డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్న వరుణ్-లావణ్య జంట

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాటి వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్-లావణ్యాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  ఎంగేజ్మెంట్ తో సర్ప్రైజ్ ఇచ్చిన జంట:  వరుణ్ మరియు లావణ్య 2023, జూన్ 10న […]

Share:

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠిలు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాటి వివాహం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీలో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వరుణ్-లావణ్యాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఎంగేజ్మెంట్ తో సర్ప్రైజ్ ఇచ్చిన జంట: 

వరుణ్ మరియు లావణ్య 2023, జూన్ 10న తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో, అల్లు అర్జున్ తన భార్య స్నేహతో మరియు ఇతర అల్లు-కొణిదెల కుటుంబ సభ్యులు ఈ జంట నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న జంట అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తమ జంట ఫస్ట్ ఫోటోలను పంచుకున్నారు. అంతేకాకుండా వారు కలిసి, ట్రావెల్ చేస్తున్నట్లు నిశ్చితార్థం తర్వాత కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వెంటనే, చాలామంది భారతీయ సినీ ప్రముఖుల నుండి సోషల్ మీడియాలో వారికి ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు.

లావణ్య త్రిపాటి- వరుణ్ తేజ్ చాలా సుమారు 5-6 సంవత్సరాలుగా రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఎక్కువగా ఎవరికి తెలియదు, అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వారిద్దరూ పెళ్లితో ఒకటవ్వబోతున్నట్లు ఫాన్స్ అందరికీ ఒక శుభవార్త తెలిపారు.

తక్కువ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ. వారి వివాహం గురించి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచడానికి, వరుణ్ తేజ్ అలాగే త్రిపాఠిలు చూస్తున్నట్లు తెలుస్తోంది. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన మొదటి చిత్రం సెట్స్‌లో కేవలం సహనటులుగా ప్రారంభమైన ఈ జంట రిలేషన్ ఇప్పుడు, డెస్టినేషన్ వెయిటింగ్ చేసుకొని కొత్తజంటగా మారిపోతున్నారు.

కొత్తజంట వివాహం: 

జూన్ 2023లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు, అందమైన దేశం ఇటలీని వేదికగా ఎంచుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాకపోవడంతో దానికి సంబంధించిన సన్నాహాలు ఇంకా జరుగుతున్నాయి. పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే తర్వాత ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న సెలబ్రిటీ జంటగా తెలుగు స్టార్స్ వరుణ్ మరియు లావణ్యలు నిలవనున్నారు. వరుణ్ మరియు లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఉన్నప్పటికీ, వారి పెళ్లి ఏర్పాట్లు కోసం అదే విధంగా వారి పెళ్లి గురించి, వారు కాస్త లో ప్రొఫైల్ పాటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది సన్నిహితులు, వరుణ్ మరియు లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కోసం ఇటలీకి వెళ్లనున్నారు. అయితే వారి ఇరువురు పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా కన్నులు విందుగా ఉండబోతుందని, కుటుంబీకులు, సన్నిహితులు పేర్కొన్నారు.

మనందరికీ తెలిసినట్లుగా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు గత కొంతకాలంగా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇటలీలోని లేక్ కోమో నిజంగా ఒక అందమైన ప్రదేశం. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు అదొక అందమైన అనువైన చోటు. అయితే మరి ప్రస్తుతానికి వరుణ్ మరియు లావణ్య ఇటలీలో ఎక్కడ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారో చూడాల్సి ఉంది.