కోటాలో మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..!

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ బలవన్మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌కు ప్రిపేర్ కావడానికి కోటాకు వెళ్లిన ఆరు నెలల లోపే పదహారేళ్ల బాలిక తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన బాలికను జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన విద్యార్ధినిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఏడాది కోటాలో సూసైడ్ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 25కి చేరింది. అసలేం […]

Share:

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ బలవన్మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌కు ప్రిపేర్ కావడానికి కోటాకు వెళ్లిన ఆరు నెలల లోపే పదహారేళ్ల బాలిక తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన బాలికను జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన విద్యార్ధినిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఏడాది కోటాలో సూసైడ్ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 25కి చేరింది. అసలేం జరిగిందంటే..

విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ అసిస్టెంట్ అమర్ చంద్ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 10.30 గంటలకు సిన్హా (16) అనే విద్యార్ధిని తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన హాస్టల్‌ సిబ్బంది హుటాహుటీన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐతే విద్యార్ధిని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చాంద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంబీఎస్‌ ఆస్పత్రికి తరలించారు.

దీనిపై హాస్టల్‌ వార్డెన్‌ అర్చన రాజావత్‌ మాట్లాడుతూ.. గత రాత్రి అస్వస్థతకు గురికాగా తనకు మందులు కూడా ఇచ్చిందని తెలిపారు. సిన్హా ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఆమెలో ఒత్తిడి సంకేతాలు నాకెప్పుడూ కనిపించలేదు. తన స్నేహితులతో కూడా కలుపుగోలుగా ఉండేది. సమయానికి భోజనం చేసేదని చెప్పుకొచ్చింది. కాగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ ), మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటాలోని పలు కోచింగ్‌ సెంటర్లకు వస్తుంటారు.

ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలన్న కలలతో వచ్చిన వాళ్లు చివరికి ఆత్మహత్యకు పాల్పడి అర్ధంతరంగా జీవితాన్ని ముగించేస్తున్నారు. ఫెయిల్ అవుతామేమో అన్న భయం కొందరిది. సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయానన్న బెంగ మరి కొందరిది. కారణమేదైనా ఈ మధ్య కాలంలో ఇక్కడికి వచ్చిన విద్యార్ధులు ఒత్తిడి తట్టుకోలేక ఏటా అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. 2023 సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 24 మంది విద్యార్ధులు తనువు చాలించారు. ఆగస్టు 27న కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్ధులు తమ జీవితాలకు ముగింపు పలికారు. గత ఏడాది ఈ సంఖ్య 15గా ఉండగా ఈ ఏడాది ఏకంగా 25 మంది ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

ఫ్యాన్‌లకు స్ప్రింగ్‌లు

ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగారు. హాస్టల్స్‌లో చాలా మంది ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోతున్నారని గమనించారు. ఫ్యాన్లలో యాంటీ-హాంగింగ్ పరికరాన్ని అమర్చారు.  యాంటీ హ్యాంగింగ్ పరికరం ఎలా పనిచేస్తుందంటే.. 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువును ఫ్యాన్‌కు వేలాడదీస్తే, దానికి సంబంధించిన స్ప్రింగ్ విస్తరించి కిందకు జారుతుంది. అలాగే ఆ సమయంలో సైరన్ కూడా మోగుతుంది. అందుకే…పాత ఫ్యాన్‌లు తీసేసి స్ప్రింగ్‌ లోడెడ్ ఫ్యాన్స్‌ని ఫిట్ చేస్తున్నారు. అందుకే…ఇక్కడి పీజీలు, హాస్టల్స్‌లో ఈ మెకానిజంతోనే ఫ్యాన్‌లు ఫిట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలిచ్చారు.  కోటలోని హాస్టళ్లలోని బాల్కనీలు, లాబీలలో వలలు కూడా ఏర్పాటు చేశారు. మానసికంగా విద్యార్థులకు ధైర్యం చెప్పడం హాస్టల్స్ విధి అని, వారి భద్రతపైనా బాధ్యత ఉంటుందని అధికారులు తేల్చి చెప్పారు. ఒకవేళ ఈ ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే…ఆయా హాస్టల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.