అమెరికాలో అతిపెద్ద హిందూ గుడి 

భారతదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తీసుకోవచ్చేవి పురాతనమైన గుళ్ళు. ఎన్నో ఆకర్షణీయమైన గుళ్ళకు పెట్టింది పేరు భారతదేశం. అయోధ్యలో రామ మందిరం భారతదేశాన్ని పావనం చేస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని 12 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన ఒక ప్రత్యేకమైన గుడి ఆకర్షణగా నిలవనుంది. అక్టోబర్ 8న, గుడి ప్రారంభానికి సిద్ధమవుతోంది. అయితే వీక్షకులకు మాత్రం అక్టోబర్ 18 నుంచి అనుమతి లభిస్తుంది.   అమెరికాలో అతిపెద్ద హిందూ గుడి :  వచ్చే నెలలో యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఆలయాన్ని […]

Share:

భారతదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణ తీసుకోవచ్చేవి పురాతనమైన గుళ్ళు. ఎన్నో ఆకర్షణీయమైన గుళ్ళకు పెట్టింది పేరు భారతదేశం. అయోధ్యలో రామ మందిరం భారతదేశాన్ని పావనం చేస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని 12 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన ఒక ప్రత్యేకమైన గుడి ఆకర్షణగా నిలవనుంది. అక్టోబర్ 8న, గుడి ప్రారంభానికి సిద్ధమవుతోంది. అయితే వీక్షకులకు మాత్రం అక్టోబర్ 18 నుంచి అనుమతి లభిస్తుంది.  

అమెరికాలో అతిపెద్ద హిందూ గుడి : 

వచ్చే నెలలో యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఆలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. న్యూజెర్సీలోని టైమ్స్ స్క్వేర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించబడుతుంది. 183 ఎకరాల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రత్యేకమైన గుడి నిర్మాణంలో US అంతటా 12,500 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో ఉన్న ఆలయం, 500 ఎకరాల విస్తీర్ణంలో కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ తర్వాత రెండవ అతిపెద్ద ఆలయం. మరో అతి పెద్ద ఆలయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం. ఈ దేవాలయం సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. 

ఆలయ ప్రత్యేకతలు: 

యుఎస్‌లోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయం ప్రాచీన భారతీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందించుకుంది అని చెప్పుకోవచ్చు. ఆలయంలో 10,000 పైగా విగ్రహాలు మరియు భారతీయ సంగీత వాయిద్యాలు మరియు నృత్య రూపాల శిల్పాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రధాన మందిరంతో పాటు, ఈ ఆలయంలో 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు (శిఖరం లాంటి నిర్మాణాలు), తొమ్మిది పిరమిడ్ ఆకారంలో ఉండే నిర్మాణాలు కనిపిస్తాయి. మన ప్రాచీన సాంప్రదాయం ఉట్టిపడేలా అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది.

సున్నపురాయి, గ్రానైట్, పింక్ సాండ్ స్టోన్, పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. అవి భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ మరియు చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించడం జరిగింది. ‘బ్రహ్మ కుండ్’ అని పిలువబడే సాంప్రదాయ భారతీయ మెట్ల బావి, దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరుల నుండి సేకరించిన నీటితో నిండుకుండలా కనువిందు చేస్తుంది. 

అయోధ్యలో ఆకర్షణీయంగా నిలవనున్న లోటస్ ఫౌంటెన్:  

గుప్తర్ ఘాట్ నుండి నయా ఘాట్ వరకు 20 ఎకరాల విస్తీర్ణంలో తామరపువ్వు ఆకారపు (లోటస్) ఫౌంటెన్‌ను నిర్మించాలని, 50 మీటర్ల ఎత్తువరకు ఫౌంటెన్ నీరు చిమ్మెలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. శ్రీరామ మందిర వైభవాన్ని పెంచే, శ్రీ రామ మందిరం ప్రత్యేక ప్రాముఖ్యతను గుర్తించే చక్కని థీమ్‌తో, నిజంగా దైవిక, అదే విధంగా ఆధ్యాత్మిక అనుభూతిని అందించడానికి ఫౌంటెన్ కాంప్లెక్స్ అభివృద్ధికి తన హాలు జరుగుతున్నాయి.

ఈ ఫౌంటెన్ ఆలయ పరిసరాలలో ఉండే వెయిటింగ్ జోన్ విధంగానే కాకుండా.. తాజా, విశ్రాంతి ప్రదేశంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే నిజానికి రామ మందిరానికి విచ్చేసే యాత్రికులు మరియు పర్యాటకులకు, ప్రత్యేకమైన మరపురాని అనుభూతిని అందించడానికి తగిన ప్రదేశంగా కూడా పని చేస్తుంది. ఇది “మాయా ప్రదేశం”గా కనువిందు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఫౌంటెన్ అందాలు, ముఖ్యంగా వీక్షకులకు కనువిందు చేయడమే కాకుండా ప్రశాంతతను అందించే విధంగా నిర్మానించాలని ప్రణాళిక జరుగుతోంది.

మన భారతదేశ జాతీయ పువ్వుగా చెప్పుకునే తామర పువ్వు అంటే లోటస్ ఆకారంలో ఫౌంటెన్ నిర్మాణం జరగనుంది. ఇది భారతదేశ గుర్తింపును పెంపొందించడంలో సహాయపడుతుందని అంచనా. ఫౌంటెన్ డిజైన్ హిందూమతంలోని ఏడు పవిత్ర నదులకు నివాళిగా కమలం రూపంలో ఏడు రేకులను కలిగి ఉంటుంది, అవి.. గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి మరియు కావేరి.