ఇజ్రాయిల్ వీధిలో యువ‌తిని న‌గ్నంగా ఊరేగించిన ఉగ్ర‌వాదులు

మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మకమైన సంఘటన మళ్లీ ఇజ్రాయిల్ వీధిలో చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ దేశం మీద ఆకస్మిక దాడులకు దిగిన సమస్య ఉగ్రవాదుల మూక చేస్తున్న అరాచకాలు ప్రపంచ దేశాలను కన్నీరు పెట్టిస్తున్నాయి.  శృతిమించుతున్న ఉగ్రవాదుల అరాచకాలు:  ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్ మధ్య అనుకోని రీతిగా యుద్ధం […]

Share:

మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మకమైన సంఘటన మళ్లీ ఇజ్రాయిల్ వీధిలో చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ దేశం మీద ఆకస్మిక దాడులకు దిగిన సమస్య ఉగ్రవాదుల మూక చేస్తున్న అరాచకాలు ప్రపంచ దేశాలను కన్నీరు పెట్టిస్తున్నాయి. 

శృతిమించుతున్న ఉగ్రవాదుల అరాచకాలు: 

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్ మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ షేర్ చేయడం జరిగింది. 

ఈ క్రమంలోనే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయిల్ కు చెందిన నగ్నంగా ఉన్న అమ్మాయి మృతదేహాన్ని ఇశ్రాయేల్ వీధిలో ఊరేగిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. news.com.au ప్రకారం, మృతదేహం ఒక మహిళా ఇజ్రాయెల్ సైనికులకు చెందిన వారిని హమాస్ మొదట పేర్కొంది. అయితే, వీడియోలో కనిపించిన అమ్మాయి తన సోదరి అని, జర్మన్ దేశానికి చెందిన అమ్మాయిని..టాటూ ఆర్టిస్ట్ అయిన షానీ లౌక్ అని ట్విట్టర్ ద్వారా ఆది లౌక్ స్పష్టం చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అంతే కాకుండా షానీ లౌక్ తల్లి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తనకి తెలియాలని, తన కూతురు గురించి తెలుసుకునేందుకు తనకి సహాయం చేయమని వేడుకుంటుంది.

నిజానికి షానీ లౌక్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వెళ్లినట్లు తన కజిన్ పేర్కొంది. అయితే తప్పకుండా తన సోదరి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకుంటుందని అనుకున్న తమకి నిజంగా ఒక పీడకల లాంటి సంఘటన ఎదురవుతుందని అనుకోలేదని ఆది లౌక్ పేర్కొంది. షాని హాజరైన సంగీత ఉత్సవం, హమాస్ మిలిటెంట్లచే దాడి చేసిన మొదటి సైట్లలో షాని హాజరైన మ్యూజిక్ ఫెస్టివల్ ఒకటి. 

ఉగ్రవాదుల దాడి: 

దాదాపు 100 మంది సైనికులు మరియు పౌరులను హమాస్ కిడ్నాప్ చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు విధ్వంసం చేసి ఇళ్లలోకి చొరబడ్డారని, పౌరులను ఊచకోత కోశారని.. వందలాది మంది దేశంపై దాడి చేశారని, ఇంకా వందల మంది ఇజ్రాయెల్ లోపల సైనికులతో పోరాడుతున్నారు అని ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. బందీలుగా ఉన్న అనేక మంది ఇజ్రాయిలీల ఫోటోలను ప్రస్తుతానికి హమాస్ విడుదల చేసింది. గాజా సమీపంలోని ఇజ్రాయెల్ పట్టణం స్డెరోట్ వీధుల్లో మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి.. అంతేకాకుండా కార్ల లోపల, బుల్లెట్ల వడగళ్లతో విండ్‌స్క్రీన్‌లు సైతం పగిలిపోయాయి. 

శనివారం ఉదయం ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రయోగించిన భారీ 5,000 రాకెట్లతో మొదటి దాడి జరిగింది, ఆ తర్వాత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారు. ఉగ్రవాదులు విదేశీయులను కూడా వదిలిపెట్టలేదని ఈ సంఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. ఇజ్రాయెల్‌లో ఏడుగురు నేపాలీలు గాయపడ్డారని, 17 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారని సమాచారం. 

ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులను అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది. ముఖ్యంగా అనవసరంగా ఎవరూ కూడా తమ ఉన్న చోటు విడిచి బయటికి వెళ్ళకూడదని.. ప్రతి ఒక్కరు కూడా కార్యాలయంలో ఉంటూ జాగ్రత్త వహించాలని అధికారులు తెలియజేయడం జరిగింది.