ఖలిస్థానీ ఉగ్రవాది  నిజ్జర్ హత్య వెనుక ఐఎస్‌ఐ హస్తం..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ప్రస్తుతం భారత్, కెనడాల మధ్య శాంతియుత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం ఉందని తాజాగా ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. నిజ్జర్‌ను హత్య చేయడం ద్వారా అతనిపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడంతో పాటు.. అదే సమయంలో భారత్‌ను కూడా వివాదంలోకి నెట్టేందుకు పాక్ కుట్రలు చేసిందని తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల్లో బయటపడింది. భారత్ విషయంలో దొరికిన ప్రతీ అవకాశాన్ని […]

Share:

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ప్రస్తుతం భారత్, కెనడాల మధ్య శాంతియుత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం ఉందని తాజాగా ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. నిజ్జర్‌ను హత్య చేయడం ద్వారా అతనిపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడంతో పాటు.. అదే సమయంలో భారత్‌ను కూడా వివాదంలోకి నెట్టేందుకు పాక్ కుట్రలు చేసిందని తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల్లో బయటపడింది.

భారత్ విషయంలో దొరికిన ప్రతీ అవకాశాన్ని తమకు అనుగుణంగా మార్చుకుని ఎప్పటికప్పుడు విషం చిమ్మే దాయాది దేశం పాకిస్థాన్ గురించి తాజాగా సంచలన విషయం వెల్లడైంది. ప్రస్తుతం భారత్, కెనడాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు కారణం పాక్ అని.. భారత ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజ్జర్‌ను హత్య చేసి అది భారత్‌పైకి తోసి.. భారత్, కెనడాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో పాటు నిజ్జర్‌తో తమకు ఉన్న సంబంధాలు.. వాటిని నిజ్జర్ తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడంతో అతడ్ని హత్య చేయడం ద్వారా అటు నిజ్జర్‌తో పాటు భారత్‌పై ఒకే సారి పగ తీర్చుకోవాలని ఈ హత్య చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. ఆ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ వర్గాల తాజా రిపోర్ట్ సంచలనంగా మారింది. భారత్, కెనడాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర చేసిందని పేర్కొంది. దీని కోసం చాలా నెలల క్రితం నుంచే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ వేసినట్లు తెలిపింది. అయితే ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తున్న భారత్‌పై ఆ హత్య కేసును మళ్లించాలని పాక్ పన్నాగం పన్నినట్లు పేర్కొంది. దీంతో పాటు పాకిస్థాన్ ఐఎస్ఐకి, హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు ఉన్న విబేధాలు కూడా అతడ్ని హత్యచేసేందుకు పాకిస్థాన్‌కు అవకాశం దొరికిందని వెల్లడించింది.

ఇక, కెనడాలో నిజ్జర్‌ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్‌ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్లు తెలిసింది. వీరిలో మేజర్‌ జనరల్స్‌ నుంచి హవల్దార్‌ స్థాయి అధికారులు ఉన్నారట. వీరి ద్వారానే నిజ్జర్‌ కదలికలను తెలుసుకున్నట్లు సమాచారం.

కెనడాలోని పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు చాలా ఏళ్లుగా సంబంధాలు ఉండేవి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని పాక్ ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నిజ్జర్ మాత్రం ఖలిస్థానీ ఉద్యమానికి అనుకూలంగా పనిచేస్తూ.. డ్రగ్స్‌ అక్రమ రవాణాతో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిజ్జర్‌ను హత్య చేయాలని పాక్ ఐఎస్ఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ హత్యను భారత్‌ వైపు మళ్లిస్తే అటు.. నిజ్జర్‌పై, ఇటు భారత్‌పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇలా భారత్‌ విషయంలో ఎప్పుడూ విషం చిమ్ముతూ పాకిస్థాన్ తన ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేందుకు ప్రయత్నిస్తుందని మరోసారి రుజువు అయింది. దీంతో భారత్‌పై ఉన్న అక్కసును మరోసారి పాక్ బయటపెట్టినట్లు అయింది.

ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (45) కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌, ‘గురునానక్‌ సిక్‌ గురుద్వారా సాహిబ్‌’ అధిపతి అయిన హర్‌దీప్‌.. భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. అతడి తలపై రూ.10లక్షల రివార్డు ఉంది. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజుకున్నాయి.