Joe Biden: హమాస్ దాడులకు ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కారణం..

ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్(Israel- Hamas) మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌(Israel) పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా(Russia) తన బద్ధ శత్రువైన అమెరికాపై ఒక నింద మోపింది. మిడిల్ ఈస్ట్‌లో ఆ దేశం చేపడుతున్న విధానాల వైఫల్యమే ఈ యుద్ధానికి కారణమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కొన్ని రోజుల క్రితం కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు లేటెస్ట్‌గా […]

Share:

ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్(Israel- Hamas) మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌(Israel) పై హమాస్ మెరుపుదాడులు చేయడం వెనుక గల కారణాలేంటన్న విషయంపై ఆయా దేశాలు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా(Russia) తన బద్ధ శత్రువైన అమెరికాపై ఒక నింద మోపింది. మిడిల్ ఈస్ట్‌లో ఆ దేశం చేపడుతున్న విధానాల వైఫల్యమే ఈ యుద్ధానికి కారణమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కొన్ని రోజుల క్రితం కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఈ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధానికి భారత్ – మిడిల్ ఈస్ట్ – యూరప్ కారిడార్(India-Middle East-Europe Economic Corridor ) కారణం అయ్యుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

గత 20 రోజులుగా ఇజ్రాయిల్-హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్(Israel) భూభాగంలోకి చొరబడిని హమాస్ ఉగ్రవాదాలు దారుణమైన ఊచకోతకు పాల్పడ్దారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా(Gaza)పై వైమానికి దాడులు నిర్వహిస్తోంది. అయితే పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొస్సాద్ వంటి వ్యవస్థలు ఉన్నా కూడా ఇజ్రాయిల్, పొరుగున పాలస్తీనా(Palestine) గాజా నుంచి ఎదురయ్యే దాడిని కనిపెట్టలేకపోయింది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడుల వెనక ఉన్న కారణాలను ప్రస్తావించారు. 

Also Read: Maisa Abdel Hadi: శత్రు దేశానికి మద్దతు.. ఇజ్రాయెల్ నటి అరెస్ట్

జీ20 సదస్సులో ఇండియా…భారత్ – మిడిల్ ఈస్ట్ – యూరప్ కారిడార్ని ప్రకటించింది. ఈ కారిడార్ ప్రకటన వచ్చిన తరవాతే హమాస్‌ దాడులకు ప్లాన్ చేశారని అన్నారు బైడెన్. ఈ కారిడార్‌లో భాగంగా భారత్‌ని, మధ్యప్రాచ్యాన్ని రైల్‌, రోడ్‌, పోర్ట్‌ల ద్వారా అనుసంధానించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడి చేయడానికి చాలా కారణాలుండొచ్చని, అయితే వాటిలో ఈ కారిడార్‌ కారణం ఎక్కువగా కనిపిస్తోందని వివరిస్తున్నారు బైడెన్. ఇదే కారణమని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేకపోయినా…కేవలం ఇది తన అంచనా మాత్రమే అని చెప్పారు.

కారిడార్‌తో కనెక్టివిటీ..

ఆస్ట్రేలియా ప్రధాని యాంటోని ఆల్బనీస్‌తో భేటీ అయిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో భారత్‌, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా సమాఖ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిడిల్ ఈస్ట్ ఐరోపా ఎకనామిక్ కారిడార్‌ నిర్మాణానికి అంగీకరించాయి. ఆసియా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఐరోపా మధ్య కనెక్టివిటీని పెంచనుంది ఈ కారిడార్. ఇటీవలే ఈ కారిడార్ గురించి మాట్లాడారు బైడెన్. ఈ ప్రాజెక్ట్‌తో పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయని అన్నారు.

ఇజ్రాయేల్, గాజా యుద్ధంపై (Israel Hamas War) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ (UN Security Council) చర్చ జరిగింది. గాజాని ఇజ్రాయేల్‌ ఆక్రమించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందన్న వాదన ఇప్పటికే వినిపిస్తోంది. దీనిపై మండలి అసహనం వ్యక్తం చేసింది. గాజా పౌరుల భద్రతను పణంగా పెట్టారని మండి పడింది. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది పౌరులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది. అయితే…ఇజ్రాయేల్‌కి అమెరికా పూర్తి మద్దతునిస్తోంది. ఇజ్రాయేల్‌ తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చుని తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో ప్రస్తుత జనాభా 23 లక్షల వరకూ ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి వీళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయేల్‌ దాడుల్లో ఇళ్లు,భవనాలు నేలమట్టం అవుతున్నాయి. కొందరు శిథిలాలే కిందే చిక్కుకుపోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉంటున్నారు. అంతర్జాతీయంగా ఇది చాలా అలజడి రేపింది. తినేందుకు తిండి లేదు. గొంతు తడుపుకునేందుకు నీళ్లూ కరవయ్యాయి. ఈ దాడుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందించడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.