ప్రతి ఐదుగురిలో నలుగురికి బీపీ: డ‌బ్ల్యూహెచ్ఓ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక ర‌క్త‌పోటు బారిన‌ప‌డుతున్నార‌ని.. స‌కాలంలో వ్యాధిని గుర్తించ‌లేక‌పోవ‌డంతో గుండె జ‌బ్బులు, స్ట్రోక్‌, కిడ్నీ వ్యాధుల‌కు గురవుతున్నార‌ని డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది. జీవ‌న శైలి వ్యాధి అయిన బీపీని సుల‌భంగా గుర్తించే వెసులుబాటు.. త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన మందుల‌తో అదుపులో ఉంచుకునే వీలున్నా సగం మంది త‌మ‌కు బీపీ ఉంద‌నే విష‌యం తెలియ‌డం లేదు. తీవ్ర అనారోగ్యాలు త‌లెత్తుతున్నాయ‌ని గతంలోనే డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. సైలెంట్ కిల్లర్‌‌గా పిలబడే అధిక రక్తపోటు […]

Share:

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక ర‌క్త‌పోటు బారిన‌ప‌డుతున్నార‌ని.. స‌కాలంలో వ్యాధిని గుర్తించ‌లేక‌పోవ‌డంతో గుండె జ‌బ్బులు, స్ట్రోక్‌, కిడ్నీ వ్యాధుల‌కు గురవుతున్నార‌ని డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది. జీవ‌న శైలి వ్యాధి అయిన బీపీని సుల‌భంగా గుర్తించే వెసులుబాటు.. త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన మందుల‌తో అదుపులో ఉంచుకునే వీలున్నా సగం మంది త‌మ‌కు బీపీ ఉంద‌నే విష‌యం తెలియ‌డం లేదు. తీవ్ర అనారోగ్యాలు త‌లెత్తుతున్నాయ‌ని గతంలోనే డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

సైలెంట్ కిల్లర్‌‌గా పిలబడే అధిక రక్తపోటు విధ్వంసకర ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంచలన నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా అధిక రక్తపోటు ప్రభావానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ మొట్టమొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో దాదాపు నలుగురికి రక్తపోటు సమస్య ఉంది. దీనికి తగిన చికిత్స కూడా లేదు. ప్రపంచ దేశాలు ఈ సమస్యపై దృష్టి సారిస్తే 2050 నాటికి 76 మిలియన్ల మరణాలను నివారించవచ్చని నివేదిక పేర్కొంది. భారత్ విషయానికి వస్తే 30-79 ఏళ్ల మధ్య రక్తపోటు బాధితుల్లో దాదాపు సగం మందికి నియంత్రించగలిగితే 2040 నాటికి కనీసం 40 మిలియన్ల మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఉద్ఘాటించింది.

మంగళవారం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 78వ సమావేశాల్లో ‘అధిక రక్తపోటుపై అంతర్జాతీయ నివేదిక.. సైలెంట్ కిల్లర్‌కు వ్యతిరేకంగా పోరాటం’ అనే టైటిల్‌తో ఈ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. ప్రపంచంలోని ఒకే వయసున్న 188.3 మంది ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తెలిపింది.

భారతీయుల్లో కేవలం 37 శాతం మంది మాత్రమే ఈ పరిస్థితిని సకాలంలో గుర్తిస్తున్నారని, వారిలో 30 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. ‘50 శాతం నియంత్రణ రేటును సాధించడానిక అధిక రక్తపోటు ఉన్న 67 మిలియన్ల మంది బాధితులకు సమర్థవంతంగా చికిత్స అందజేయాల్సి ఉంటుంది’ అని నివేదిక నొక్కిచెప్పింది.

ఈ నివేదికను రక్త పీడనం 140/90 ఎంఎంఎచ్జి  లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తి డేటా లేదా ఈ పరిస్థితికి ఔషధాలు తీసుకుంటున్న పరిస్థితి ఆధారంగా రూపొందించింది. అధిక రక్తపోటు స్ట్రోక్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్, అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, సాధారణ శారీరక శ్రమ, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకుని.. రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ఈ వ్యాధిని నివారించడంలో కీలకమైన ప్రక్రియలు.

అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు, ఇది ఆల్ టైమ్ సైలెంట్ కిల్లర్స్‌లో ఒకటి. రక్త నాళాల గోడలకు వ్యతిరేకంగా రక్తం శక్తి స్థిరంగా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తపోటుకు గురవుతూ ఉంటారు. దీని వలన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో లేకపోతే గుండెపోటు, స్ట్రోక్‌తో సహా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఉంటుంది. ఇక, దేశంలో 30 ఏళ్లు దాటిన ప్రతి 8 మందిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇటీవల ఓ సర్వే వెల్లడించింది.

రక్తపోటు నియంత్రణకు సొంత వైద్యం పనికిరాదు. తెలిసీ తెలియని సమాచారంతో, ఆయుర్వేద మందులతో ప్రయత్నించడం వల్ల ఉపయోగం పెద్దగా ఉండదు. యాంజియోటెన్సిన్ రిసెప్టర్ (ఏఆర్ బీలు), క్యాల్షియం చానల్ బ్లాకర్స్(సీసీబీ) ఔషధాలు తీసుకోవాల్సి రావచ్చు. వైద్యులు రక్తపోటు ఎందుకు వస్తుందో గుర్తించి, తగిన ఔషధాలు సూచిస్తారు. కనుక అధిక రక్తపోటు బాధితులు వైద్యుల సూచన మేరకు నడుచుకోవడం శ్రేయస్కరం.

వయసు మీదపడడం, జన్యుపరమైన అంశాలు అధిక రక్తపోటుకు దారితీయొచ్చు. ఉప్పు అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక మద్యపానం సైతం సమస్యను తీవ్రం చేస్తాయి. జీవనశైలిని మెరుగుపర్చుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ఇతర సమస్యలను నివారించడం కోసం కొంత మంది కచ్చితంగా ఔషధాలు తీసుకోవాల్సి రావొచ్చు.