నిజ్జర్ హత్య.. చైనా జర్నలిస్టు సంచలన ఆరోపణలు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, దాని అనంతరం జరిగిన పరిణామాలతో భారత్, కెనడాల మధ్య ఉన్న సంబంధాలు దారుణంగా పడిపోయాయి. ఇరు దేశాలు దౌత్య వేత్తలను బహిష్కరించడం వరకు వెళ్లాయి. దీంతో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన జర్నలిస్ట్, బ్లాగర్ చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి […]

Share:

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, దాని అనంతరం జరిగిన పరిణామాలతో భారత్, కెనడాల మధ్య ఉన్న సంబంధాలు దారుణంగా పడిపోయాయి. ఇరు దేశాలు దౌత్య వేత్తలను బహిష్కరించడం వరకు వెళ్లాయి. దీంతో భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన జర్నలిస్ట్, బ్లాగర్ చేసిన సంచలన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి చెందని ఆరోపణలు చేశారు. భారత్, పాశ్చాత్యదేశాల బంధాన్ని దెబ్బతిసేందుకు ఇగ్నిషన్ ప్లాన్ పేరిట ఈ కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు.

జెన్నిఫర్ జెంగ్ ఎవరు?

జెన్నిఫర్ జెంగ్ ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్‌లో సభ్యురాలు. చైనా మరియు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి ప్రత్యక్ష సమాచారాన్ని పంచుకోవడంలో ప్రసిద్ధి చెందింది. జెన్నిఫర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.  ప్రస్తుతం “ఇన్కన్వీనియంట్ ట్రూత్స్”   అనే బ్లాగును నడుపుతోంది. ఆమె బ్లాగ్ చైనా యొక్క ప్రస్తుత సంఘటనలు మరియు రాజకీయాల యొక్క లోతైన విశ్లేషణతో పాటు చైనా లోపల నుండి ప్రామాణికమైన మరియు సెన్సార్ చేయని సమాచారాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. ఆమె “ఫ్రీ చైనా: ది కరేజ్ టు బిలీవ్” అనే అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీలో కూడా పాల్గొంది.

అయితే, భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రయత్నించారని జెన్నిఫర్ వెల్లడించారు. తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న వ్యూహానికి అనుగుణంగానే ఈ కుట్రలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీసీ) హస్తం ఉందని జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. ఇలా చేయడం వెనుక చైనా లక్ష్యం ఉందని పేర్కొన్నారు. హర్దీప్ సింగ్ హత్య నేరాన్ని భారత్ వైపు తోసి.. భారత్‌కు పశ్చిమ దేశాలకు మధ్య చిచ్చు పెట్టాలని చైనా ప్రయత్నించిందని చెప్పడం సంచలనంగా మారింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన జెన్నిఫర్ జెంగ్.. హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను సీసీసీ ఏజెంట్లు హత్య చేశారని ఆరోపించారు.

దెబ్బతీయడమే లక్ష్యం

హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలో హత్య చేసేందుకు ముందు చైనాకు చెందిన ఒక ఉన్నత అధికారి అమెరికాలోని సీటెల్‌కు వచ్చారని పేర్కొన్నారు. భారత్, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా సీటెల్‌లో ఒక రహస్య సమావేశం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సీసీసీ ఏజెంట్లదే బాధ్యత అని జెంగ్ స్పష్టం చేశారు. జూన్ 18 వ తేదీన చైనా ఏజెంట్లు ఆయుధాలతో నిజ్జర్‌ను వెంబడించారని జెంగ్ వెల్లడించారు. నిజ్జర్ ఆచూకీ తెలుసుకుని అతడిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఆ తరువాత హత్యలో తమ పాత్ర బయట పడకుండా అన్ని ఆధారాలు చెరిపేశారు. కారులోని డ్యాష్‌బోర్డు కెమెరాను ధ్వంసం చేశారు. అనంతరం విమానంలో చైనాకు వెళ్లిపోయారని ఆరోపించారు.

నిజ్జర్‌ హత్యలో భారత్ పాత్ర ఉందని అనుమానాలు రేకెత్తించేందుకు దుండగులు ఘటనా స్థలంలో ఆధారాలు ఉండేలా చేసినట్లు తెలిపారు.  కావాలనే ఆ నిందితులు భారతీయ యాసతో ఇంగ్లీషులో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు. చైనా రహస్య ఏజెంట్లు భారత్‌ను దోషిగా చూపాలనే కుట్రలో భాగంగానే ఈ పని చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చైనా జర్నలిస్ట్, బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలపై చైనా ఇప్పటివరకు స్పందించలేదు.

ఈ ఏడాది జూన్ 18 వ తేదీన కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రేలోని ఓ గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజ్జర్‌ను కాల్చి చంపారు. కాగా జీ20 సమ్మిట్ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ పార్లమెంటులో ఆరోపించడం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.