డాక్టర్లు చేయలేనిది చాట్‌జీపీటీ చేసి చూపింది..!

టెక్నాలజీ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్నాలజీ ప్రపంచంలోనే ప్రస్తుతం ఒక సునామీలా వచ్చి చేరింది. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపుతోంది. ఇది మనిషి ఆలోచనలు పనిగట్టినడుచుకునేది కాదు. మానవ మేథస్సుతో పోటీ పడే కృతిమ మేథ. అవును అందుకే ప్రపంచ మంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్వాగతించింది. ఈ క్రమంలోనే 3 ఏళ్లుగా 17 మంది డాక్టర్లు చేయలేనిది చేసి చూపించి చాట్‌జీపీటీ […]

Share:

టెక్నాలజీ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్నాలజీ ప్రపంచంలోనే ప్రస్తుతం ఒక సునామీలా వచ్చి చేరింది. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపుతోంది. ఇది మనిషి ఆలోచనలు పనిగట్టినడుచుకునేది కాదు. మానవ మేథస్సుతో పోటీ పడే కృతిమ మేథ. అవును అందుకే ప్రపంచ మంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్వాగతించింది. ఈ క్రమంలోనే 3 ఏళ్లుగా 17 మంది డాక్టర్లు చేయలేనిది చేసి చూపించి చాట్‌జీపీటీ మరోసారి అద్భుతం సృష్టించింది. అసలు ఇంతకీ ఏం చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఈ స్టోరీలో మొత్తం తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకు వస్తున్న గణనీయమైన మార్పులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చాట్‌ జీపీటీ సృష్టిస్తున్న అద్భుతాలను చూస్తూనే ఉన్నాం. అయితే ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో తన మార్క్‌ను చూపిస్తోంది. ఇందులో భాగంగానే వైద్య రంగంలో ఉన్న సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది. 3 సంవత్సరాలుగా 17 మంది వైద్యులు కష్టపడినా దొరకని ఓ రోగం.. చాట్‌ జీపీటీలో దొరికింది. దీంతో మరోసారి టెక్నాలజీ అవసరం తెలిసి వచ్చింది. తన కుమారుడికి వచ్చిన రోగాన్ని తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఓ తల్లి.. చివరికి చాట్‌ జీపీటీని ఆశ్రయించగా సమాధానం లభించింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఎలాంటి ప్రశ్నలకైనా సులువుగా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ గురించి.. అది చూపించిన పరిష్కారాల గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే అందులో ఎంత నిజం ఉందన్నది ప్రశ్నే అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అయినా ఈ విషయం తెలుసుకుంటే మాత్రం చాట్‌ జీపీటీతో ఏదైనా సాధ్యమే అని తెలుస్తుంది. కోర్ట్నీ అనే మహిళకు ఒక 4 ఏళ్ల కొడుకు అలెక్సా ఉన్నాడు. అయితే అతనికి గత కొన్నేళ్లుగా ఉన్న అనారోగ్యానికి గల కారణం ఏంటో ఆమె తెలుసుకోలేకపోయింది. ఎన్ని ఆస్పత్రులు, ఎంత మంది డాక్టర్ల వద్దకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కరోనా మహమ్మారి వెలుగు చూసిన సమయంలో అనారోగ్యానికి గురైన అలెక్స్‌ ను 3 సంవత్సరాల నుంచి 17 మంది డాక్టర్లు పరిశీలించారు. అయినా అతనికి ఉన్న రోగం ఏంటో ఎవరూ గుర్తించలేకపోయారు.

చివరికి కోర్ట్నీకి ఏం చేయాలో తెలియక కంప్యూటర్‌లో చాట్‌జీపీటీలో వెతకడం ప్రారంభించింది. రోజు మొత్తం అందులో తన కుమారుడికి వచ్చిన రోగం గురించి.. దాని లక్షణాల గురించి సెర్చ్ చేసింది. ఈ క్రమంలోనే తన కుమారుడికి వచ్చిన జబ్బును గుర్తించింది. ఏం తిన్నా పళ్లలో నొప్పి, కొడుకు ఎత్తు పెరగకపోవటం వంటి వింత లక్షణాలు అలెక్స్‌ కు ఉన్నాయి. తన కుమారుడికి తీసిన ఎంఆర్‌ఐ రిపోర్డ్‌లో ఉన్న ప్రతి అంశం గురించి చాట్‌ జీపీటీని ప్రశ్నలు అడిగింది. అలెక్సాకు ఉన్న వ్యాధి లక్షణాలను చాట్‌ జీపీటీకి వివరించింది. చివరకి ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్‌తో తన కొడుకు అలెక్సా బాధ పడుతున్నట్లు గుర్తించింది.

వెంటనే న్యూరోసర్జన్‌ను సంప్రదించిన కోర్ట్నీ.. తన కొడుక్కి టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌ ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆ దిశగా పరీక్షలు చేసిన డాక్టర్లు.. అలెక్స్‌ జబ్బుని గుర్తించి సర్జరీ చేశారు. దీంతో తన కుమారుడు వ్యాధి నుంచి కోలుకున్నట్లు కోర్ట్నీ తెలిపింది. గతంలో కంటే ప్రస్తుతం తన కొడుకు కొంత ఎత్తు కూడా పెరిగాడని వెల్లడించింది. అయితే వైద్య రంగంలో పలు రోగాలను గుర్తించడంలో ఇప్పటికే చాట్‌జీపీటీ ఎన్నోసార్లు సహాయపడింది.