బిగ్ బాస్ సీజన్ 7లో అత్యధిక రెమ్యూనరేషన్  తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. దేశంలోనే నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. తెలుగులోకి అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో వచ్చిన ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీజన్ 7 కూడా ప్రారంభం అయి రెండోవారం రంజుగా సాగింది. ముఖ్యంగా నామినేషన్స్ ఎపిసోడ్‌తో మంచి హైప్ వచ్చింది. మొత్తం 15 వారాలు పాటు సాగే ఈ ఉల్టా పుల్టా […]

Share:

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. దేశంలోనే నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. తెలుగులోకి అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో వచ్చిన ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీజన్ 7 కూడా ప్రారంభం అయి రెండోవారం రంజుగా సాగింది. ముఖ్యంగా నామినేషన్స్ ఎపిసోడ్‌తో మంచి హైప్ వచ్చింది. మొత్తం 15 వారాలు పాటు సాగే ఈ ఉల్టా పుల్టా సీజన్‌ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌లో ఇద్దర్ని ఆల్రెడీ హౌస్ నుంచి బయటకు పంపేశారు. కిరణ్ రాథోడ్, షకీలా వంటి సుప్రసిద్ధ సెలబ్రిటీలు ఇటీవల ఈ షోకి వీడ్కోలు పలికారు.

ప్రస్తుతం హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. హోస్ట్ నాగార్జునతో కలిపి 13 మంది. అయితే ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్‌కి సంబంధించి ఎవరికి ఎంత ఇచ్చారనేది ఇంట్రస్టింగ్. నిజానికి బిగ్ బాస్ అగ్రిమెంట్స్ ప్రకారం.. ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మిగిలిన వాళ్లకి ఎంత అనే విషయాలను షేర్ చేసుకోకూడదు. కాబట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరూ ఈ రెమ్యూనరేషన్ లెక్కల్నిబయటపెట్టరు. 

ఎంతిచ్చారు బాసూ అని అంటే.. బాగానే ఇచ్చారు.. మేం అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు.. అబ్బే మీరుకున్నంత ఎక్కువేం కాదు.. అని ఇలా డొంకతిరుగురు సమాధానాలు ఇస్తారు తప్పితే.. వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ లెక్కల్ని మాత్రం బయటపెట్టారు. అయితే ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. ఈ సీజన్‌లో ఆటా సందీప్ అత్యధిక పారితోషికం పొందుతున్న పోటీదారు అని, వారానికి 4.5 లక్షల ఆకట్టుకునే రెమ్మ్యూనిరేషన్ తీసుకుంటున్నారని తెలిసింది.  శివాజీ కి బిగ్ బాస్ నిర్వాహ‌కులు వారానికి రూ.4 ల‌క్షలు, ష‌కీల‌కు రూ.3.5 లక్షలు, అమ‌ర్ దీప్ వారానికి రూ. 2.50లక్షలు, హీరోయిన్ కిరణ్ రాథోడ్ వారానికి రూ. 2.40 లక్షలు, ప్రియాంక జైన్, శోభా శెట్టి కూడా వారానికి రూ. 2.25 లక్షలు ఛార్జ్ చేస్తున్నార‌ని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక, టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో ‘ఆట’ ఫస్ట్‌ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్‌ కూడా డ్యాన్సరే.. సందీప్ తన భార్యతో పాటు సోషల్ మీడియాలో గణనీయమైన ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు.  ముందుగా అదిరిపోయే డ్యాన్సుతో స్టేజ్‌పై దుమ్ము లేపిన అతడు.. ఆ తర్వాత తనదైన మాటలతో హోస్టు నాగార్జుననే అవాక్కయ్యేలా చేశాడు. మొత్తానికి ఫేవరెట్లలో ఒకడిగానే హౌస్‌లోకి అడుగు పెట్టేశాడు. మరియు ఇటీవలి సినిమాతో సినిమా ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టాడు.

గత శనివారం వీకెండ్ కావడంతో కాస్త ఆసక్తిగా ఉండేందుకు ప్లాన్ చేశాడు బిగ్ బాస్. పవర్ అస్త్రా కోసం సందీప్, ప్రియాంక మధ్య పోటీ పెట్టాడు. ఒక బెంచ్ మీద ఇద్దరూ నడుస్తూ.. చివరన ఉన్న ఓ బుట్టలో బంతులు వేయాలి. బిగ్ బాస్ సీజన్ 7 కావడంతో 7 నిమిషాల టైమ్ ఇచ్చాడు. ఎవరు ఎక్కువ బంతులు వేస్తే వారే విన్నర్ అని చెప్పాడు. ప్రియాంక మెుత్తం 34 బంతులు వేయగా.. సందీప్ 43 బంతులు వేశాడు.

ఆట సందీప్ పవర్ అస్త్రా రేసులో విన్నర్ అయ్యాడు. ప్రియాంకతో దాన్ని సందీప్‍కు ఇప్పించాడు నాగార్జున. ముందుగానే ఓ విషయం చెప్పాడు నాగ్. పవర్ అస్త్రాతో 5 వారాల ఇమ్యూనిటీతో పాటుగా చాలా లాభాలు ఉంటాయని తెలిపాడు. పవర్ అస్త్రా గెలిచిన వ్యక్తి మెుదటి హౌజ్ మేట్‍గా ఆట సందీప్ కన్ఫర్మ్ అయ్యాడు. మిగిలిన 11 మంది కంటెస్టెంట్ల్ బెర్త్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వారు హౌజ్ మేట్ అయ్యేందుకు పోటీలను ఎదుర్కోవలసి ఉంటుంది.