హర్దీప్ సింగ్ హత్య కేసులో పాక్ ఏజెంట్‌ని ప్ర‌శ్నించిన కెన‌డా

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. ఇప్పుడు కెనడా దేశానికి చెందిన పోలీసులు సర్రేలో ISI ప్లాంట్ కి […]

Share:

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. ఇప్పుడు కెనడా దేశానికి చెందిన పోలీసులు సర్రేలో ISI ప్లాంట్ కి సంబంధించిన రాహత్ రావ్ ఆఫీసులను సోదాలు చేయడమే కాకుండా.. రాహత్ రావ్ని రెండు గంటలు ప్రశ్నించినట్లు సమాచారం. 

ప్రశ్నించిన కెనడా పోలీసులు: 

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) బృందాలు సర్రేలోని ISI ప్లాంట్ అని ఆరోపించిన రహత్ రావ్ ఆఫీసులకు వెళ్లడమే కాకుండా, ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి రెండు గంటలపాటు అతనిని ప్రశ్నించినట్లు వర్గాలు తెలిపాయి. RCMP సిబ్బంది ముందు తన సోషల్ మీడియా పేజీల నుండి అన్ని పోస్ట్‌లను తొలగించమని రావును కోరినట్లు వెల్లడించారు. అయితే నిజానికి కెనడా పోలీసులు,  ISI ప్లాంట్ అని ఆరోపించిన రహత్ రావ్ ఆఫీసులను సందర్శించడానికి గల ముఖ్యమైన కారణాన్ని గోప్యంగానే ఉంచినట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించి ప్రశ్నించి ఉండవచ్చు అని నివేదికలు పేర్కొన్నాయి.

వైరల్ గా మారిన జయశంకర్ సమాధానం: 

న్యూయార్క్ లో జరిగిన ఫారెన్ రిలేషన్స్ కౌన్సిల్ కు సంబంధించి సమావేశంలో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్, ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన గూఢచార సమాచారాన్ని ఐదుగురికి మాత్రమే షేర్ చేసినట్లు వచ్చిన నివేదికల గురించి, జయశంకర్ని అడిగారు. 

అయితే దీనికి సమాధానం ఇచ్చిన జయశంకర్ ఈ విధంగా మాట్లాడారు.. నిజానికి ఐదుగురిలో తాను లేనని, అంతేకాకుండా ఎఫ్బీఐ కి తమకి ఎటువంటి సంబంధం లేదని, అందులో తాము భాగం కాదని, సరైన వ్యక్తికి ప్రశ్న అడుగుంటే బాగుంటుందని జయశంకర్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ ఐదుగురిలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మాత్రమే భాగంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

ఏదిఏమైనాప్పటికీ కెనడాలో ఒక అటాక్ ద్వారా ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిందని తెలిసిన విషయమే. అయితే సరైన ఆధారాలు డాక్యుమెంట్స్ చూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని జయశంకర్ అభిప్రాయపడ్డారు.. అంతేకాకుండా సరైన సమాచారం ఉంటే ముందడుగు వేయచ్చని ఎటువంటి ఆధారాలు లేకుండా, ముందుకు సాగడం కష్టమని మరొకసారి గుర్తు చేశారు జయశంకర్. మరి ముఖ్యంగా భారతీయులకు కొత్త వీసాలను సస్పెండ్ చేసినందుకు కెనడా ప్రభుత్వం మీద మండిపడ్డారు.

కెనడాలో దౌత్యవేత్తలపై వస్తున్న బెదిరింపులు గురించి మరియు భారత కాన్సులేట్‌లపై దాడి చేయడం గురించి జైశంకర్ మాట్లాడుతూ, రాజకీయ కారణాల వల్ల, ఇప్పుడు జరుగుతున్న కొన్ని అంశాలు ఆందోళన కలిగించే విషయంగా ఉన్నాయని.. మన దౌత్యవేత్తలను బెదిరించే పరిస్థితి ఉంది, కాన్సులేట్‌లపై దాడులు జరిగాయి అడ్రస్ స్పష్టం చేశారు. అయితే ఏదైనా విషయం తనకి తెలిసిన పిమ్మట కచ్చితంగా అది పరిగణలోకి తీసుకుంటామని, దాని గురించి మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుందని వెల్లడించారు జైశంకర్. కానీ ఇప్పటివరకు అయితే ఇది బహుశా నిజ్జర్ హత్య వెనుక పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు

కెనడా తన దేశంలో చనిపోయిన ఉగ్రవాది నిజానికి కెనడాలోకి ఒక ఫ్రాడ్ పాస్పోర్ట్ ద్వారా వచ్చాడంటూ గుర్తు చేశారు. అదే విధంగా ఒక ఉగ్రవాది కోసం దేశాల మధ్య చిన్నపాటి యుద్ధం జరగడం సబబు కాదు అన్నారు.  ఎక్స్ పెంటగన్ అఫీషియల్ చెప్పుకొచ్చారు. ముందు ముందు జరిగే వాటి గురించి ఆలోచించకుండా, కెనడా ప్రధానమంత్రి భారతదేశం మీద ఒక ఉగ్రవాది మరణం గురించి ఆరోపణలు చేయడం చాలా మందికి నచ్చలేదని కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ యూఎస్ తన సపోర్ట్ ని కేవలం ఒకే దేశానికి ఇవ్వాలనుకుంటే అది కచ్చితంగా భారతదేశమే అవుతుందని గుర్తు చేశారు.