ్యర్థులను ఎన్నుకోవడంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్లే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను సోమవారం ప్రకటించడం జరిగింది. ఇంకో నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అభ్యర్థుల మొదట జాబితాలో పెద్దగా మార్పులు చేయలేనట్టు వెల్లడించింది. కేవలం ఏడు స్థానాల అభ్యర్థులకు సంబంధించిన మార్పు ప్రకటించింది. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారు. 

నాగపంచమి తిది సందర్భంగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం జరిగింది. 2009లో గెలుపొందిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వయంగా, కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించినట్లు కేసీఆర్ సోమవారం తెలిపారు. నిజామాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఇలాంటి అభ్యర్థనలు వచ్చాయని, అయితే చివరకు కామారెడ్డిని ఎంచుకున్నారని సీఎం చెప్పడం జరిగింది. అక్టోబర్ 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచామని, తర్వాత ప్రకటిస్తామన్నారు. 

బిఆర్‌ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరిలో మరణించారు. రాజకీయాల్లో ఆసక్తి చూపించే ఆయన కుమార్తె లాస్య నందిత 2016లో హైదరాబాద్‌లోని కవాడిగూడ నుంచి మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికైనప్పటికీ, డిసెంబర్ 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు. సాయన్నపై గౌరవంతోనే, ఆయన కుమార్తె అయన లాస్యను నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించి 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తుందని తమ వైపు నుంచి ధీమా వ్యక్తం చేశారు. తేదీలు ఇంకా ప్రకటించలేదు కానీ డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు ఎదుర్కొన్న చిక్కులను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో తమకు ఎలాంటి రాజకీయ సంక్షోభం రాకుండా చూసుకోవాలని కేసీఆర్ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన సీనియర్ పార్టీ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనుకూలంగా చేసిన అభ్యర్థనలు ఏవి కూడా దృష్టిలో పెట్టుకోకుండా, పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని కేసీఆర్, అలాగే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.