అన‌సూయ రాజ‌కీయ ప్ర‌వేశం.. వేణు స్వామి జోస్యం

ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఏదో ఒక సారి జ్యోతిష్యం, జాతకం చెప్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం కొందరి జీవితంలో నిజం అవుతూ ఉంటాయి. ఇదే క్రమంలో టాలీవుడ్, పొలిటికల్ లీడర్ల, క్రికెటర్ల జాతకాలు చూసి జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి గురించి అందరం వినే ఉంటారు. ఆయన ముఖ్యంగా సెలబ్రిటీల గురించి ఎక్కువగా జ్యోతిష్యం చెప్తూ కనిపిస్తాడు. ఆయన చెప్పిన జ్యోతిష్యాల లో చాలా వరకు నిజమయ్యాయి అని అంటూ […]

Share:

ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఏదో ఒక సారి జ్యోతిష్యం, జాతకం చెప్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో జ్యోతిష్యం కొందరి జీవితంలో నిజం అవుతూ ఉంటాయి. ఇదే క్రమంలో టాలీవుడ్, పొలిటికల్ లీడర్ల, క్రికెటర్ల జాతకాలు చూసి జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి గురించి అందరం వినే ఉంటారు. ఆయన ముఖ్యంగా సెలబ్రిటీల గురించి ఎక్కువగా జ్యోతిష్యం చెప్తూ కనిపిస్తాడు. ఆయన చెప్పిన జ్యోతిష్యాల లో చాలా వరకు నిజమయ్యాయి అని అంటూ ఉంటారు.

ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలలో సమంత గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఆమె కెరీర్ 2023 వరకే బాగుంటుంది అని, తర్వాత ఆమె సినీ కెరీర్ కి బ్రేక్ పడుతుంది అని వేణు స్వామి చెప్పిన మాటలు చాలా మందికి గుర్తు వచ్చాయి. అంతేకాకుండా సమంత నాగచైతన్యల మధ్య వివాహం అనంతరం విభేదాలు వస్తాయని విడిపోతారు అని ఆయన ముందుగానే జ్యోతిష్యం చెప్పిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇటీవల కాలంలో ఆయన అనసూయ భరద్వాజ్ గురించి మాట్లాడిన ఒక వీడియో నెట్ ఇంట్లో చెక్కర్లు కొడుతోంది.

వేణు స్వామి ఏమన్నారు:

అనసూయ భరద్వాజ్ కెరీర్ విషయం వేణు స్వామి 2021లో చెప్పిన కొన్ని విషయాల సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 2021 తర్వాత అనసూయ భరద్వాజ్ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయని, అంచలంచెలుగా ఎదుగుతుంది అని చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది అని వేణు స్వామి వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన విధంగానే అనసూయ భరద్వాజ్ 2021 తర్వాత సినీ రంగంలో కూడా ఎంతగానో ఎదిగింది. ఆమెకు వరుసగా సినీ అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆయన వీడియోలో మాట్లాడుతూ ఆమె పొలిటికల్ రంగంలో కూడా అడుగుపెడుతుంది అని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికి ఆయన చెప్పిన మాటలు కొన్ని నిజమైనప్పటికీ, ఇంకా పొలిటికల్ విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు. 

అనసూయ భరద్వాజ్ గురించి మరింత:

అనసూయ భరద్వాజ్ గురించి విన్న వెంటనే ప్రతి ప్రేక్షకుడికి జబర్దస్త్ షో తప్పకుండా గుర్తు వస్తుంది. జబర్దస్త్ మొదలైంది దగ్గర నుంచి అనసూయ ఒక ప్రత్యేకమైన యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పటికీ, తర్వాత మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని అలరించింది. ముఖ్యంగా ఆమె మాటలతో, ఆమె హావ భావాలతో జనానికి ఎంతో దగ్గర అయింది. అయితే బుల్లితెర నుంచి వెండి వెండి తెరకు వెళ్లడంలో అతి తక్కువ సమయంలోనే అవకాశాలు అందిపుచ్చుకుంది అనసూయ. 

ఆమెకు సినీ రంగంలో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది అనసూయ. తన నటనతో రంగస్థలంలో ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చింది. విన్నర్ , గాయత్రి, యాత్ర , థాంక్యూ బ్రదర్ ఇలా పలు చిత్రాలలో తన నటనతో, ప్రత్యేకమైన పాత్రలలో పోషించి అభిమానులను సంపాదించుకుంది  అనసూయ భరద్వాజ్. ఇంకా ఇటీవల కాలంలో సుకుమార్ డైరెక్షన్లో వచ్చి.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన పుష్పా సినిమాలో, సునీల్ భార్య దాక్షాయని పాత్రలో నటించి అభిమానులకు దగ్గరయింది అనసూయ. 

 అనసూయ ఎటువంటి పాత్రలో నటించిన సరే ఆ పాత్రకు ఖచ్చితమైన న్యాయం జరిగేలా చూస్తుంది. రెండు నెలల క్రితం రిలీజ్ అయిన ప్రత్యేకమైన సినిమా విమానంలో ఒక వేశ్య క్యారెక్టర్ లో నటించి అనసూయ తన నటన ప్రత్యేకతను మరొకసారి గుర్తు చేసింది. విమానం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అనసూయకు మరింత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.