గేమ్ చేంజర్.. కియారా ఫ‌స్ట్ లుక్ అదుర్స్

మొదటిలో కియారా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రివిల్ అయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ […]

Share:

మొదటిలో కియారా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్టర్, నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రివిల్ అయిన సంగతి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్, ఆమె బర్త్డే సందర్భంగా ఈరోజు విడుదల కాబోతోంది. 

గేమ్ చేంజర్ అనేది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

కియారా అద్వానీ గురించి మరింత: 

ఆమె ప్రస్తుతం టాలీవుడ్ సినిమా గేమ్ చేంజెస్ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా నటిస్తోంది. ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా గేమ్ చేంజెస్ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ రివిల్ కానుంది. ఆమె టాలీవుడ్ లోనే కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె హవా కొనసాగిస్తుంది.

సినిమా డైరెక్టర్ గురించి: 

అందుకున్న సమాచారం ప్రకారం, సినిమా చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుకున్న తేదీకి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడంతో అనుకున్న తేదీకి విడుదల చేయాలా వద్దా అనే విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.

శంకర్ -రామ్ చరణ్‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమాలో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది. 

శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రాలు: 

శంకర్ తీసిన రెండు భారీ చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ కాకుండా, ప్రముఖ దర్శకుడు కమల్ హాసన్‌తో ఇండియన్ 2లో కూడా కలిసి పని చేశారు. వారి 1996లో హిట్ అయిన ఇండియన్‌కి సీక్వెల్, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఏడాది విడుదల కానుంది. శంకర్ ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలను వర్క్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అవుతాడని ఆశిద్దాం. 

రామ్ చరణ్ గురించి మరింత: 

చరణ్ తన మొదటి చిత్రం చిరుత (2007)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ డూపర్ హిట్ అయిన RRR (2022), ఇది ₹1,200 కోట్లు (US$150 మిలియన్లు) సంపాదించింది, తర్వాత అదే అత్యధిక వసూళ్లు సాధించింది. RRRలో తన నటనతో ఆకర్షించి, యాక్షన్ మూవీలో ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్లో అవార్డ్స్‌ అందుకున్నాడు.