చిన్న బ్రేక్ తీసుకున్న పూజ హెగ్డే

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నట్లు సమాచారం అయితే కంఫర్మ్ అయినట్లే. అంతేకాకుండా షూటింగ్ డిలే అవడం రీ షూట్ ఎక్కువ జరగడం వల్ల, అంతే కాకుండా ముఖ్యంగా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ రావడం వల్ల, ఆమె ఈ గుంటూరు కారం సినిమా నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం. ఇప్పుడు తను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు కూడా కన్ఫర్మ్ […]

Share:

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నట్లు సమాచారం అయితే కంఫర్మ్ అయినట్లే. అంతేకాకుండా షూటింగ్ డిలే అవడం రీ షూట్ ఎక్కువ జరగడం వల్ల, అంతే కాకుండా ముఖ్యంగా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ రావడం వల్ల, ఆమె ఈ గుంటూరు కారం సినిమా నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం. ఇప్పుడు తను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు కూడా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం పూజ సినిమాలు ఎంచుకునే ప్రాసెస్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. తొందరపడి సినిమాల్లో సైన్ చేసే ఉద్దేశం పెట్టుకోలేదు పూజ. అందుకే పూజ ప్రస్తుతానికి సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోందని పలు సినిమా వర్గాలు వెల్లడించాయి.

దూరం అవుతున్న సినిమాలు:

గుంటూరు కారం సినిమా లో పూజ ఫిమేల్ రోల్లో శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి తీయబోతున్న సినిమా షూటింగ్ అనేది ఈ సంవత్సరంలోనే మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. కానీ అది కూడా ఇప్పటికీ కన్ఫామ్ కాలేదని అర్థమవుతుంది. పూజ హెగ్డే ప్రస్తుతం తను నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో, మరోపక్క ‘గుంటూరు కారం’ నుంచి బయటకి రావడం,ఇప్పుడు వుస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకున్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కారణంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రం నుంచి బయటికి వెళ్లినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సంఘటనలు కారణంగా, పూజ కాస్త నిరాశగా ఉందని తెలుస్తోంది. అందుకే పూజ ప్రస్తుతం సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో ఆచితూచి అడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆమె నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఒక రకంగా ఆమె బాలీవుడ్ కలలు కూడా చెదిరిపోయాయి అనే చెప్పుకోవాలి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్: 

ఇటీవల వరకు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. 

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా పడింది అనే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, పవన్ కళ్యాణ్ తన రాజకీయ కట్టుబాట్లతో బిజీగా ఉన్నారని పుకార్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్ నిజమే ఏమో అని నిర్ధారణ కూడా కలిగిస్తున్నాయి. తెలుగు మీడియా ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన వారాహి విజయ యాత్రలో నిమగ్నమై ఉన్నాడు. అంతేకాకుండా AP అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున నటుడు రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

బ్రేక్ తీసుకున్న పూజ: 

ఆమె చిన్న విరామం తీసుకొని ముంబైలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఆమె సినిమాలు చూడటం మరియు స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లడం.. హాయిగా ఎంజాయ్ చేయడం మరియు పుస్తకాలు చదవడం వంటి వాటితో సమయం గడుపుతోంది అని ఒక నివేదిక చెప్పకనే చెబుతోంది. కొన్ని నెలల క్రితం, పూజా హెగ్డే సాయి ధరమ్ తేజ్‌ కలిసి సినిమా తీయబోతున్నారని, ఈ సంవత్సరంలోనే షూటింగ్ జరగబోతోందని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఏ విషయం కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. అంతేకాకుండా పూజ సినిమాల గురించి తొందరపడట్లేదని, స్క్రిప్ట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటుందని, తనకి ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి పెద్ద స్టార్స్ పక్కన నటించిన అనుభవం ఉంది కాబట్టి, తనకి కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయంటున్నారు సినిమా వర్గాలు.