మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  సినిమాపై మెగాస్టార్​ ట్విట్టర్​ రివ్యూ..

జాతి రత్నాలు సినిమాతో క్రేజీ హీరోగా పాపులారిటీ అందుకున్న నవీన్ పొలిశెట్టి, దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత రానున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి కలిసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నేడు థియేటర్లలో ఆడియెన్స్​ ముందుకు రానుంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్ కంటెంట్‌తో రానున్న ఈ చిత్రం ప్రమోషన్స్​ కార్యక్రమాలను జోరుగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న ఈ చిత్రం రానుంది. […]

Share:

జాతి రత్నాలు సినిమాతో క్రేజీ హీరోగా పాపులారిటీ అందుకున్న నవీన్ పొలిశెట్టి, దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత రానున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి కలిసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నేడు థియేటర్లలో ఆడియెన్స్​ ముందుకు రానుంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్ కంటెంట్‌తో రానున్న ఈ చిత్రం ప్రమోషన్స్​ కార్యక్రమాలను జోరుగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో హీరో నవీన్‌ పొలిశెట్టి… సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలోనూ, హీరోయిన్​ అనుష్క… అన్విత రవళిశెట్టి అనే షెఫ్‌ పాత్రలో నటించారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారట. సినిమా ఆయనకు ఎంతగానో నచ్చేసిందట. దీంతో చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలుపించుకుని అభినందించారట. ఇంకేముంది బొమ్మ హిట్టు!

సినిమా చిన్నదైనా, పెద్దదైనా బాగుంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా ప్రోత్సహిస్తారు. వారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తారు. వారిని అభినందిస్తారు. ఇప్పుడు ఆ అభినందనలు, ప్రశంసలు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్ర బృందానికి దక్కుతున్నాయి. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను చిరంజీవి చూశారు. ఆయనకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. వెంటనే చిత్ర హీరో నవీన్ పొలిశెట్టి, దర్శకుడు మహేష్ బాబు, నిర్మాత వంశీని తన ఇంటికి పిలిపించుకుని వారిని అభినందించారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి చూశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. జాతి రత్నాలు సినిమాకి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పొలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉన్న మనందరి ‘దేవసేన’ అనూష్క శెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అవడంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి 100 శాతం ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనడంలో సందేహం లేదు’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, దర్శకుడు మహేష్ బాబు, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా, సంగీత దర్శకుడు రథన్, ఇతర చిత్ర బృందానికి చిరంజీవి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు, తన సినిమా ప్రచారం కోసం హీరో నవీన్ పొలిశెట్టి చాలా కష్టపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషనల్ టూర్ చేశారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పుడు అమెరికాలో ఈ సినిమాకు ప్రచారం కల్పించడానికి వెళ్తున్నారు. అమెరికాలోని డల్లాస్‌లో రేపు (సెప్టెంబర్ 6న) ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ ప్రీమియర్ షోను ఆడియెన్స్‌తో కలిసి నవీన్ చూడబోతున్నారు. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. ఇక ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.