వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ-వెడ్డింగ్ పార్టీ

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాటి వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్-లావణ్యాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అంతకన్నా ముందు ఫ్రీ వెడ్డింగ్ విశేషాలు మీకోసమే.. ప్రీ వెడ్డింగ్ అదిరింది:  వరుణ్ తేజ్ […]

Share:

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాటి వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్-లావణ్యాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అంతకన్నా ముందు ఫ్రీ వెడ్డింగ్ విశేషాలు మీకోసమే..

ప్రీ వెడ్డింగ్ అదిరింది: 

వరుణ్ తేజ్ కొణిదెల-లావణ్య త్రిపాఠి గత రాత్రి తమ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఉత్సాహపూరిత వాతావరణంతో ప్రారంభించారు. ఈ అద్భుతమైన సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి తన పోస్ట్‌లో తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఉత్సవాలు ప్రారంభమైనట్లు చెప్పుకొస్తూ జంటను ఆశీర్వదించారు. 

చిరంజీవితో పాటు నాగేంద్రబాబు, రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల, సురేఖా వాణి, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, వైష్ణవ్ తేజ్ వంటి ప్రముఖులు, ఇతర కుటుంబ సభ్యులు హాజరై ఈ వేడుకలో కనువిందు చేశారు. పార్టీలో అల్లు అర్జున్ కుటుంబం కనిపించకపోవడం నెటిజన్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. పార్టీకి హాజరైన అల్లు కుటుంబ సభ్యులలో అల్లు శిరీష్ మరియు అల్లు అయాన్ మాత్రమే కనిపించారు. 

ఇటీవల వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి తన కాబోయే భర్త వరుణ్ తేజ్ తమ మొదటి వినాయక చవితిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందుకు వారి కుటుంబంతో కలిసి లావణ్య త్రిపాఠి కలిసి పూజలు చేసిన ఫోటోలను కాబోయే పెళ్లి కొడుకు వరుణ్ తేజ్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. 

కొత్తజంట వివాహం: 

తక్కువ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ. వారి వివాహం గురించి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచడానికి, వరుణ్ తేజ్ అలాగే త్రిపాఠిలు చూస్తున్నట్లు తెలుస్తోంది. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన మొదటి చిత్రం సెట్స్‌లో కేవలం సహనటులుగా ప్రారంభమైన ఈ జంట రిలేషన్ ఇప్పుడు, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని కొత్తజంటగా మారబోతున్నారు.

జూన్ 2023లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు, అందమైన దేశం ఇటలీని వేదికగా ఎంచుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాకపోవడంతో దానికి సంబంధించిన సన్నాహాలు ఇంకా జరుగుతున్నాయి. పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే తర్వాత ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న సెలబ్రిటీ జంటగా తెలుగు స్టార్స్ వరుణ్ మరియు లావణ్యలు నిలవనున్నారు. వరుణ్ మరియు లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఉన్నప్పటికీ, వారి పెళ్లి ఏర్పాట్లు కోసం అదే విధంగా వారి పెళ్లి గురించి, వారు కాస్త లో ప్రొఫైల్ పాటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది సన్నిహితులు, వరుణ్ మరియు లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కోసం ఇటలీకి వెళ్లనున్నారు. అయితే వారి ఇరువురు పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా కన్నులు విందుగా ఉండబోతుందని, కుటుంబీకులు, సన్నిహితులు పేర్కొన్నారు.

మనందరికీ తెలిసినట్లుగా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు గత కొంతకాలంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇటలీలోని లేక్ కోమో నిజంగా ఒక అందమైన ప్రదేశం. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు అదొక అందమైన అనువైన చోటు. అయితే మరి ప్రస్తుతానికి వరుణ్ మరియు లావణ్య ఇటలీలో ఎక్కడ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారో చూడాల్సి ఉంది.